Tuesday, November 30, 2010

జగన్‌ వైపు చూడొద్దు

cm-speach దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌, సతీమణి విజయమ్మల రాజీనామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం హుటాహుటిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఇక్కడి లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌లో సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి నగరంలో అందుబాటులో ఉన్న తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాకు చెందిన సుమా రు 60 మంది వరకు హాజరయ్యారు. కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామా లపై సీఎం, ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.

ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు కు చేరుకున్న సీఎంకు జగన్‌, విజయమ్మల రాజీనామా విషయం అక్కడే తెలి సింది. దీంతో ఆయన అక్కడి నుంచి ఫోన్‌లో తన అనుచరులతో మాట్లాడి ఆరా తీసినట్లు సమాచారం. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న సిఎం, మధ్యా హ్నం రెండుగంటలకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కలవాలని నగరంలో అందు బాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం పంపించారు. వీరి సమా వేశానికి ముందు సీఎం రాజభవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆయన మంత్రి వర్గ జాబితాను అందజేసినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.అక్కడి నుంచి ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు...రాజీనామా సందర్భంగా జగన్‌ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై చేసిన విమర్శలు, ఆరోపణలను మీరంతా ముక్తకంఠతో ఖండించాలి. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించండి. అక్కడక్కడ కొందరు జగన్‌ మద్దతు దారుల ముసుగులో గొడవలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.

శాంతి భద్రతలను కాపాడటం రాజీ పడబోమని, మీరు కూడా ఇందుకు సహాకరించాలి. సోనియా నాయకత్వాన్ని బలపరూస్తూ ఆమె పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో పదవులు, అవకాశాలిచ్చింది. దాంట్లో భాగంగానే ఆయన కూడా ఉన్నన్ని రోజు లు పార్టీకి విధేయుడిగా పనిచేశారు. కనుక వైఎస్‌ఆర్‌ని మీరు, పార్టీ నేతలు ఎవరు కూడా ఎక్కడ విమర్శించొద్దు. పార్టీ అధిష్ఠానం మనపై (ఆంధ్రాపై) ఎన్నో ఆశలుపెట్టుకుంది. సోనియా, ప్రధాని మన్మోహన్‌, చిదంబరం, ఆంటోని రాష్ట్రా న్ని అగ్రగ్రామిగా చూడాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా అభివృద్ధి చేయడానికి తమ పూర్తి సహాకారం ఉంటుందని ప్రధాని హమీ ఇచ్చారు. ఎప్పుడు వచ్చినా మీ కోసం ద్వారాలు తెరచి ఉంటాయన్నారు.

మంత్రి పదవులు అందరికీ ఇవ్వలేను. అందుకే రాని వారు నిరాశపడొద్దు. పదవులు రానంత మాత్రానా అసమర్ధులు కాదని, వారు అవకాశం రాని వారు మాత్రమే. నేను కూడా మంత్రి కాకుండానే సీఎం అయ్యాను. అందరికి ఇలాగే గుర్తింపు వస్తుంది. నియోజ కవర్గాలకు మీరే హీరోలు. మీరు చెప్పినట్లే అన్ని జరుగుతాయి. అక్కడ పార్టీ, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది, అని కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సిఎం వ్యాఖ్యలను బలపరు స్తూ కె.జానారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదించారు.

మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డి. శ్రీధర్‌బాబు, ఆనం రామ నారాయణరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దానం నాగేందర్‌, బాలరాజు, సబితా ఇంద్రారెడ్డి, శత్రుచర్ల, జె.గీతారెడ్డి, డొక్క మాణిక్య వర ప్రసాద్‌, గల్లా అరుణకుమారి, డి.కె.అరుణ, ధర్మాన ప్రసాద్‌రావు, వట్టి వసంత కుమార్‌, ఆర్‌.వెంకట్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, విశ్వరూప్‌, గాదె వెంకట్‌ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, జెసి. దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, బి.బిక్షమయ్య గౌడ్‌, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీలు తదిత రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వారందరు పార్టీ అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టు బడి ఉంటామని సీఎంకు భరోసా ఇచ్చారు.

చిరుతో భేటి వాయిదా?
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం అనంతరం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పీఆర్పీ అధినేత చిరంజీవితో భేటీ కానున్నట్లు వార్తలు వచ్చాయి. మంత్రివర్గంలో చేరే విషయంతో పాటు జగన్‌ పరిణామాల పై చిరు, సీఎం మధ్య చర్చ జరిగే అవకాశాలున్నట్లు వినిపించింది. అయితే అనివార్య కారణాల వల్ల చిరు భేటి వాయిదా పడింది. మంగళవారం చిరుతో సీఎం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త మంత్రివర్గంలో పీఆర్పీని తీసుకునే అవకాశాలు లేవని స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు అనంతరం పరిణామాలను బేరీజు వేసుకుని రెండవ విడత చేపట్టే మంత్రివర్గ విస్తరణలో పీఆర్పీని చేర్చుకునే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

Monday, November 29, 2010

వైయస్ జగన్ ను శత్రువుగా జతకట్టిన ముఖ్యమంత్రి కిరణ్

వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామాస్త్రాన్ని తిప్పి కొట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం ఫలితం కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. సోమవారం కిరణ్ పార్టీ సమావేశం పెట్టారు. పార్టీలో అందరం కలిసే పని చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారు. సోనియా దిష్టిబొమ్మలను తగులబెట్టిన శత్రువులను సహించకూడదని ఆయన చెప్పారు. సమావేశంలో సాక్షి పత్రికలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారు తీర్మానం చేశారు. పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటామని అందరూ చెప్పారు. సమావేశ అనంతరం పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ జగన్ రాజీనామాను తప్పుబట్టారు.

మాజీమంత్రులు బాలరాజు, కన్నా లక్ష్మీనారాయణ, దానం నాగేందర్, జానారెడ్డి తదితరులు జగన్, ఆయన తల్లి విజయమ్మ రాజీనామాలను దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిణామాలు కాంగ్రెసు పార్టీకి కొత్త కాదని వారు అన్నారు. జగన్ పార్టీ వీడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. సోనియా ఆశయ సాధనకు పార్టీని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జగన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం తొందరబాటని, దురదృష్టకరమన్నారు. రాజీనామాకు గల కారణాలు జగన్ పేర్కొన్నవి అసంబద్దమైనవన్నారు.

సోనియా గాంధీ ఫ్లెక్సీ, బొమ్మలు తగులపెట్టడం, శవయాత్రలు చేయటం చాలా దుర్మార్గమన్నారు. త్యాగశీలి అయిన సోనియాను లక్ష్యంగా చేసుకొని జగన్ వర్గం మాటలు జారడం సరికాదన్నారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు సోనియాగాంధీకి ఎప్పుడూ అవమానం జరగలేదన్నారు. తన కుమారుడు ఇలా చేయడం పట్ల రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాజకీయంలో 30 ఏళ్ల అనుభవం ఉండి శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెసు కార్యకర్తగా ఉన్న వైయస్ వివేకానందకు మంత్రి పదవి ఇస్తే తప్పవుతుంది. కాని ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ముఖ్యమంత్రి ఇవ్వడం తప్పు కాదా అని వారు ప్రశ్నించారు. సీనియారిటీ కన్నా సిన్సియారిటీ లేని వారికి ప్రాధాన్యం ఇవ్వలా అని వారు అన్నారు.

Sunday, November 28, 2010

ఆశా ‘కిరణ ’మవుతారా ?

  cm-raise
ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాణిస్తారా? ఇప్పుడున్న అనేక రకాల ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకునే సత్తా ఆయనకు ఉందా? మొన్నటి వరకూ సాధారణ ప్రజ లకు దూరంగా ఉన్న కిరణ్‌ ఇప్పుడు జనంతో మమే కం కాగలరా? జమిందారీ కుటుంబం నుంచి వచ్చి న ఆయన సామాన్యుల సమస్యలను పరిష్క రించగలరా? మొదటి నుంచి మీడియాకు దూరం గా ఉండే కిరణ్‌.. మీడియా ప్రాధాన్యం పెరిగిన ఈ నేపథ్యంలో ఆ మేరకు వ్యవహరించగలరా?

ప్రధా నంగా.. వైఎస్‌ మాదిరిగా బలమైన ప్రధాన ప్రతి పక్షం తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, ఆ విషయంలో పార్టీ లోని ఇతరుల సహకారం ఆయనకు అందుతుందా?పార్టీనీ-ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించే ఆశా ‘కిరణ’మవు తారా?.. ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి.

jai-krianఈ రాష్ట్రానికి 16వ ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నల్లారి వ్యక్తిగత వ్యవహార శైలి, ఇప్పటివరకూ ప్రజలతో ఆయన అనుసరించిన విధానం, ప్రాంత నేపథ్యం వంటి అంశాలు పరిశీలిస్తే.. భవిష్యత్తులో ఆయన తన ముందున్న సమస్యలు, ఇంతకుముందు ఉన్న సీఎంలు ఎదుర్కొన్న మాదిరిగానే కొనసాగుతున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించి, అధిగమించగ లరా అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలయింది. మొదటి నుంచి జమీందారీ కుటుంబమయిన కిరణ్‌కుమార్‌రెడ్డికి నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రజలతో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, స్పీకర్‌గా ఉన్నా సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి అంతా చక్కదిద్దుతున్నారు. సాధారణ ప్రజలతో కిరణ్‌ మమేకమయిన సందర్భాలు గానీ, వారితో కలసిపోయే సందర్భాలు గానీ తక్కువన్నది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ప్రజలతో ఆయనకు పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవన్నది ఆ జిల్లా, నియోజకవర్గ వాసుల అభిప్రాయం.

kiraaఅయితే, తన అభిప్రాయాలు ముక్కుసూటిగా వ్యక్తం చేసే కిరణ్‌పై అవినీతి ఆరోపణలు లేవు. సిఫారసు లేఖలు ఇచ్చే అలవాటు కూడా లేదు. పని అయితే అవుతుందని, లేకపోతే కాదని ఖరాఖండీగా చెప్పే మనస్తత్వం ఆయనది. తన వద్దకు పనుల కోసం వచ్చిన వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్లు చేస్తుంటారు. నేరుగా ప్రజలను కలిసే అలవాటు పెద్దగా లేని కిరణ్‌.. ఇప్పటివరకూ తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార బాధ్యతను మండలాలు, గ్రామాల్లో ఉన్న తన ప్రధాన అనుచరులకే అప్పగిస్తూ వస్తున్నారు. అంటే ప్రజలు తమ సమస్యలు వారికి చెప్పుకుంటే, సదరు నేతలు కిరణ్‌కు చెప్పి వాటిని పరిష్కరిస్తుంటారన్న మాట! అంతే తప్ప ఇంటివద్దకు వచ్చిన ప్రజలతో మాట్లాడే అలవాటు పెద్దగా లేదు.

ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన ముఖ్యమంత్రి. సమస్యలు వినిపించేందుకు వివిధ వర్గాల ప్రజలు వందల సంఖ్యలో వస్తుంటారు. సాధ్యం కాని కోరికలు కూడా కోరుతుంటారు. వారికి తగిన సమయం కేటాయించడంతో పాటు, చాలా సహనం-ఓర్పుతో సమాధానం ఇవ్వాల్సి ఉంది. నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోయినా వారిలో నమ్మకం కలిగించాలి. ఎమ్మెల్యే-స్పీకర్‌-చీఫ్‌ విప్‌గా ఉన్నప్పటి మాదిరిగానే వారితో వ్యవహరిస్తే అవి చెడు సంకేతాలుగా వెళ్లి, దుష్ర్పచారంగా మారి ప్రజల్లో విస్తృత ప్రచారమయ్యే ప్రమాదం లేకపోలేదు.

sanmanamఇక ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు, వారి అవసరాలు తీర్చడంలోనే కిరణ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. వైఎస్‌ తన వద్దకు వచ్చి ఎమ్మెల్యేలందరికీ వారి చెప్పిన పనులన్నీ చేయక పోయినా భుజం తట్టి పంపేవారు. రోశయ్య మాత్రం తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలకు ఒక్క పనికూడా చేసిపెట్టకపోగా, వ్యంగ్యాస్త్రాలు సంధించ డంతో అసలు ఎమ్మెల్యేలు పేషీ ముఖం చూడటమే మానేశారు. సుదీర్ఘకాలం పదవిలో కొనసాగాలంటే ఎమ్మెల్యేలతో సత్సంధాలు పెట్టుకోకపోతే, ఆయన పరిస్థితీ మరో రోశయ్య కాక తప్పదని పార్టీ వర్గాల వ్యాఖ్యానిస్తున్నాయి.

cm-chidabramపేషీలో కూడా సమర్థులను నియమించు కోకపోతే రోశయ్య మాదిరిగానే సమస్యలు, విమర్శ లు ఎదుర్కోవలసి వస్తుంది. రోశయ్య హయాంలో ఆర్థిక శాఖ నుంచి తెచ్చుకున్న తన పాత సిబ్బందినే పీఎస్‌, పీఏ, ఓఎస్‌డీలు నియమించుకున్నారు. వారిలో ఒక్కరికీ ఎమ్మెల్యేలు, మీడియాతో సంబంధాలు లే పోవడంతో ప్రభుత్వమే ఇబ్బందిపడవలసి వచ్చింది. రోశయ్య మాదిరిగానే వారు కూడా సీఎం పేషీకి వచ్చినా ఇంకా ఆర్థికశాఖలో ఉన్నట్టే వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయంలో కిరణ్‌ ఆచితూచి వ్యవహరించి, ప్రజా్రపతినిధులు, మీడియాతో సన్నిహిత సంబంధాలున్న వారిని నియమించు కోకపోతే సమస్యలు తప్పవంటున్నారు.

cm-sirస్థానికంగానయినా, చిత్తూరు జిల్లా స్థాయిలో నయినా మీడియాతో మొదటినుంచీ సత్సంబం దాలు తక్కువేనంటున్నారు. హైదరాబాద్‌ స్థాయి లోనూ కొంతమందితో తప్ప మొత్తంగా మీడియా తో సన్నిహిత సంబంధాలు లేవు. ఇప్పుడు రాజకీయాల్లో మీడియా ప్రాధాన్యం పెరిగింది. మీడియాపై ఎన్ని విమర్శలున్నప్పటికీ, దాని ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదన్నది నిర్వివాదం. చీఫ్‌విప్‌, స్పీకర్‌గా పనిచేసిన ఆయనకు అది అనుభవమే.

అయితే, అప్పుడు ఆయనకు మీడియాతో పెద్దగా పనిలేదు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఆంక్షలు విధించడం ద్వారా ‘కిరణ్‌ మీడియా వ్యతిరేకి’ అన్న ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో.. మీడియా విషయంలో ఆయన ధోరణి అదేవిధంగా కొనసాగిస్తారా? లేక కాలమాన రాజకీయ పరిస్థితులు, అవసరాలు, మనుగడను దృష్ట్యా పాత ధోరణి మార్చుకుని ఆ ముద్ర తొలగించుకుంటారా అన్నది మరో ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితిలో మీడియా వ్యతిరేక ధోరణి అనుసరిస్తే కష్టమేనంటు న్నారు. రోశయ్య హయాంలో మీడియాలో ఒక వర్గాన్నే ప్రోత్సహించే వారు. వైఎస్‌ హయాంలో మీడియా భేటీల విషయంలో ప్రెస్‌ సెక్రటరీ ద్వారా అపాయింట్‌ మెంట్లు ఇచ్చేవారు.
దానితో ఎలాంటి సమస్యలూ రాలేదు.

cm-huggఈ విషయంలో నిన్నటి వరకూ కొనసాగిన ప్రెస్‌ సెక్రటరీ సఫలీకృతులయ్యారు. రోశయ్య ఆ పద్ధతి మార్చేశారు. నచ్చిన వారినే ప్రోత్సహిం చడం, ప్రెస్‌ సెక్రటరీతో సంబంధం లేకుండా అపాయింట్‌ మెంట్లు ఇవ్వడంతో చాలామంది దూరమయిన పరిస్థితి ఏర్పడింది. మరి కిరణ్‌ కూడా ‘ఆస్థాన విద్వాంసుల’కే పరిమితమవుతారా? లేక అందరివాడవుతారా చూడాలి.ఇక ప్రధానంగా.. ప్రతిపక్షమైన టీడీపీని ఎదుర్కొనే విషయంలో కిరణ్‌ ఎంతవరకూ సఫలమవుతారన్నదీ ఆసక్తికరంగా మారింది. చీఫ్‌ విప్‌గా ఉన్నప్పుడు టీడీపీపై ఒంటికాలుతో విరుచుకుపడిన కిరణ్‌, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆ మోతాదులో ఎదుర్కోగలరా అన్నదీ మరో ప్రశ్న.


రాష్ట్రంలో ఇప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు మారి, నాలుగో కృష్ణుడు కూడా రాబోతున్నారన్న అభిప్రాయం, కాంగ్రెస్‌లో మళ్లీ సీఎంలను మార్చే సంస్కృతి ప్రారంభమయిందన్న ప్రచారం మొదలయిన నేపథ్యంలో.. ప్రజల్లో పార్టీపై మళ్లీ 1983 మాదిరిగానే దురభిప్రాయం మొదలవుతుంది. అటు సొంత పార్టీలోని ప్రత్య ర్థులు, ఇటు టీడీపీని ఏకకాలంలో ఎదుర్కోవడం లోనే ఆయన రాణిస్తారా లేదా అన్నది తేలుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సొంత ముద్రతో ఢిల్లీలో పనులు చక్కబెడుతున్న సీఎం * సలహాదారులు సహా జగన్ వర్గం ఔట్

సొంత ముద్రతో ఢిల్లీలో పనులు చక్కబెడుతున్న సీఎం
సలహాదారులు సహా జగన్ వర్గం ఔట్
దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి
బుధవారం నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం


నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వినూత్నంగా ముందుకు పోతున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు అధిష్టానం మాట వింటూనే మరోవైపు తన ముద్ర వేసుకుంటూ పావులు కదుపుతున్నారు. అంతా గోప్యంగానే ఆయన ఢిల్లీలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. తనతోపాటు ఎల్లవేళల ల్యాప్‌టాప్ ఉంచుకుని ఢిల్లీ పెద్దలకు పంపవలసిన లేఖలు కూడా ఆయనే స్వయంగా రాసుకుంటున్నారు.

ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థకు భరతవాక్యం పలుకుతూ సలహాదారుల రాజీనామాను తీసుకోవలసిందిగా చీఫ్ సెక్రటరీని ఆదేశించినట్లు ఆయనే నేడు స్వయంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణవారికే ఇస్తున్నట్టుకూడా ఆయన వెల్లడించారు. నూతన మంత్రివర్గం బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేస్తుందని కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

కొత్త మంత్రి వర్గంలో జగన్ వర్గానికి చోటు లేదని ఢిల్లీ నుంచి తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తేలిపోయింది. జగన్ ఓదార్పు యాత్రలో చురుగ్గా పాల్గొన్న వారెవరికీ పదవులు లేనట్టే. అయితే మరీ సీనియర్లు అయిన వారిని కూడా ప్రస్తుతానికి దూరం పెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. జిల్లాకు ఒకరు చొప్పున ప్రస్తుతం మంత్రుల జాబితా తయారు అయినట్టు తెలుస్తున్నది. అయితే బయటకు వచ్చిన సమాచారమంతా ఆనోటా, ఈనోటా విన్నదేగాని, అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రం సోనియాగాంధీని కలుసుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో సంక్షిప్తంగా మాట్లాడారు. మంత్రి వర్గంలో ఎవరెవరుంటారని అడిగిన ప్రశ్నలకు బుధవారమే తెలుస్తుందని ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గం ఉంటుందని ఆయన అన్నారు.

నూతన మంత్రి వర్గంలో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డికి ప్రాతినిథ్యం ఉంటుదని తెలుస్తున్నది. అలాగే రోశయ్య నిష్క్రమణతో వైశ్యులకు అన్యాయం జరిగిందని భావిస్తున్న వారికి సంతృప్తి కలిగిస్తూ టీ.జీ. వెంకటేష్‌కి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎం పదవి దామోదర రాజనర్సింహకు ఇస్తారని ఢిల్లీలో బాగా ప్రచారంలో ఉంది.

పీసీసీ అధ్యక్షుడుగా బొత్స సత్యన్నారాయణపేరు వినిపిస్తున్నా ఆయన మంత్రి పదవి కూడా ఉంటేనే పీసీసీ అధ్యక్ష పదవికి సై అంటున్నట్లు సమాచారం అందుతున్నది. అయితే ఈ పరిణామాలపై ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉన్నది.

కొంచెం గారంగా.. కొంచెం కారంగా !

konchemముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి, గత రెండు రోజుల నుంచి వివిధ సందర్భాలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పరిశీలిస్తే.. తనకు ముందు ‘విజయవంతమైన ముఖ్యమంత్రులు’ గా పనిచేసిన వారిలో నచ్చిన అంశాలను తీసుకుని, ఆ మార్గం లో పయనించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన రాజకీయ-పరిపాలనా పరమైన పద్ధతుల్లో చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి ముఖ్యమైన వ్యవహారాల్లో కొణిజేటి రోశయ్య దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఆలోచనా ధోరణి స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో సీఎం వ్యవహారశైలి గమనిస్తే.. కొంత కటువుగా, మరికొంత మృదువుగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది.

పరిపాలనకు సంబంధించిన విషయాల్లో బాబు దారిలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ధోరణి చెబుతోంది. ఐఏఎస్‌-ఐపిఎస్‌-ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో సమావేశం, తొలిరోజు శాసనసభలోని కమిటీ హాల్‌లో ఏర్పాటుచేసిన తొలి మీడియా భేటీలో ప్రస్తావించిన అంశాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. పరిపాలన పారదర్శకంగా ఉండాలని, గవర్నరెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తానని, క్షేత్రస్థాయి నుంచి సంస్కరణలు ప్రారంభిస్తానని చెప్పడం చూస్తే.. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత చేపట్టిన విధానాల దారిలోనే కిరణ్‌ కూడా నడుస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ఆయన సంస్కరణలు, అధికారులను ప్రజలకు జవాబుదారీగా చేయడం వల్లే మంచి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఆ క్రమంలో అధికారులతో కఠినంగా వ్యవహరిం చడం ద్వారా ఫలితాలు రాబట్టగలిగారు. ఇప్పుడు ఉత్తమ ముఖ్యమంత్రిగా తాను కూడా అలాంటి సంస్కరణల ద్వారానే ప్రజలకు దగ్గరవాలని కిరణ్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక పేద ప్రజలకు సాయం, ప్రజలకు అందుబాటులో ఉండే అంశాల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ఆయన ధోరణి చాటుతోంది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే నిమ్స్‌లోని ఆరోగ్యశ్రీ వార్డును సందర్శించడం ద్వారా తాను కూడా వైఎస్‌ మాదిరిగానే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తానన్న సంకేతాలు పంపించారు. ప్రతి ఒక్క పథకం పేదలకు అందాలని, పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని స్పష్టం చేయడం ద్వారా.. వైఎస్‌పై ఉన్న పేదల ముద్రను తాను కొనసాగిస్తానని చెప్పగానే అర్ధమవుతోంది. రాజశేఖరరెడ్డి మాదిరిగానే కిరణ్‌ కూడా మొదట్లో లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ నుంచే పరిపాలన కొనసాగిస్తుండటం ప్రస్తావనార్హం.

ఇక అత్యంత కీలకమైన ఆర్థికపరమైన అంశాల్లో మాత్రం నిస్సందేహంగా రోశయ్య దారిలోనే నడవనున్నారు. అది అనివార్యంగాకూడా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలలో కోత విధించడం ద్వారా ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు రోశయ్య అమలుచేసిన వ్యూహాన్నే కిరణ్‌ కూడా అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘పథకాలలో ఉన్న లొసుగులను తొలగించి, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందివ్వడమే తన ప్రభుత్వ లక్ష్యమ’ని కిరణ్‌ చెప్పారు. గతంలో రోశయ్య కూడా ఇదేరకంగా తేనెలాంటి ప్రకటనలు చేసి, ఆ తర్వాత బడుగు బలహీనవర్గాలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌, ఫీజుల రీఇంబర్స్‌మెంట్‌లో కోత విధించడంతో పాటు, లబ్ధిదారుల సంఖ్యను సగానికి పైగా తగ్గించడం ద్వారా ఖజానాపై పడిన భారాన్ని తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాను కూడా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోశయ్య బాటలోనే నడవక తప్పేలా లేదని కిరణ్‌ తొలి మీడియా భేటీలో చెప్పకనే చెప్పారు.

The Chief Minister had a busy day yesterday ..meeting the who's who of Indian Government

 

 

 
 
 

Saturday, November 27, 2010

Brio Factors brings Kiran Kumar Reddy on to Facebook

Brio Factors brings Kiran Kumar Reddy on to Facebook

A. Saye Sekhar
Nov 27, 2010
Screenshot of Facebook page on the Chief Minister N. Kiran Kumar Reddy
Kiran Kumar Reddy needs a 'tech'retary

HYDERABAD:
The K word is now on the F world. Chief Minister Nallari Kiran Kumar Reddy, his biography, pictures, info, events and a scope for discussion, videos, and many buttons are customized for him on an exclusive page created for him on the popular social networking site, Facebook.

Allipuram Rajasekhara Reddy, Managing Director of Brio Factors Technologies India Pvt. Ltd, a technology company that provides Social Media Marketing Services for several companies in India and having diverse operations on the internet space, created a page minutes after Mr. Kiran Kumar Reddy was named the Chief Minister on Wednesday.

The Chief Minister was perfectly profiled and his entire personal data was brought onto the ‘info’ section. His page – Kiran Kumar Reddy Nallari, Andhra Pradesh CM – was created and uplinked by Brio Factors with a photograph of his swearing-in.

Allipuram Rajasekhar Reddy moved his nimble fingers swiftly to create an FB account for the Chief Minister. He is the first to do this before other netizens get onto proliferation of pages on the Chief Minister.

In fact, Brio Factors had the credentials of running several websites of Y.S. Rajasekhara Reddy. The page created by Brio Factors Technologies is not the official page, but it is more like a fan page, said Mr. Rajasekhara Reddy.

The traditional political parties like the BJP, which are usually perceived to be conventional, are faster than their peers in the online activity. For instance, Gujarat Chief Minister Narendra Modi and Bihar Chief Minister Nitish Kumar have their official fan pages on the Facebook.

Now that Kiran Kumar Reddy has developed a fan base and it is sure to increase, several of those who ‘liked’ his page have felt that the Chief Minister should spend some time on the FB every day.

At least, he should have a ‘Tech’retary to support his online activity and ensure his large online presence. This would bolster confidence among the GenY that the new Chief Minister can remain all pervasive.

He can also launch a blog of his own in his new avatar and tweet his feelings too. But he must take utmost care that he doesn’t go the wrong way like Shashi Tharoor.

The various news items and videos on the Chief Minister will all be brought on to the Facebook page. “In next 6 months, I will make Kiran Kumar Reddy's page number one politician page from India on Faebook,” said Mr Rajasekhara Reddy.

He said he would update the page regularly with news, clippings, photos, videos. udpates, discussions and keep up-to-date information about the Chief Minister and all information.

But what is the benefit he would get? Maybe, Kiran Kumar Reddy may not even notice this. However, Mr. Rajasekhara Reddy does it for passion, to quench his technology thirst by satiating the information hunger of many.

The exclusive page on Kiran Kumar Reddy can be viewed at http://www.facebook.com/kirankumarreddynallari
Keywords:  Kiran Kumar ReddyBrio FactorsAllipuram Rajasekhara ReddyChief MinisterFacebooksocial media marketing
LINK -  http://www.andhrabusiness.com/NewsDesc.aspx?newsID=Brio-Factors-brings-Kiran-Kumar-Reddy-on-to-Facebook.html

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్రంలో ప్రధానంగా .... పది సమస్యలు

Kiran-kumar-red
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన, కాంగ్రెస్‌ పార్టీకి గుండెకాయ వంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేయడం నిస్సందేహంగా అద్భుతం. అది ఒక కోణం. మరో కోణంలో సమస్యల కొలిమితో కాలుతున్న రాష్ట్రానికి ఈ క్లిష్ట పరిస్థితిలో పగ్గాలు అందుకోవడం మాత్రం కత్తిమీద సాము వ్యవహారమే. వాటిని ఎదుర్కొనేందుకు కిరణ్‌కు ఉన్న అనుభవం ఎంతమేరకు ఉపకరిస్తుందన్న అంశం చర్చనీయాంశమయింది.

ప్రధానంగా.. రాష్ట్రంలో గత కొద్దిరోజుల నుంచి వివిధ వర్గాలు చేస్తున్న ఉద్యమాలు, ఆందోళనలు కాంగ్రెస్‌ ప్రభుత్వా నికి చెమటలు పట్టిస్తున్నాయి. రోశయ్యను వెన్నాడిన ఆ సమస్యలే ఇప్పుడు కిరణ్‌కూ వారసత్వంలా కొనసాగుతు న్నాయి. గతంలో ఏ ప్రభుత్వం ఎదుర్కోని విధంగా అన్ని సమ స్యలూ ఒకదానిపై మరొకటి వచ్చి పడుతుండటంతో కాంగ్రెస్‌ సర్కారు ఉక్కిరిబిక్కిరి బిక్కిరవుతోంది. వివిధ వర్గాలు చేస్తున్న డిమాండ్లలో చాలావరకూ ఆర్థికపరమైన అంశాలే ఉండటంతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీలు వేసి చేతులు దులుపేసుకుంటు న్నారు. వాటి నివేదికలు అమలు చేయాలంటే నిధుల సమస్య. ఇవి కాకుండా పావలావడ్డీ, అభయహస్తం పథకాలకు నిధులు కేటాయింపులో నత్తనడక వంటి అంశాలు సర్కారును పీడించే పెను సమస్యలే. మొన్న రోశయ్య, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి.. ముఖ్యమంత్రి మారినా సమస్యలు అవే.

ప్రధానంగా.. పది సమస్యలు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును వెన్నాడుతున్నాయి. వాటిని పరిష్కరించడంలోనే ఆయన సామర్థ్యం ఏమిటన్నది తేలుతుంది. వాటి పరిష్కారానికి సీఎం అనుసరించబోయే విధానం, వ్యవహారశైలి, సత్వర నిర్ణయాలు కూడా దోహదం కానున్నాయి. ముఖ్యంగా.. రోశయ్య వంటి ఆర్థికవేత్త, రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌కే సాధ్యం కాని ఈ సమస్యలను గతంలో మంత్రి పదవి కూడా చేపట్టిన అనుభవం లేని కిరణ్‌కుమార్‌ ఏ విధంగా పరిష్కరిస్తారన్నదే ఇప్పుడుఅందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.

తెలంగాణ...ప్రధానం

Jai-Telanganaఇక అన్నింటికన్నా కిరణ్‌ను ఇబ్బందిపెట్టే ప్రధాన అంశం తెలంగాణ సమస్య. రాష్ట్ర ఏర్పా టును డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సహా, తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ, జేఏసీలు ఉద్యమం చేస్తున్నాయి. ఒకవేళ టీఆర్‌ఎస్‌ను బుజ్జగించడం ద్వారా ఉద్యమం ఆగుతుందని భావించినా ఇప్పుడు ఉద్యమం టీఆర్‌ఎస్‌ చేతిలో లేదు. విద్యార్థులపై కేసుల తొలగింపు మరో సమస్య. మొన్నటి వరకూ స్పీకర్‌గా ఉన్నందున ఏ అంశంపై మాట్లాడకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఇప్పుడు సీఎంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యపైనా తప్పనిసరిగా స్పందించ వలసి ఉంటుంది. ఆ అంశంపై ప్రత్యర్థులు చే సే విమర్శలకూ స్పందించవలసి ఉంటుంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణలో నెలకొనే పరిస్థితిని నియంత్రించడంపైనే ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.

సంక్షేమం విస్మరిస్తే సమస్యలే
Ramoorthi-Presidentబడుగు బలహీన వర్గాలకు చెందిన సమస్యలు విస్మరిస్తే కిర ణ్‌ సర్కారుకు చిక్కులు తప్పవు. ప్రధానంగా.. ఫీజుల రీఇంబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిల విడుదలలో చేస్తున్న జాప్యం బడుగులకు ఆగ్రహం కలిగిస్తోం ది. ప్రధానంగా.. వాటికి సంబంధించి ఈనెలలో 800 కోట్లు, వచ్చే నెలలో 1000 కోట్లు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విడుదల చేయవలసి ఉంది.లబ్థిదారులైన విద్యార్థుల సంఖ్యను కుదించడం ద్వారా సర్కారు తన ఖజానాపై పడుతున్న భారాన్ని వదిలించుకోవా లన్న వ్యూహంతో ఉన్న విషయాన్ని బీసీలు గ్రహించారు. అందుకే దానికి నిరసనగా ఉద్యమాలు చేస్తు న్నారు. రాష్ట్రంలో 65 శాతం ఉన్న బీసీలకు వ్యతిరేకమైన నిర్ణ యాలు తీసుకుంటే ప్రభుత్వ మనుగడ కష్టమే.

ఉద్యోగుల ఉగ్రరూపం
corwdకాంగ్రెస్‌ సర్కారు ఉద్యోగులు తొలిసారిగా పిడికిలి బిగించారు. తమకు సంబంధించిన నియ మించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నివేదికలు ఆర్థిక శాఖలో సుఖ నిద్ర పోతుండటం వారిని ఆగ్రహానికి గురిచేస్తోంది. 7 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 5 లక్షల మంది పెన్షనర్లు ఉద్యమ బాటలో ఉన్నారు. ఇటీవలే సమ్మె కూడా చేశారు. ఇంటఇద్దె భత్యం పెంపు, ప్రత్యేక ట్రస్టు ద్వారా ఆరోగ్య బీమా వంటి 11 ప్రధాన డిమాండ్లతో సర్కారుపై సమరం ప్రకటించారు. టీడీపీ సర్కారును కూల్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురా వడంలో కీలకపాత్ర పోషించిన అదే ఉద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పిడికిలి బిగించడం కొత్త ముఖ్య మంత్రికి ఆందోళన కలిగించే అంశమే.

‘పారా’ హుషార్‌
ladies8,342 మంది పారా మెడి కల్‌ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ వాటర్‌ట్యాంకు, భవనంపై కెక్కి కిరోసిన్‌ బాటి ళ్లతో ఆందోళన నిర్వహిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖామంత్రిగా పనిచేసిన దానం నాగేందర్‌ స్వయంగా వచ్చి వారిని బుజ్జగించి వారం లోగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి నేటితో వారం అయింది. ఈలోగా హామీ ఇచ్చిన దానం నాగేందర్‌ పదవే పోయింది. సీఎం కూడా మారిపోయారు. 8 నెలల నుంచి జీతాలు చెల్లించాలని, 8 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను క్రమబద్దీకరించాలంటూ హెల్త్‌ అసిస్టెంటులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఏఎంలు రోడ్డెక్కారు.

సర్కారుకు బీడీ పొగ
bidiరాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 లక్షల మంది బీడీ కార్మి కులు ఉద్యమబాటలో ఉధృతం గా పయనిస్తున్నారు. ఎన్నిసార్లు చర్చలు జరిగినా యాజమాన్యా లకు, వారికి అవగాహన కుదరడం లేదు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ఆసక్తి చూపించడం లేదు. వెయ్యి బీడీలు చుడితే ఇప్పుడు ఇస్తున్న జీతాన్ని 120 రూపాలయకు ఇవ్వాలని, ప్యా కర్ల జీతాలు పెంచాలంటూ ఉద్యమిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఈ వర్గానికి చెందిన దాదాపు 17 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్టుగానే భావించక తప్పదు.

బెత్తం పట్టిన కాబోయే టీచర్లు
nirasanకామన్‌మెరిట్‌ ప్రకారం ఎంపి కయిన తమకు టీచర్‌ పోస్టులు ఇవ్వాలంటూ బీఎడ్‌ నిరుద్యోగు లు రోడ్డెక్కారు. పోస్టింగుల విష యంలో తమకు అన్యాయం జరు గుతోందంటూ డీఎస్సీ అభ్యర్థులు రెండు రోజుల పాటు బిల్డిం గుపైనే ఉండిపోయారు. అప్పటి మంత్రి మాణిక్యవరప్రసాద్‌ వచ్చి, వారిని బుజ్జగించినా ఇప్పటిదాకా ఫలితం సున్నా.

104 డేంజర్‌ సిగ్నల్స్‌
104aవైఎస్‌కు వ్యక్తిగతంగా, కాంగ్రె స్‌కు కొత్త ఓటు బ్యాంకుగా మా రిన 104లో పనిచేసే సిబ్బంది కూడా ఆందోళన బాట పట్టారు. వారంతా ఈనెల 10 నుంచి ఆందోళన బాటలో ఉన్నారు. ఫలితంగా.. 2.72 లక్షల మంది గ్రామీణులకు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఏటా 8 శాతం వేతనాలు పెంచాలని, ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, ఇఎస్‌ఐ, పీఎఫ్‌, సౌకర్యం కల్పించాలన్న వారి డిమాండును అటు యాజమన్యాలు గానీ, ఇటు సర్కారు గానీ తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తాయి.

ప్రాణ సంకటంలా ‘14ఎఫ్‌’
tsహైదరాబాద్‌ ఫ్రీజోన్‌కు సంబం ధించిన 14 ఎఫ్‌ నిబంధన కొత్త సీఎంకు అగ్నిపరీక్ష. శాసనసభలో 9 నెలల క్రితమే ఈ నిబంధన తొలగించాలని తీర్మానించినా ఇప్పటివరకూ దానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి సాధించకపోవడంతో ఆ ప్రభావం ఎసై్స ఉద్యోగాలపై పడి, అది కాస్తా ఉప్పెనలా మారి ఉద్యమరూపం దాల్చింది. ఫలితంగా ఎసై్స రాత పరీక్షను వాయిదా వేయవలసి వచ్చింది. ఇది కొత్త సీఎంకు సవాలే.

మళ్లీ సర్కార్‌పై ‘దండోరా’
mandakrishnamadigaరాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన ఏబీసీడీ వర్గీకరణకు పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించా లంటూ మాదిగలు మరోసారి సర్కారుపై సమరం ప్రకటించా రు. తమ డిమాండ్‌ను వినిపించేందుకు డిసెంబర్‌ 4న యుద్ధభేరి మోగించనున్నారు. ఇప్పటికే వివిధ తీర్మానాలు కేంద్రంలో పెండింగ్‌లొ ఉన్న విషయం తెలిసిందే.

సర్కార్‌పై పోల‘రణం’
Polavaram
కిరణ్‌ సర్కారుకు పోలవరం ప్రాజెక్టు సాధన రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కత్తిమీద సా ము. జాతీయ ప్రాజెక్టు హోదాతో పాటు, ప్రస్తుతం ఉన్న అవరోధా లు తొలగించడం పెను సవాలు. ప్రాణహిత-చేవెళ్లకు అను మతి సాధించకుండా ఒక్క పోలవరం ప్రాజెక్టు వైపే మొగ్గు చూపితే అటు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల నుంచి వ్యతిరే కత ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పటికే వారంతా పోలవరానికి వ్యతిరేకంగా చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రోశయ్య ఆయన స్థాయిలో బాగానే కృషి చేశారు. కిరణ్‌ ఈ వ్యవహారంలో కేంద్రంపై పోరాడవలసి ఉంటుంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల ఒత్తిళ్లను కూడా ఎదుర్కోక తప్పదు. ఒకపక్క పోలవరం కోసం పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి తరచూ ప్రధానిని కలుస్తున్నందున, ఆ క్రెడిట్‌ వారికి దక్కకుండా, పార్టీ ఖాతాలో కలవడమూ ప్రధానమే.

లాబీయింగ్‌ వద్దు..


cm-speach
లాబీయింగ్‌లతో ప్రభుత్వంలో కీలక శాఖలో పోస్టింగ్‌ను దక్కించుకోవాలని చూసేవారికి ఇకపై కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెక్‌ పెట్టబోతున్నారు. ఉన్నతాధికారుల పోస్టింగ్‌లో ఇకపై పనితీరే ప్రామాణికంగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 48 గంటలు గడవక ముందే నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తనదైన శైలిలో అధికారులకు ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వ చ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఓ కీలకవ్యక్తి ద్వారా ఉన్నతాధికారులు ప్రభుత్వంలో కీలక శాఖల్లో పదవులు దక్కించుకోవడం సంప్రదాయంగా కొనసాగింది.

ఇకపై ఇటువంటి సంప్రదాయానికి కిరణ్‌ చెక్‌ పెట్టే అవకాశం ఉందని పలువురు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఉన్నతాధికారులకు ఇకపై ముకుతాడు పడుతుందా అనేది వేచి చూడాల్సిందేనని పలువురు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం లేక్‌వ్యూ అతిధిగృహంలో అఖిలభారత క్యాడర్‌ అధికారులతో ిసీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఇకపై పరిపాలన కొనసాగుతుందని అధికారులకు పరోక్షంగా వ్యవహరించారు. ఇదిలాఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా కొంతమంది అధికారులు హవా కొనసాగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యంగా గతంలో కీలకశాఖల్లో పనిచేసిన కొందరు అధికారులు పూర్తి అవినీతిలో కూరుకుపోయారని వీరిపై చర్యలు తీసుకునేందుకు కిరణ్‌ సాహసం చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. కాగా శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించిన పలు అధికారులతో ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తారని శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని అన్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వ చేపడుతున్న ప్రతి సంక్షేమ పధకం నిరుపేదలకు అందించే విధంగా అధికారులు కృషిచేయాలని, ఇందులో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదని కిరణ్‌ పేర్కొన్నట్లు సమాచారం.

Lakeview.
ముఖ్యంగా మంచి క్రికెటర్‌గా పేరొందిన కిరణ్‌కుమార్‌ రెడ్డి తన టీంను ఆచి తూచి ఎంచుకుంటారని పార్టీ లోని కొందరు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సైతం మచ,్చలేని అధికారులను ఎంచుకుని, తనదైన శైలిలో పాలన కొనసాగిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కొణిజేటి రోశయ్య వద్ద పనిచేసిన అధికారులను తిరిగి కొనసాగించేందుకు కిరణ్‌ సుముఖంగా లేరని సమాచారం. ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వీ.ప్రసాద్‌, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి జి.సుధీర్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ , ఎస్‌.పి.సింగ్‌, సంజయ్‌జాజు, జయేశ్‌రంజన్‌, చంద్రవదన్‌, జగదీశ్వర్‌ గుప్తా, ఎల్‌.వీ.సుబ్రహ్మణ్యం, డీజీపీ కరణం అరవిందరావు, ఐజీ ఇంటెలిజెన్స్‌ మహేందర్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

హస్తవాసి తేలేది హస్తినలోనే * రాష్ట్ర కేబినెట్ ఆశావహులతో ఢిల్లీ కిటకిట

రాష్ర్ట కేబినెట్‌లో చోటుకోసం శతవిధాలా యత్నాలు
కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం
ఆశల పల్లకిలో తాజా మాజీలు, పాత మాజీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


ఢిల్లీలో వాలిన దాదాపు 50 మంది నేతలు.. వారి అనుచరగణం
అహ్మద్ పటేల్, మొయిలీ, ప్రణబ్ తదితరుల ఆఫీసుల్లో సందడి
కొందరు రహస్యంగా... కొందరు బహిరంగంగా యత్నాలు
ఆశల పల్లకి
మంత్రి పదవులకోసం నేతల పోటాపోటీ  
నేడు ఢిల్లీకి సీఎం కిరణ్ హైకమండ్‌తో చర్చలు 
కేబినెట్ కూర్పే అజెండా * జాబితాతో రాత్రికి రాక
అంతా ఓకే అయితే రేపే ప్రమాణ స్వీకారాలు

లేదంటే బుధవారమే
మంచిరోజే కారణం
ఆశావహుల్లో హైటెన్షన్
ఢిల్లీలో
నేతల కోలాహలం
జగన్‌తో 21మంది భేటీ

 టెన్షన్ హైటెన్షన్‌గా మారుతోంది. అధికార పార్టీ నేతలకు బీపీలు పెరుగుతున్నాయి. నరాలు తెగుతున్నాయి. 'రాజు' ఎవరో తేలిపోయింది! ఇక మంత్రుల ముచ్చటే మిగిలింది. ఎవరికి వారు 'మేమూ మంత్రి పదవులకు అర్హులమే' అంటున్నారు! 'డిగ్రీ పాస్ అయిన వాళ్లు ఐఏఎస్ కావాలనుకున్నట్లే... ఎమ్మెల్యేలైన వారంతా మంత్రులు కావాలనుకుంటారు! ఇందులో తప్పేముంది?' అని ప్రశ్నిస్తున్నారు. కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాలని గట్టిగా నినదిస్తున్న వారు కూడా... కిరణ్ కేబినెట్‌లో మంత్రులయ్యేందుకు పోటీ పడుతున్నారు. వారూ వీరని ఎందుకు! ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే నుంచి... ఆరేడుసార్లు ఎమ్మెల్యేలుగా, ఇప్పటికే మంత్రులుగా పని చేసిన వారి వరకు! అందరూ కుర్చీపై కన్నేశారు. ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలూ కేబినెట్‌లో బెర్తుల కోసం కాచుకుని కూర్చున్నారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో వాలిపోయి... ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. తాజాగా మాజీలైన వారు ఈ పోటీలో ముందున్నారు. పోటీదారులు సుమారు రెండొందల మంది! కానీ... గరిష్ఠంగా ఇవ్వగలిగే మంత్రి పదవులు మాత్రం నలభై నాలుగే!

తొలి విడతలో ఎంత మందిని కేబినెట్‌లో చేర్చుకుంటారు? ఎవరిని చేర్చుకుంటారు? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూరులో సమాధానాలు లభించే అవకాశముంది. శనివారం ఉదయం 6.40 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. అంతా ఓకే అయితే... జాబితాపై శనివారం అధిష్ఠానం ఆమోదముద్ర పడితే, ఆదివారమే విస్తరణ జరగవచ్చు. ఆ రోజు సప్తమి, మంచి రోజు! సోమ, మంగళవారాలు అష్టమి, నవమి! అవీ పోతే... బుధవారం! అప్పటిదాకా ఆగడం సాధ్యమేయ్యేనా! అన్ని రోజులు ఈ హైటెన్షన్, ఒత్తిళ్లు, లాబీయింగ్‌లు తట్టుకోవడం కష్టం. అందువల్ల ఆదివారమే 'మంత్రాంగం' పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఆదివారం ప్రమాణస్వీకారాలు జరిగిన సందర్భాలున్నాయి. సోనియాకు కృతజ్ఞతలు చెప్పడం, మంత్రివర్గం ఏర్పాటుపై అధిష్ఠానం ఆమోదం పొందడానికే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు. నాయకత్వ మార్పు సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌లతో పాటు... కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో కిరణ్ సమావేశం కానున్నారు. మేడమ్ సోనియాగాంధీతో మధ్యాహ్నంలోగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే.. శనివారమే సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది. వస్తూ వస్తూ 'మంత్రుల జాబితా' తీసుకురావడం దాదాపుగా ఖాయమని చెబుతున్నారు. శనివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్ప మొయిలీ అందుబాటులో ఉండరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే... ఆయన పరోక్షంలోనే మంత్రివర్గం కసరత్తు జరగనుంది.

వరుస భేటీలు: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో రోజున కిరణ్‌కుమార్‌రెడ్డిని పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం రెండు దఫాలుగా సీఎంను కలిశారు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. మంత్రివర్గం కూర్పు విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ స్పష్టం చేశారని సమాచారం. శుక్రవారం ఉదయం సందర్శకులను కలసిన అనంతరం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పాలనా వ్యవహారాలపై చర్చించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజ్ భవన్ నుంచి రోశయ్య నివాసానికి వెళ్తున్న సమయంలోనే... ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. గురువారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వైఎస్ జగన్ నివాసం కూడా సందడి సందడిగా మారింది. శుక్రవారం ఆయనను సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. వీరిలో పలువురు విలేకరులతో మాట్లాడారు. 'మేమూ మంత్రి పదవులు ఆశిస్తున్నాం' అని నిర్మొహమాటంగా చెప్పారు. అదే సమయంలో... జగన్‌ను విస్మరిస్తే పార్టీ నాశనమవుతుందని శాపనార్థాలు పెట్టారు. జగన్‌ను కలిసిన వారిలో 90 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కిరణ్ వద్దకు వెళ్లారు. మంత్రి పదవులు ఆశిస్తూ విన్నపాలు చేసుకున్నారు. మరోవైపు... శుక్రవారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, వి.హనుమంతరావులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

తాజా మాజీల కలవరం: మంత్రి పదవులకోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చూసి తాజా మాజీలు కలవర పడుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరగడంతో మొన్నటిదాకా మంత్రులుగా ఉన్న తాము కూడా ఇతరులతో పోటీ పడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకు, అధిష్ఠానం పెద్దలను కలిసేందుకు వీలుగా ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లేందుకు నేతలు క్యూ కట్టడం చూసిన ఒక మాజీ మంత్రి ఆశ్చర్య పోయారు. "ఇంత మంది ఢిల్లీకి వెళ్తున్నారా? వీళ్లందరికీ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం లభిస్తుందా?'' అని ఆశ్చర్యపోయారు. అన్నట్టు ఈసారి పైరవీల్లో కొంత ప్రత్యేకత కనిపిస్తోంది. నేతలు తమకు పదవి ఇవ్వాలని కోరుకోవడంతోపాటు... తమకు ప్రధానంగా పోటీగా ఉండే జిల్లాలోని నేతలకు వ్యతిరేకంగా నివేదికలు సమర్పిస్తున్నారు. ఒకటి పైరవీ అయితే... ఇంకోటి 'వి'పైరవీ అన్నమాట!

పీసీసీ, డిప్యూటీ సీఎం మాటేమిటి?: మంత్రివర్గం కూర్పుతోపాటు పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని కూడా శనివారం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీకి బొత్స సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. అయితే... పీసీసీ పీఠంతోపాటు మంత్రి పదవి కూడా ఉంటే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో ఎంఎ ఆజీజ్ కూడా ఇలా జోడు పదవులు నిర్వహించారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా... దామోదర రాజ నరసింహ పేరు గట్టిగా వినిపిస్తోంది. సహజగా... హోంశాఖను ఉప ముఖ్యమంత్రులే నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.

కొత్త కేబినెట్‌లో చాన్స్ కోసం ఆశావహ కాంగ్రెస్ నేతలు దేశ రాజధానికి తరలివచ్చారు. నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాకముందే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధినాయకత్వంతో చర్చించడానికి ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీ వస్తారని ప్రచారం జరగడంతో దాదాపు 50మంది హస్తినలో వాలారు. ఇందులో దాదాపు 25 మంది గురువారం రాత్రికే చేరుకోగా మిగతావారు శుక్రవారం దిగారు. తరలివచ్చిన ఆశావహుల్లో ప్రముఖులు, సీనియర్లు, జూనియర్లు, తాజా మాజీ మంత్రులు, పాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. వీరి కోసం తమకున్న పాత సంబంధాలను ఉపయోగించడానికి బయల్దేరివచ్చిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వీరందరి రాకతో ఆంధ్రాభవన్‌కు ఖద్దరు కళొచ్చింది... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీయే మొత్తంగా ఢిల్లీ తరలివచ్చిందా అనిపించే వాతావరణం నెలకొంది. మీడియా ప్రతినిధుల పలకరింపులు, ఎవరికొచ్చే అవకాశముందంటూ ఆరాలు, టీవీ చానళ్లతో ముక్తసరి మాటలు... ఇలా భవన్ ఆవరణలో ఎక్కడలేని సందడి నెలకొంది.

‘పెద్దల’ ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు: మంత్రి పదవులకోసం ఢిల్లీ చేరిన నేతలంతా వాహనాల్లో రయ్‌మంటూ ఢిల్లీ వీధుల్లో తమకు తెలిసిన పెద్దలను కలిసే ప్రయత్నాల్లో బిజీగా తిరుగుతూ కనిపించారు. కాంగ్రెస్ అధినేత రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ పెద్దలు మోతీలాల్ వోరా, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, ఆస్కార్ ఫెర్నాండెజ్, గులాం నబీ ఆజాద్ తదితరులను కలుసుకునేందుకు ఎవరికివారు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మాజీ మంత్రి పార్థసారథి, తాను సీనియర్లమని చెప్పారు. గతంలో తనకు అవకాశం రాలేదని, ఈసారి వస్తుందేమోనని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అక్కడే ఉన్న పార్థసారథి దీనిపై ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. కొందరు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు తాజా మాజీ మంత్రులు పార్లమెంట్‌కు వెళ్లి కనిపించిన పెద్దలకు ఓ నమస్కారం పెట్టుకుని వచ్చారు. మరికొందరు మొయిలీని కలిసి తమ కోరికను విన్నవించుకున్నారు. ఇంకొందరు పార్టీ పెద్దలకు సన్నిహితంగా మెలిగే రాష్ట్ర ఎంపీలను, ఇతర రాష్ట్రాల కీలక ఎంపీలను మంచిచేసుకునే పనిలో పడ్డారు.


గురువారం రాత్రికే ఢిల్లీ వచ్చిన కొందరు తాజా మాజీమంత్రులు, పాతమాజీ మంత్రులు పార్టీ పెద్దల్లో ముగ్గురి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారని సమాచారం. పార్టీ పెద్దల దర్శనభాగ్యం కల్పించమని కాంగ్రెస్ నేతలు చేసిన ఫోన్లతో ఆయా పెద్దల పీఎస్‌లు, పీఏల చెవులు హోరెత్తిపోయాయి. వీళ్ల పదవుల గోల తమ చెవుడుకొచ్చేట్టుందని ఓ ఇద్దరు నేతల పీఎస్‌లను వ్యాఖ్యానించారంటే ఏస్థాయిలో వారిపై ఒత్తిడి ఉందో తెలుసుకోవచ్చు.

అంతా రహస్యం...: ఢిల్లీ చేరుకున్న మాజీలు, సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తామెక్కడున్నామో తెలీకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా తాజా మాజీమంత్రులైతే ఆంధ్రాభవన్‌లో గదులు సిద్ధం చేసినా సరే భవన్‌కు దూరంగా హోటళ్లు, మిత్రుల ఇళ్లు, రహస్య ప్రదేశాల్లో బసచేయడం విశేషం. అయితే ఈ రహస్యమంతా శనివారం ఉదయం బట్టబయలు కాక తప్పదని, సీఎం వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ భవన్ ఆవరణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌ని తలపించడం తథ్యమని పరిస్థితి చెప్తోంది. మంత్రి పదవి కోసం ఢిల్లీ చేరుకున్న నేతల్లో కడప ఎంపీ వైఎస్ జగన్ చిన్నాన్న ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఓదార్పు యాత్ర విషయమై అధిష్టానానికి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విభేదాలున్న సంగతి తెలిసిందే. ఓదార్పు యాత్రకు మద్దతు ఇచ్చినవారిపై చర్యలు తీసుకుంటున్న విషయమూ విదితమే. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి ఢిల్లీకి చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఢిల్లీ వచ్చిన ఆశావహులు వీరే..

తాజా మాజీ మంత్రులు: బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజనరసింహ, ఆనం రామనారాయణరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కె.పార్థసారథి, జూపల్లి కృష్ణారావు, పి.బాలరాజు

ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు: మల్లు భట్టి విక్రమార్క, సాకే శైలజానాథ్, కొండ్రు మురళి

సీనియర్లు, ఎమ్మెల్యేలు: జె.సి.దివాకర్‌రెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, తోట నర్సింహం, టి.జి.వెంకటేష్, రాంభూపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శేషారెడ్డి, మస్తాన్‌వలి, నాని, వి.వి.సత్యనారాయణ, అనిల్‌కుమార్, వెంకట్రామయ్య, డి.వై.దాసు, రంగారెడ్డి, తూర్పు జయప్రకాష్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, భిక్షపతిగౌడ్, నర్సారెడ్డి, కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, సక్రూనాయక్, శ్రీశైలం గౌడ్, రాజయ్య, ఎం.విజయప్రసాద్

ఎమ్మెల్సీలు: వై.ఎస్.వివేకానందరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గోపీనాథ్, ప్రేమ్‌సాగర్‌రావు, రుద్రరాజు పద్మరాజు, సుగ్రీవులు, కె.జనార్దన్, కాసాని జ్ఞానేశ్వర్.

మహా మంత్రాంగం
కొత్త సీఎంకు అధిష్టానం షరతులు
మచ్చలేని వారికే కేబినెట్‌లో చోటు
విధేయతే ప్రధాన అర్హత
జగన్ వర్గీయులకు నో చాన్స్
నేడు ఢిల్లీకి కొత్త సీఎం కిరణ్
సోనియా, మన్మోహన్‌లతో భేటీ
దేశ రాజధానిలో నేతల హల్‌చల్
పదవులకోసం ముమ్మర లాబీయింగ్

'షరతులు వర్తించును'... ఇది అధిష్ఠానం మాట! మంత్రి పదవుల కోసం జాబితా తయారు చేసేటప్పుడు నాలుగు ఒకటి... అవినీతిపరులకు చోటు కల్పించొద్దు. రెండు... కడప ఎంపీ జగన్ వర్గీయులకు చెక్ చెప్పాలి. మూడు... యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగు... విధేయతకు పట్టం కట్టాలి! జాబితా తయారీ సమయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

వైఎస్ మంత్రివర్గంలో అవినీతిపరులుగా ముద్ర పడిన వారి జాబితా ఇప్పటికే అధిష్ఠానం వద్ద ఉందని... ఒకవేళ వారి పేర్లను జాబితాలో జొప్పించినా కట్ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 'కరుడు గట్టిన జగన్ వర్గీయులు'గా ముద్ర పడిన వారిని పూర్తిగా దూరంగా పెట్టాలని అధిష్ఠానం కిరణ్‌కు స్పష్టం చేసింది. ఇప్పటికే తమకు విధేయత ప్రకటించిన వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా ఉంది.

దీనివల్ల వైఎస్ అభిమానులు కూడా హర్షిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. శనివారం ఉదయం ఢిల్లీ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఒక ప్రాథమిక జాబితా రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు పార్టీ పలువురు సీనియర్ నేతలను కలుసుకుంటారు. మంత్రివర్గంలో తొలిదశలో 15 నుంచి 20 మందికి స్థానం లభించవచ్చునని పార్టీ వర్గాలు చెప్పాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి దామోదర్ రాజనరసింహ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ... మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

వారు ఇప్పటికే ఢిల్లీలో వేర్వేరు హోటళ్లలో మకాం వేశారు. అలాగే... పీసీసీ అధ్యక్ష పదవికి బొత్స సత్యనారాయణకు పోటీగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావును రంగంలోకి దించేందుకు పలువురు సీమాంధ్ర ఎంపిీలు ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు పిీసీసీ కన్నా కేంద్ర మంత్రి పదవే ముఖ్యమని కావూరి చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిపదవులతోపాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఖరారవుతుందని, వీటిలో ఏదో ఒకటి తనకు దక్కడం ఖాయమని బొత్స ధీమాగా ఉన్నారు. ఆయన శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో కేంద్ర మంత్రులు జై రాం రమేశ్, పళ్లంరాజు, పనబాక లక్ష్మితో పాటు పలువురు సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలతో విస్త­ృత మంతనాలు జరిపారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తే అందర్నీ కలుపుకొనిపోతానని, తనకు ఏ గ్రూపులు లేవని బొత్స వారికి నచ్చజెబుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించవద్దని కోరుతున్నారు.

తనంతట తాను ఢిల్లీ వచ్చానని, అ«ధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పజెప్పినా నెరవేరుస్తానని ఆయన విలేకరులతో అన్నారు. మరోవైపు తెలంగాణకే పీసీసీ అధ్యక్ష పదవి దక్కాలని, ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు వంటిదని తెలంగాణ ఎంపీలు భావిస్తున్నారు. దీనిపై గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్ తదితరులు చర్చలు జరుపుతున్నారు.

కిటకిట...: అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకుని, మంత్రి పదవులు సాధించేందుకు పెద్దసంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో వాలిపోయారు. ఎవరికి వారు, ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. దీంతో... దేశ రాజధాని రాష్ట్ర రాజకీయాలతో వేడుక్కుతోంది. ఒక్కసారిగా వచ్చి పడుతున్న నేతలకు బస కల్పించలేక ఏపీ భవన్ అధికారులకు తలప్రాణం తోకకొస్తోంది. ఏపీ భవన్‌లోని గదులన్నీ ఇప్పటికే నిండిపోయాయి.

ప్రస్తుతం 'మాజీ'లు కావడంతో... తాజా మాజీ మంత్రులకు కూడా ఏపీ భవన్‌లో గది దొరకడం దుర్లభంగా మారింది. పీసీసీ రేసులో ముందున్న బొత్స సత్యనారాయణకే ఇక్కడ గది లభించలేదు. దీంతో... ఆయన ఎంపీగా తన సతీమణి బొత్స ఝాన్సీకి ఇచ్చిన క్వార్టర్‌కు వెళ్లారు. శనివారం మరింత పెద్ద సంఖ్యలో నేతలు ఢిల్లీకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సదరన్ హోటల్, జనపథ్‌తో పాటు పలు ఇతర హోటళ్లను కూడా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.

సోనియా... సీఎం తొలి ముఖాముఖి నేడే

కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తొలి పరీక్ష. తన బృందాన్ని ఎంపిక చేసు కోవడం తనేక సవాలు కాబోతోంది. కొత్త ెదాలో ఆయన శనివారం ఢిల్లీ వెళుతు న్నారు. బృహత్తర పని మీదే వెళుతున్నారు. భారీ కసరత్తుతోనే సన్నద్ధమయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారాలు. కాని కాంగ్రెస్‌ నేతగా బోలెడు పరిమితులు. రాష్ట్రం లో ఎన్నో సమస్యలు. పరిష్కార బాధ్యత ఆయనదే.అంత మాత్రాన అంతా ఆయన చేతుల్లో ఉంటుందని అనుకోలేము. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతగా..తన పరిమితులు తనకు తెలిసిన లౌక్యునిగా..విషమ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన యువ నాయకునిగా ఢిల్లీలో ఆయన ఏం సాధించుకు రాబోతున్నారు? కొత్త ేకబినెట్‌ను ఓేక చేరుుంచుకోవడం ప్రథమ కర్తవ్యం. అందులో తన మాటను ఎంత మాత్రం నెగ్గించుకోగలుగుతారు? అధినేత్రి సోనియా గాంధీని తన వ్యూహ ప్రతివ్యూహాలతో ఎలా మెప్పించగలుగుతారు? ముఖ్యమంత్రి ఆమె నుంచి ఏమి ఆశిస్తున్నారు? సోనియా గాంధీ ఈ కొత్త సారథి నుంచి ఏమి కోరుకుంటున్నారు? కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సునిశిత విశ్లేషణ.


కిరణ్‌ ఏమి కోరతారు ? మేడమ్‌.. నమస్తే !
sonia
మేడమ్‌జీ..నమస్తే! మీ వల్లే నాకీ అదృష్టం దక్కింది. మీరు పంపిన దూతల సమక్షం లో అంతా సాఫీగా జరిగింది. ప్రమాణ స్వీకారం చేశాను. కేబినెట్‌కు మీరు రూపమిస్తే నేనెళ్లి పాలన చూసుకుంటా. రాష్టంలో విపరీత రాజకీయ పరిణామాలున్నాయి. మున్ముందు ఇంకా సంకట స్థితి ఉంటుంది. అడుగడుగునా మీ మద్దతు అవసరం. అక్కడికక్కడ..అప్పటికప్పుడు నిర్ణయాలు అవసరమవుతాయి. మీ సహకారం ముఖ్యం.

సోనియా ఏం చెబుతారు ? కిరణ్‌జీ... కంగ్రాట్స్‌
కిరణ్‌ కుమార్‌ రెడ్డీజీ..మీరు యువకులు. రాష్ట్ర రాజకీయాల గురించి మీకు బాగా తెలుసు. స్పీకర్‌గా మీరు బాగా చేశారు. మీ చురుకుదనం చూసి ముఖ్యమంత్రిగా ఎంపిక చేశాం. పార్టీకి, ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చేలా వ్యవహరించండి. మున్ముందు అనేక అగ్ని పరీక్షలున్నాయి. సమర్థంగా ఎదుర్కోండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రోశయ్య గారిలా ఉండొద్దు. అలాగని వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేసినట్టు చేయొద్దు.

Friday, November 26, 2010

Brief Profile Of Kiran Kumar Reddy


Though hailing from Chittoor district, Kiran Kumar Reddy was born and brought up in Hyderabad.


Nallari Kiran Kumar Reddy, the new Chief Minister of Andhra Pradesh, was born to former Congress party minister N Amarnath Reddy. He hails from Chittoor district.

Kiran Kumar Reddy was born on September 13th, 1960, in Hyderabad. He has done his B. Com. and LLB, and was elected 4 terms to the Assembly.

He did his schooling from Hyderabad Public school and intermediate from St. Josephs' Junior College, Hyderabad.

N Kiran Kumar Reddy was elected from Pileru Assembly constituency, Chittoor district, in 2009 Andhra Pradesh Legislative Assembly elections.

After K Rosaiah submitted his resignation to Governor ESL Narasimhan, Kiran Kumar Reddy was seen as the first choice to the Congress High Command to succeed as the Chief Minister.

Reddy is the 16th Chief Minister of Andhra Pradesh and was elected as Speaker of the 13th Andhra Pradesh Assembly. He had vowed to be non-partisan in discharging his duties.

His decisive streak was well evident in his tussles with his family's arch rivals, as well as his battles with the Telugu Desam Party (TDP) president N Chandrababu Naidu, who hails from the same district.

Reddy was also a star cricketer in the Nizam College team, and was a wicket keeper and captain of the under-25 state team. It was under him that the former Indian cricket star Mohammed Azharuddin played.

The new CM's father, Nallari Amarnath Reddy, was a minister in Congress cabinets from 1978 to 1982. He was first elected to Andhra Pradesh Legislative Assembly from Vayalpadu constituency of Chittoor district in 1989.

Though he tasted defeat in the 1994 elections, he was again elected to the Assembly in 1999 and 2004. He also contested from Piler segment successfully in 2009 polls.

During the rule of the late chief minister, Y S Rajasekhar Reddy from 2004 to 2009, Reddy functioned as Government Chief Whip with cabinet minister's status.

After the 2009 elections, he was elected Speaker, though he was expecting a cabinet berth. He accepted the Speaker post with much reluctance, and it helped him to develop a good rapport with Congress president Sonia Gandhi, her political secretary Ahmed Patel, and senior leaders including Pranab Mukherjee and P Chidambaram.

A strong integrationist, Reddy impressed the High Command by his deft handling of the crisis caused after 143 MLAs of all political parties resigned after the centre announced the Telangana state on December 9th, 2009.

Reddy's name for the Speaker's post was proposed by the then Chief Minister YS Rajasekhara Reddy, Praja Rajyam Party president K Chiranjeevi, AIMIM Floor Leader Akbaruddin Owaisi, Agriculture Minister N Raghuveera Reddy and 2 other independents.

The main opposition TDP, which expressed reservations over Reddy's candidature, stayed away from accompanying him to the Speaker's chair.

He was Government Chief Whip in the previous Assembly, and served as member of the Public Undertakings Committee and Assurance Committee.

His father was considered close to late Indira Gandhi and P V Narasimha Rao.

పారదర్శకంగా పాలిస్తా.. ! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీడియా సపోర్ట్‌ కచ్చితంగా ఉండాలి.

 
పథకాల అమలులో లోటుపాట్లు సవరిస్తూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తానని నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. దివంగత వైఎస్‌ఆర్‌, కె.రోశయ్య ప్రభుత్వాల హయాంలో ప్రారంభించి అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు. నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమా ణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం శాసనసభ కమిటీ హాల్‌లో కిరణ్‌కుమార్‌ రెడ్డి తొలిసారి పత్రికలు, మీడియా సమావేశంలో మాట్లాడారు.
K.Nagaraju-Mayor

సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే...
‘గుడీ వినింగ్‌...ఫస్ట్‌ రిక్వెస్ట్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీడియా సపోర్ట్‌ కచ్చితంగా ఉండాలి. నిన్న స్పీకర్‌గా ఇక్కడే మీడియా సమావేశం పెట్టుకు న్నాం...ఇక్కడినుంచే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దేశించి మాట్లాడేందుకు అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానం, సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కృతజ్ఞతలు...దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్‌, వీరప్ప మొయిలీ, ఎ.కె.ఆంటోనీకి ధన్య వాదాలు...మొట్టమొదట ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నేను చెప్పేదేమిటంటే... అన్ని సంక్షేమ కార్యక్రమాలు...కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన, వైఎస్‌ఆర్‌, కె .రోశయ్య మొదలు పెట్టిన పథకాలు కొనసాగేందుకు కృషి చేస్తా...దీంట్లో టాప్‌ ప్రయారిటీ గవర్నెన్స్‌ (పాలన)... కొత్త సిస్టమ్స్‌ పెట్టి ఎవరికి చెందాలో వారికి లీకేజెస్‌ (లోపాలు) లేకుండా పారదర్శకంగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం...

family
ప్రజలకు సంబంధించిన 10-12 ప్రధాన విషయాలను ఎన్ను కొని...పౌర సరఫరాలు...స్కాలర్‌షిప్‌లు...ఉపాధి హామీ లాంటివి కార్యక్రమా లను ప్రధానంగా ఎంచుకుంటాం...రెవెన్యూ ఆఫీసు సర్టిఫికెట్లు పారదర్శకంగా ఉండేలా ప్రతి మూడు మాసాలకు టార్గెట్లు పెట్టి, పూర్తి అవుతున్నాయా లేదా మానిటర్‌ చేస్తాం...ఎవరికి అర్హత ఉందో వారికి చెందాల్సిన అవసరం కచ్చి తంగా ఉంది...మొదలు పెట్టిన కార్యక్రమాలు...జలయజ్ఞం, పారిశ్రామికీకరణ వేగవంతంగా పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తా...అన్నిటికన్న ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ డెస్టినేషన్‌ (పెట్టుబడులకు అనుకూల గమ్యం)గా, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా...లా అండ్‌ ఆర్డర్‌లో పీస్‌ఫుల్‌గా ఉంచే ప్రయత్నాలు చేస్తా...వైద్యం, ఆరోగ్యం, విద్య, సంక్షేమ కార్యక్రమాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, మహిళలకు లోపాలు లేకుండా సక్రమంగా చేసే విధంగా ప్రతి మూడు మాసాలకు పర్యవేక్షిస్తాం...

ఇది కాక ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానిక సంస్థల సహకారం తీసుకొని, అన్ని కార్యక్రమాలలో అందరినీ కలుపుకొని పని చేస్తా...రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యంగా ప్రతిపక్షం అందరినీ కలుపుకొని పోయేదానికి, రాష్ట్రానికి సంబంధించినంత వరకు వారి సహకారం అందించాలని నాతో మాట్లాడిన వారితో రిక్వెస్ట్‌ చేశా... ఇవేకాకండా వైఎస్‌ఆర్‌...ఒక ప్రధానమైన కోరిక...చనిపోవడానికి మూడు, నాలుగు రోజుల ముందు చివరి రాజకీయ కోరిక...2014 ఎన్నికల్లో 41 లోక్‌సభ సీట్లు గెలిచి రాహుల్‌ గాంధీ ప్రధానిగా చూడాలన్న కోరిక నెరవేర్చటానికి పూర్తి ప్రయత్నం చేస్తా..

ఇవీ ప్రశ్నలు... జవాబులు...
లోపాలను సవరిస్తామన్నారు...ఆరున్నర సంవత్సరాల పాలనలో లోపాలు అప్పటినుంచే ఉన్నాయా?
ఎవరికైతే స్కీమ్‌ పెట్టామో వారికి చెందాలి...ఇప్పుడూ లొసుగులు న్నాయి...కొత్త విధానాలను అభివృద్ధి చేసి పారదర్శకంగా పని చేస్తాం...
ఆరోగ్యశ్రీ పేషెంట్‌ను చూడటం ద్వారా మీ ప్రభుత్వానికి పేటెంట్‌ హక్కులు పొందాలనుకుంటున్నారా?
నేను మొట్టమొదట ప్రాధాన్యం ఇచ్చాను. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం చక్కగా ఉండాలన్నది లక్ష్యం...వైఎస్‌ పెట్టారు కాబట్టి పక్కకు తోయటం కాదు...ఆరోగ్యం ప్రాధాన్యం అని చెప్పటానికే వెళ్ళా...డబ్బు లేక... వైద్యం లేక...చనిపోకూడదనే ఆరోగ్యాన్ని ప్రజలకు ఇంకా మెరుగ్గా అందించే లక్ష్యం...అన్నిటిలోనూ లోపాలు వెదకవద్దు...(డోంట్‌ సీ ది నెగెటివ్‌ పార్ట్‌ ఆఫ్‌ ఇట్‌)...
కేబినెట్‌ కూర్పు ఎలా ఉంటుంది?
కేబినెట్‌ విషయంలో అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం...
రాహుల్‌ను ప్రధానిగా చేయటంతో పాటు తెలుగుదేశాన్ని ఫినిష్‌ చేయాలన్నది సైతం వైఎస్‌ చివరి కోరికగా చెబుతారు?
మాకు ఎవర్నీ ఫినిష్‌ చేసే రాజకీయాలు అక్కర్లేదు...ప్రతిపక్షం బాగుంటేనే రాజకీయాలు బాగుంటాయి.
జగన్‌ వర్గాన్ని కలుపుకుపోతారా?
అందరినీ కలుపుకుపోతా...సామాన్యుల్లో అభద్రతా భావం ఉంది...
అందుకే మొదట్లోనే చెప్పా...హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ మొత్తం దేశంలోనే అనుకూలమైన గమ్యాలుగా చేస్తానని...శాంతి భద్రతల విషయంలో నా హయాంలో కఠినంగా ఉండటం జరుగుతుంది. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఉంటుంది...
ఇప్పటిదాకా ఎంతమంది ఎమ్మెల్యేలు కలిశారు?
నన్ను కలిసిన వారిలో 99 శాతం మంది శాసనసభ్యులు ఉన్నారు...నా పని తీరే అన్నిటికీ జవాబు...శాంతి భద్రతల సమస్య విషయంలో రాజ్యాంగ హక్కులకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడితే కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తాం...
ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక రానున్నది...దానిపై స్పందన...
నివేదిక వచ్చిన తర్వాత కదా మాట్లాడాల్సింది...
తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తారా?
ప్రమాణ స్వీకారం చేసి ఐదారు గంటలే అయింది...
తెలంగాణపై మీ వైఖరి ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఏమి ఆదేశిస్తే అదే అమలు...
అనేక సంఘాలు సమ్మెలు చేస్తున్నాయి...సమస్యలన్నిటికీ చర్చల ద్వారానే పరిష్కారం...వీలు చూసుకుని చేస్తా.. కేబినెట్‌ రావాలి... అన్నీ చూసుకోవాలి...
కేబినెట్‌లో ఎంతమంది ఉండొచ్చు?
మీకు త్వరలోనే తెలుస్తుంది...నేను అందరితోనూ ఇబ్బంది లేకుండానే ఉన్నాను....
మావోయిస్టులపై మీ విధానం ఎలా ఉంటుంది?
మావోయిస్టులు మన రాష్ట్రంలో మాత్రమే లేరు...13, 14 రాష్ట్రాలలో ఉన్నారు...వారికి సంబంధించి ఇప్పటి విధానమే కొనసాగుతుంది.
మీపై భూమికి సంబంధించిన ఆరోపణ ఉంది?
ఆరోపణ ఏమీ లేదు...శ్రీ వెంకటేశ్వర హౌసింగ్‌ సొసైటీ వారు ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే విక్రయిస్తే ఒప్పందం మేరకే కొన్నాను...నాతో పాటు చాలా మందికొన్నారు. అయితే ఒక పత్రిక నాపై కథనాలు రాసింది...దీనితో స్థలాన్ని వెనక్కు ఇచ్చి డబ్బు తీసేసుకున్నా...పోలవరం జాతీయ ప్రాజెక్టు విషయం... పోలవరం, చేవెళ్ళ-ప్రాణహిత రెండింటికీ ప్రయత్నిస్తాం...
జగన్‌ పార్టీ ధిక్కారం వ్యవహారంపై స్పందన?
అది పార్టీకి సంబంధించినది...నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని... క్రమశిక్షణ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది...ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు... సహకారం ఇవ్వాలని కోరాను... ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళేదీ మీకు చెప్పే వెళ్తా... థాంక్యూ...

అందర్నీ కలుపుకొని పోతా - ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

 

సుపరిపాలన
అందర్నీ కలుపుకొని పోతా
శాంతిభద్రతలపై కఠినంగా ఉంటా
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న వైఎస్ ఆశ నెరవేరుస్తా
అధిష్ఠానం ఆదేశం మేరకు కేబినెట్
జగన్ విషయం పార్టీ చూసుకుంటుంది
లీకేజీల్లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు


శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం
పెట్టుబడుల మజిలీగా హైదరాబాద్
ప్రతి 3 నెలలకూ ప్రభుత్వ పథకాల సమీక్ష
ప్రతిపక్షాలూ బలంగా ఉన్నప్పుడే ప్రజలకు మేలు

రాజ్యాంగ హక్కులకు లోబడి ఏం చేసుకున్నా తప్పులేదు
శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌లలో శాంతి నెలకొల్పి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి... 

ప్రజారోగ్యం, విద్యకే నా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
సంక్షేమ పథకాల్లో లొసుగులు తొలగించి పక్కాగా అమలు చేస్తాం
ప్రాణహిత, పోలవరంలకు జాతీయ హోదా సాధిస్తాం
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న వైఎస్ చివరి కోరిక నెరవేర్చడానికి కృషి చేస్తా...
 

 పాలనలో నూతన విధానాన్ని తెచ్చి రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలనను అందిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి హైదరాబాద్, రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని .. పరిశ్రమలకు పూర్తి భరోసాను కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి 2014 ఎన్నికల్లో 41 ఎంపీలను గెలిపించి యువనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతిమ రాజకీయ కోరికను నెరవేర్చేందుకు పూర్తి ప్రయాత్నం చేస్తామని అన్నారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులందరితోనూ .. ప్రతిపక్ష నేతలందరి సలహాలు తీసుకుని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు.

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనను అభినందించినప్పుడు .. ఆయన సహకారం కూడా కోరానని అన్నారు. ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శాసనసభా ప్రాంగణంలోని సమావేశమందిరంలో విలేఖరులతో మాట్లాడుతూ .. రాష్ట్రాభివృద్ధి కావాలంటే మీడియా సహకారం కావాలని కోరారు. శాసనసభా స్పీకర్‌గా బుధవారం నాడు మీడియా కమిటీ సమావేశాన్ని శాసనసభా ప్రాంగణంలోనే నిర్వహించామని.. నేడు ఇదే ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నానని అన్నారు.

తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రజలకు సేవలు చేసేందకు వీలైన ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా రాష్ట్రానికి కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే అంటోని, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ వచ్చి తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

తాను సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. నూతన విధానాన్ని తెచ్చి .. మైనారిటీలు, ఎస్సీఎస్టీలు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారందరికీ లీకేజీలు లేకుండా పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలకు సంబంధించిన 10-12 ప్రధానాంశాలను ఎన్నుకుని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉపకార వేతనాలు, జాతీయ ఉపాధి హామీ పథకం, రెవెన్యూ కార్యాలయాల్లో ధృవపత్రాల జారీ వంటివి పారదర్శకంగా అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రతి మూడు నెలల లక్ష్యాన్ని నిర్ధేశించి సమీక్షిస్తామని చెప్పారు.

ప్రభుత్వ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. గత ముఖ్యమంత్రులు వైఎస్, రోశయ్యలు ప్రారంభించిన కార్యక్రమాలన్నింటిని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.రాష్ట్రంలోనూ.. హైదరాబాద్‌లోనూ ప్రత్యేకంగా పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుతామని అన్నారు. పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ మజిలీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ పెట్టుబడులకు సానుకూల వాతావరణం నెలకొల్పుతామని అన్నారు. విద్య, ఆరోగ్యాలకు తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
  
       రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాలు-1లో ఆయన సీఎంగా మొదటిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘శాంతిభద్రతల విషయంలో నేను చాలా గట్టిగా ఉంటాను.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు లోబడి ఏమైనా చేసుకుంటే తప్పులేదు. కానీ శాంతికి భంగం కలిగిస్తే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. డిసెంబర్-31వ తేదీ తదనంతర పరిణామాలపై ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కిరణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ విషయమే ప్రశ్నించినప్పుడు ‘భవిష్యత్‌లో నా పనితీరే మీరడిగిన ప్రశ్నకు సమాధానం’ అని చెప్పారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో శాంతి నెలకొల్పి వాటిని పెట్టుబడులకు ఒక సుహృద్భావ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

ఆ పథకాలకు అత్యంత ప్రాధాన్యం
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చిన పథకాలు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన, రోశయ్య కొనసాగించిన పథకాలన్నిం టికీ అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తానని కిరణ్ వెల్లడించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో లొసుగులను అరికట్టి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజారోగ్యం, విద్యకే తన ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసేలా కొత్త విధానాలను సృష్టిస్తామని చెప్పారు.

ప్రజలకు ప్రధానంగా అవసరమైన పది నుంచి పన్నెండు అంశాలను ఎంపిక చేసి వాటిలో ఈ విధానాలను ప్రవేశ పెడతామనీ, వాటి పనితీరు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులను ఈ వ్యవస్థల పనితీరుకు బాధ్యులుగా చేస్తామని చెప్పారు. ఇలా ఎంపిక చేసే అంశాల్లో ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ(చౌకడిపోలు), విద్యార్థుల ఉపకార వేతనాలు, ఉపాధి హామీ పథకం, రెవెన్యూ కార్యాలయాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీ లాంటివి ఉంటాయన్నారు. వీటన్నింటిలోనూ లక్ష్యాలను నిర్దేశిస్తామని, ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తామని చెప్పారు.

పోలవరం, ప్రాణహితలకు జాతీయ హోదా సాధిస్తాం

కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు సంపాదించడానికి రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ కలుపుకొని కలిసికట్టుగా కృషి చేస్తామని కిరణ్ కుమార్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొనిపోతామని, వారి సహకారాన్ని తీసుకుంటామని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపినపుడు కూడా తాను ఇదే విషయం చెప్పానని అన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు రెండింటికీ జాతీయ హోదా సాధించేందుకు కృషి చేస్తామన్నారు. పథకాల అమలులో గత ఆరున్నరేళ్లుగా లొసుగులున్నాయని భావిస్తున్నారా? అని ప్రశ్నించినపుడు ‘పథకాల అమలులో కొన్ని లోపాలు ఎపుడూ ఉంటాయి... ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ వంటి వాటిలో. అందుకే కొత్త పద్ధతులు సృష్టించాలని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. జలయజ్ఞం, రాష్ట్ర పారిశ్రామికీకరణను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.

వైఎస్ కోరిక... రాహుల్ ప్రధాని
‘దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోవడానికి నాలుగైదు రోజుల ముందు.. రాష్ట్రంలో 41 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని కేంద్రంలో రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలని భావించారు. ఇది ఆయన చివరి కోరిక. దానిని నెరవేర్చడానికి శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను’ అని కిరణ్ అన్నారు. ఈ మాటలన్నపుడు పక్కనే ఉన్న దానం నాగేందర్ బల్లపై మెల్లగా చప్పట్లు చరిచారు. విలేకరుల సమావేశం అని వెంటనే గ్రహించి మిన్నకుండిపోయారు. వైఎస్ చివరి కోరికను నెరవేర్చడంలో అందరినీ కలుపుకొని పనిచేస్తానని ఆయన మరోసారి అన్నారు. పదవీ ప్రమాణం కాగానే నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ వార్డులోని రోగులను కలవడానికి కారణం వైఎస్ ప్రాభవాన్ని తగ్గించడానికేనా అని ప్రశ్నించినపుడు.. కాదని కిరణ్ సమాధానం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యానికి, విద్యకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికే తప్ప వేరే ఉద్దేశమేదీ లేదన్నారు.

కొంత సమయం ఇవ్వండి
మీరు ప్రతిపక్షంలో ఉండగా కుప్పం ప్రాజెక్టు లొసుగులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కదా, ప్రస్తుతం ఆ నివేదిక దుమ్ముపట్టిపోయి ఉంది, మీరు మళ్లీ దానిని వెలికి తీస్తారా? అని ప్రశ్నించినపుడు ‘ఇపుడే వచ్చాను కదా, నాకు కొంత సమయం ఇవ్వండి’ అని కిరణ్ సమాధానం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని ప్రశ్నించగా అధిష్టానంతో చర్చించాక వారు చెప్పిన ప్రకారమే విస్తరణ చేస్తానన్నారు. ఢిల్లీకి వెళ్లేదుంటే మీకు చెప్పే వెళతాను అని వివరించారు. మంత్రివర్గంలో ఎందరుంటారు? ప్రస్తుత మంత్రులే ఉంటారా? అన్నప్పుడు ఆయన సమాధానం ఇవ్వలేదు. పార్టీలో వర్గాలు, విభేదాలు గురించి ప్రస్తావించగా తాను పదవి చేపట్టినప్పటి నుంచీ 99 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి కలిసి వెళ్లారని వివరించారు. అందరినీ కలుపుకొనిపోతానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ప్రశ్నలడిగినపుడు ఆయన స్పందించలేదు.

ఎవరినీ ఫినిష్ చేయను
వైఎస్ చివరి కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తానంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోతుందని కూడా ఆయనే అన్నారు కదా, దానిని కూడా నెరవేరుస్తారా అని ఒక విలేకరి అన్నప్పుడు ‘లేదు, ఎవరినీ ఫినిష్ చేసే రాజకీయం చేయను. ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రతిపక్షం ఉండాలి’ అని కిరణ్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

సోనియా, మన్మోహన్‌లకు కృతజ్ఞతలు
తనకు రాష్ర్ట ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అంతకుముందు కిరణ్ ప్రకటించారు. దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా తన ఎంపిక కోసం రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చిన కేంద్ర మంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, ఏ.కె.ఆంటోనీ, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం వరకూ తాను ఇక్కడ (అసెంబ్లీలో) స్పీకర్‌ననీ, మీడియా సలహా మండలి సమావేశంలో కూడా పాల్గొన్నాననీ, ఇవాళ సీఎంగా మీ ముందుకు వచ్చానని కిరణ్ తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా తనకు మీడియా మద్దతు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్ర : సీఎం ఆఖరి కోరిక అన్నారు. వైఎస్ ముందూ వెనుక చూస్తే తరచూ ముఖ్యమంత్రుల మార్పు బలహీనత కాదా ?

సీఎం : మా ముఖ్య ఉద్దేశం .. రాజశేఖరరెడ్డి చనిపోవడానికి మూడు రోజుల ముందు రాహుల్ గాంధీని 2014లో ప్రధానిని చేయాలని అన్నారు. రాజశేఖరరెడ్డి రాజకీయంగా ఒక కోరికో లేక ఆశ .. ఆయన ఆఖరి రాజకీయ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం.

ప్ర : లీకేజీలు నివారిస్తామని అంటున్నారు. ఆరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో లీకేజీలు ఉన్నాయని అంగీకరిస్తారా ?

సీఎం : లీకేజీ అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి కోసం పెట్టిన పథకం వారికే చెందే విధంగా అమలు చేయాలని.. ఇప్పుడు కూడా లొసుగులు ఉన్నాయి. రేషన్ షాపుల్లో గాని.. బియ్యం పంపిణీలో గాని.. ఆరోగ్యశ్రీలోగాని కొత్త సిస్టమ్ డెవలప్ చేసి పారదర్శకంగా అమలు చేస్తాం.

ప్ర : ఇంత మంది సీనియర్‌లు ఉండగా మిమ్మల్నే ఎందుకు సీఎంగా ఎన్నకున్నారు?

సీఎం : నేను ఎవ్వర్నీ కోరడం జరగలేదు. దానికి నేను సమాధానం చెప్పలేను.

ప్ర : వైఎస్‌కు అత్యంత ఇష్టమైన ఆరోగ్య శ్రీ సందర్శించడం ద్వారా ఆయన్ను మరిపించాలన్న ఉద్దేశం ఉందా ?

సీఎం : నేను మొట్ట మొదట నా ప్రభుత్వానికి , కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం సక్రమంగా ఉండాలని.. ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ మొదలు పెట్టారు కాబట్టి, దానిని పక్కన పెట్టాలని కాదు. దానిని మెరుగుపరచాలని వెళ్లాను. ప్రభుత్వ ప్రాధాన్యం విద్య, వైద్యం . అందుకే 'ఫస్ట్ గెస్చర్' గా ఆరోగ్య శ్రీ అమలును సమీక్షించాను. పేదవాడికి, అట్టడుగున ఉన్నవానికి డబ్బులేక వైద్యం అందకుండా పోకుండా ఉండేందుకే ఆరోగ్య శ్రీ పెట్టారు. దానిని మరింత బలోపేతం చేస్తాం. ఇలాంటి నెగిటివ్ ప్రశ్నలు వద్దు.

ప్ర : ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయి కదా?

సీఎం : ప్రజలకు గవర్నర్నెన్స్ ద్వారా పారదర్శకంగా పథకాలు అందేలా చూస్తాను.

ప్ర : మంత్రివర్గం ఎప్పుడు ? పాతదే కంటిన్యూ అవుతుందా ?

సీఎం : మంత్రివర్గం విషయం అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.

ప్ర : రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు 41 లోక్‌సభ స్థానాలను తీసుకువస్తానంటే ప్రతిపక్షాలను ఫినిష్ చేస్తారా ?

సీఎం : రాహుల్‌ను ప్రధానిని చేయాలన్నది వైఎస్ ఆఖరి కోరిక. ప్రతిపక్షాలను ఫినిష్ చేయాలన్న ఆలోచన లేదు. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి. ప్రజలకు మేలు జరుగుతుంది.

ప్ర : కాంగ్రెస్‌లో జగన్ వర్గాన్ని కలుపుకొని పోతారా ?

సీఎం : ప్రతి ఒక్క కాంగ్రెస్‌నేతనూ కలుపుకొని పోతాను

ప్ర : గత ఏడాదిగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది.. ప్రభుత్వం ఉందా అనే సందేహం నెలకొంది. సీఎంగా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ?

సీఎం : నేను ప్రధాన అజెండాలోనే చెప్పాను. హైదరాబాద్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే 'ఫేవర్ డెస్టినేషన్' చేయాలంటే శాంతి భద్రతలను కాపాడితే తప్ప జరగదు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండడం జరుగుతుంది.

ప్ర : ప్రజల విజ్ఞాపనలు కోరికలు తెలుసుకోవడానికి సమయం కేటాయిస్తాను.

సీఎం : నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఐదారు గంటలయింది. కచ్చితంగా ప్రజల వినతుల స్వీకరణకు సమయం కేటాయిస్తాను. ఇదే ప్రధాన్యం.

ప్ర : పార్టీలో అందర్నీ కలుపుకుని పోతానని అన్నారు. కాని ప్రెస్‌మీట్‌లో యువకులే ఉన్నారు

సీఎం : నాకు నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా 99 శాతం మంది కలిశారు.

ప్ర : హైదరాబాదీనే అన్నారు. తెలంగాణ ఉద్యమంపై మీ అభిప్రాయం ?

సీఎం : నా వర్కింగే సమాధానం చెబుతుంది. శాంతి భద్రతల విషయానికి వచ్చే సరికి రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కులు ఏవీ కూడా భంగం కలగకుండా చేయడం జరుగుతంది. కాని భంగం కలిగే విధంగా ఉంటే కఠినంగా, కచ్చితంగా ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది.

ప్ర : డిసెంబర్ 31 తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తుంది కదా ?

సీఎం : ఇంకా ఇవ్వలేదు కాదా ? రిపోర్టు వచ్చాక చూద్దాం.

ప్ర : మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉంది కదా ?

సీఎం : ఇప్పుడే సీఎం బాధ్యత చేపట్టి ఐదారు గంటలైంది. మేనిఫెస్టోలో ఉన్నవాటినన్నింటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం.

ప్ర : తెలంగాణపై విషయంలో వైఖరి ?

సీఎం : దీనికి సంబంధించి ఒక కమిటీ వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తే దానిని అమలు చేస్తాం.

ప్ర : రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల సమస్యలపై ఎలా స్పందిస్తారు ?

సీఎం : సమస్యలను చర్చల ద్వారారే పరిష్కారం జరపాలి. ఇప్పటికే పన్నెండో .. పదమూడో సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వాటన్నింటితో రేపో ఎల్లుండో కూర్చుని చర్చించి పరిష్కరిస్తా. ఫస్ట్ కేబినెట్ రావాలి. తర్వాత టోటల్ ఫంక్షనింగ్ రాలేదు.

ప్ర : డిప్యూటీ సీఎం వస్తామంటున్నారు ?

సీఎం : నేను ఎవరు వచ్చినా .. అందర్ని కలుపుకొని పనిచేస్తాను.

ప్ర : చర్చలద్వారానే సమస్యల పరిష్కారం అంటున్నారు. మావోయిస్టులు చర్చకు వస్తామంటున్నారు.

సీఎం : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాని.. మావోయిస్టులు 13 జిల్లాల్లో ఉన్నారు. కేంద్రం చూస్తోంది. దీనిపై రాష్ట్రం ఏమీ చేయదు. యథాతథ స్థితి కొనసాగుతుంది.

ప్ర : మీపై స్థలానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి కదా?

సీఎం : స్థలానికి సంబంధించి వివాదమేమీ లేదు. శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీలో 110 కేసులు ఉన్నాయి. నా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉందని తీసుకున్నాను. అయితే.. తక్కువ ధరకు తీసుకున్నానని ఒక మీడియా (ఆంధ్రజ్యోతి కాదు) పేర్కొంది. దీంతో ఆ స్థలం వాపసు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. ఇంకా వివాదం ఎక్కడ ఉంది.

ప్ర : పోలవరం జాతీయ హోదాకు ప్రయత్నం చేస్తారా ?

సీఎం : పోలవరం , ప్రాణహితకు జాతీయ హోదా కల్పించేందుకు ప్రయత్నం చేస్తాను.

ప్ర : పీఆర్పీ కేబినెట్‌లో చేరుతుందా ?

సీఎం : మీరు రాసినదానికి నేనేం సమాధానం చెబుతాను. అధిష్ఠానం నిర్ణయం మేరకు కేబినెట్ ఉంటుంది.

ప్ర : జగన్‌పై చర్యలు ఉంటాయా ?

సీఎం : జగన్ పై క్రమశిక్షణా చర్యలు అనేది .. పార్టీ వ్యవహారం. నేను ముఖ్యమంత్రిని. పార్టీ వేరు ప్రభుత్వం వేరు.

ప్ర : మీరు ఢిల్లీకి ఎప్పుడు పోతున్నారు ?

సీఎం : మీకు చెప్పే పోతాను.