Tuesday, December 28, 2010

సీఎంకు తెలంగాణ సెగ...!

dsw
కష్టాల మీద కష్టాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ పార్లమెంటు సభ్యుల దీక్ష రూపంలో కొత్త కష్టం వచ్చిపడింది. సొంత పార్టీకి చెందిన తెలంగాణ పార్ల మెంటు సభ్యులు దీక్షకు దిగడంతో పాటు, కేసుల ఎత్తివేతలో ఎంపీలు తన నిర్లక్ష్యవైఖరిని బహిరంగంగానే విమర్శిం చడం కిరణ్‌ కుమార్‌రెడ్డిని కొత్త సమస్యల వైపు నెట్టినట్టయింది. తాజా పరిణా మాలన్నీ తెలంగాణ విద్యార్థుల దృష్టిలో ‘సీఎం తెలంగాణ వ్యతిరేకి’గా ముద్ర పడేందుకు కారణమవుతున్నాయన్న వ్యా ఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

తాను హైదరాబాదీ నేనని ఉస్మానియా విద్యార్థినేనని కిరణ్‌ ఎన్నిసార్లు చెప్పినా, అవి ప్రస్తుత పరిస్థితిని చల్లార్చేలా కనిపించడం లేదు. తెలం గాణ ఉద్యమంలో విద్యార్థుల మీద పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులను బేషరతుగా తొలగించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు దీక్షకు దిగడం సీఎంని రాజకీయంగా ఇరుకున పడవేసింది. ఇది సొంత పార్టీ ఎంపీలనే సీఎం నియంత్రిం చలేకపోయారని, ఇక మామూలు నేతలను ఏం నియంత్రి స్తారన్న సంకేతాలు వెళ్లడమే దానికి కారణం.

ప్రభు త్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేసేందుకు దీక్షలు, ఆందోళ నలు చేస్తాయంటే దానిని అర్థం చేసుకోవచ్చని, కానీ సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే దీక్షకు దిగడం వల్ల ప్రభుత్వం విఫలమయిం దన్న భావన ప్రజల్లో పాతకు పోతే వ్యక్తిగతంగా ఒక సీఎంగా అది తనకే అప్రతిష్ఠగా పరిణమించే ప్రమాదముందని కిరణ్‌ ఆందోళనలో ఉన్నారు. డిసెంబర్‌ తర్వాత జరగనున్న పరిణామాలు కఠినంగా ఉంటాయని, అది కూడా టీఆర్‌ఎస్‌-టీడీపీ పోటాపోటీ రాజకీయ వ్యూహాల వల్ల పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంటుందేమోనని అందరూ భావిస్తున్నారు.

అయితే అంతకంటే ముందే ఆ ప్రమాదం సొంత పార్టీ ఎంపీల నుంచే ముంచుకురావడం కిరణ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా పరిణామాలు ఆయనను కలవరపరు స్తున్నాయి. జానారెడ్డి, జైపాల్‌రెడ్డిలో ఒకరు ముఖ్యమంత్రి అయితే ఈ పరిస్థితి ఉండేది కాదని ఎంపీ సర్వే సత్య నారాయణ మీడియా సమక్షంలోనే వ్యాఖ్యానించటం, దానిని మిగిలిన ఎంపీలు బలపరచడం బట్టి.. కిరణ్‌ కుమార్‌రెడ్డిని తెలంగాణ ఎంపీలు ఆమోదించడం లేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది.

కేవలం ముఖ్యమంత్రి మొండివైఖరి వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని, తాము ఈనెల 20నే సీఎంను కలసి కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని స్పష్టం చేసినా కిరణ్‌ దానిని లెక్కచేయకుండా మాట్లాడారని, అందుకే తాము నిస్సహాయ పరిస్థితిలోనే దీక్ష చేయవలసి వచ్చిం దని దీక్షలో పాల్గొన్న ఎంపీలు బాహాటంగానే మీడియాకు స్పష్టం చేస్తుండటం కూడా ముఖ్యమంత్రికి ఇబ్బంది కరంగా పరిణమించింది. దీనివల్ల కేవలం తన కారణం గానే కేసుల ఎత్తివేత అంశంలో ప్రతిష్ఠంభన ఏర్పడిం దన్న ఎంపీల ఆరోపణలను తిప్పికొట్టలేక ఇబ్బందిపడు తున్నారు.

ఈ మొత్తం వ్యవహారానికి ముఖ్యమంత్రిని బాధ్యుడిగా చేస్తూ జరుగుతున్న ప్రచారం వ్యక్తిగతంగా కూడా కిరణ్‌కు సైతం రాజకీయంగా నష్టంగానే భావిస్తున్నారు. దీక్ష విరమణకు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు వంటి మంత్రులు వెళ్లినా వారి ఎదుట కూడా ఎంపీలు ‘దీనికి కారణం ముఖ్యమంత్రేన’ంటూ సర్వే వంటి ఎంపీలు ముఖం మీదే స్పష్టం చేయడం బట్టి.. తెలంగాణ ఎంపీలు కిరణ్‌ తీరుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తోంది. చివరకు మంత్రులను కూడా ఎంపీలు ఖాతరు చేయక పోవడం ద్వారా ప్రభుత్వానికి-కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీల మధ్య దూరం పెరిగిందన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. కేసులన్నీ ఎత్తివేసేవరకూ చర్చించడం కుదరదని సీడబ్ల్యుసీ సభ్యుడిగా వ్యవహరించి, ఒక రాష్ట్ర ఇన్చార్జిగా పనిచేస్తున్న కేశవరావు వంటి సీనియర్లు కూడా నిర్మొహమాటంగా మాట్లాడటం కిరణ్‌ సర్కారును చిక్కుల్లో పడవేసింది.

డిసెంబర్‌ తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తు తాయని, తనకు అధిష్ఠానం కేవలం 3 నెలలు మాత్రమే గడువు విధించిందన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశ మయిన నేపథ్యంలో.. సొంత పార్టీ నుంచే, అదీ తెలం గాణ రూపంలో సెగ తగలడంతో కిరణ్‌ ఆత్మ రక్షణలో పడిపోయారు. తెలంగాణలో పోలీసు దళాలను మోహరిం చడాన్ని టీఆర్‌ఎస్‌-టీడీపీతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కూడా నిరసిస్తున్నారు. వారిని వెనక్కి పంపిస్తే ఆ తర్వాత జరిగే ఘర్షణ పరిస్థితిని నియంత్రిం చడంలో విఫలమవుతే దానిని కారణంగా చూపించి తనను తప్పిస్తా రన్న భయాందోళన కూడా ఆయనలో లేకపోలేదు. బలగాలను మోహరించి, వారితో ఉద్యమాన్ని అణచివేస్తే తెలంగాణ వాదులు రేపే ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడం ఇంకా కష్టమవుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది.

సొంత పార్టీ ఎంపీల దీక్ష అనంతర పరిణా మాలు సీఎం్‌కు- తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల మధ్య సమ న్వయం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ సంకే తాలు ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్లడం ఆయనకూ ప్రతిష్ఠాత్మ కంగా పరిణమించింది. సీఎం- మంత్రులు చెప్పినా వినని పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సామాన్య ప్రజానీకం లో నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇక డిసెంబర్‌ తర్వాత తలెత్తే రాజకీయ పరిణామాలు ఇంకెంత తీవ్రంగా ఉంటా యోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ నెలకొంది. మొత్తానికి ఎంపీలు- శాసనసభ్యులతో సీఎంకు సాన్నిహిత్యం గానీ, సమన్వయం గానీ లేదన్న వాస్తవాన్ని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.

Friday, December 24, 2010

అన్నదాతకు ఆసరా

kirankumar
భారీ వర్షాలతో కళ్ళముందే నోటికాడికొచ్చిన పంటంతా తడిసి నేల పాలు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి అమలు చేయ బోతోంది. జరిగిన నష్టంనుంచి తేరకునే దారి కనిపించక గుండె పగిలి కొందరు, విషంతాగి మరి కొందరు, గొంతుకు ఉరి బిగించుకుని ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాలనుంచి ఇప్పటివరకు సుమారు రెండు వందల మంది రైతులను పంటనష్టాల రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఆరుగాలం చెమటోడ్చి పంటల సాగుద్వారాఅంతో ఇంతో మిగిల్చి కుటుంబాన్ని నెట్టుకొచ్చే పెద్దదిక్కును కోల్పోవంటంతో రైతుల కుటుంబాలు వీధి పాలవుతున్నాయి.

ఉన్న ఒక్కదిక్కును కోల్పో వటం ఒకపక్క, పంటలసాగుకోసం చేసిన పెట్టు బడి ఖర్చులు మిగిల్చిన రుణాల గాయం మరోపక్క రైతుల కుటంబా లను జీవశ్చవాలుగా మారుస్తు న్నాయి. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలద్వారా ప్రా ణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేం దుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయాలు సహా యం అందించాలని రాష్ట్ర మంత్రులు కొందరు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి సూచించారు.

మంత్రుల సూచనపై అధి కారులతో సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి అన్ని కోణాలనుంచి జరిపిన విష్లేషణల అనంతరం ప్రత్యేక పరిహారం అందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమా చారం. మృతి చెందిన రైతుల కుటంబాలకు ఒక్కోక్కరికి లక్షన్నర రూపాయలు అందించేం దుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివ రకూ మృతి చెందిన రైతుల సంఖ్య రెండువందల దాక ఉన్నందువల్ల వీరందరికి లక్షన్నర రూపా యల ప్యాకేజి అందించేందుకు ప్రభు త్వానికి అయ్యే ఖర్చు మూడు కోట్ల రూపాయలకు మించ దని అధికారులు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కి నివేదించినట్టు సమాచారం.

తడిసిన ధాన్యం ‘గ్రేడ్ల’ ఎత్తివేత!
రాష్ట్రంలో తడిసిన ధాన్యం కొనుగోళ్ళకు సంబం దించి ఉన్న గ్రేడ్ల నిభందనలను పూర్తిగా తొలగిం చాలన్న ప్రతిపాదలకు ప్రభుత్వం సుముఖతతో ఉన్నట్టు సమాచారం. భారీ వర్షాలు వరదల్లో వరిపొలాలు నీట మున గటం, నేల వాలిన వరిపై నీరు నిలిచి పైరుపైనే ధాన్యం మొలకలు వచ్చాయి. కొన్ని జిల్లాల్లో కోత కోసి కుప్పలేసిన వరి ఓదెలు తడిసి పోయాయి. మరికొన్ని జిల్లాల్లో పొలాల మీద ఉన్న ధాన్యపు రాసులే తడిసి మోసులెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం సుమారు 40 లక్షల టన్నులు ఉంటుందని ప్రాథమిక సమా చారాన్ని బట్టి తెలుస్తోంది.

అయితే ఇందులో 20 లక్షల టన్నుల మేరకు ధాన్యం 5నుంచి పదిశాతం తడిసినది ఉంటుందని, మరో పది లక్షల టన్నుల దాకా పదినుంచి 20 శాతం తడిసిన ధాన్యం ఉం టుందని ప్రభుత్వ వర్గాల అంచాలను బట్టి చెబు తున్నారు. ఇక పూర్తిగా తడిసి నల్లబడ్డ ధాన్యం పదిలక్షల టన్నులకు మించదని చెబుతున్నారు. పదిలక్షల ధాన్యం క్వింటాలుకు రూ 6వందలు చెల్లించినా ప్రభుత్వానికి 6వందల కోట్లు రూపా యలకు మించి ఖర్చు కాదం టున్నారు. ప్రతినెలా ఉద్యోగుల జీతాల కింద 2600కోట్ల రూపాయలు చెల్లిస్తున్న ప్రభుత్వానికి మహావిపత్తులో చిక్కి విలవిల లాడుత్ను రైతన్నలను ఆదుకునేందుకు 600 కోట్లు లెక్కలోకే రాదంటున్నారు.

పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వంలో ఉన్న వెసులు బాటునంతా ఉపయో గించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా అధికారులకు గట్టిగానే ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యలోనే ధాన్యంలో తేమశాతం గ్రేడ్లతో నిమిత్తం లేకుండా రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అధికా రులకు సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్ళ గ్రేడింగ్‌ను కూడా తొలగించేందుకు ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆందోళనతో ఉన్న రైతుల్లో కొంతయినా ధైర్యం నింపుతాయన్న అభి ప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన హెక్టారుకు 6వేల పెట్టుబడి రాయితీని కూడా 8వేలకు పెం చేందుకు కేంద్రాన్ని ఒప్పించే దిశగా చర్యలు తీసుకో వాలన్న నిర్ణయంతో ఉన్నారు.

Thursday, December 23, 2010

బాబూ .. రైతుబాంధవుడే ...

Kiran-Kumar-Reddy1
తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు రైతుల సమస్యల్ని పట్టించుకోలేదని, వ్యవసాయం దండగ అన్నారని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేతను విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారానికి నిరాహారదీక్ష చేపట్టిన బాబును దీక్ష విరమించమని తను స్వయంగా కోరానని, చర్చలకు మంత్రుల్ని పంపించానని, అయినా ఫలితం లేకపోయిందని కిరణ్‌కుమార్‌ చెప్పారు. ‘రైతు బాంధవుడివి అనిపించుకున్నావు. ఇక దీక్ష విర మించు’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. బుధవారం కిరణ్‌కుమార్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ‘బాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు...కరెంటు సమస్య పరిష్కరించాలని 98 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరాహార దీక్షచేస్తే అధికారులు, టిడిపి నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు దీక్ష విరమించమని మేం పదేపదే అడుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు మెత్తని స్వభావం కలిగిన కాంగ్రెస్‌ నాయకులం దీక్ష వద్దని పదే పదే కోరినా బాబు స్పందించలేదు’ అని ఆయన విమర్శించారు.

గతంలో ...
గతంలో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టిన వారి గురించి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. జలగం వెంగళరావు, మర్రిచెన్నారెడ్డి లాంటివారు కాంగ్రెస్‌ నుంచి విడిపోయి, తిరిగి పార్టీలోకి వచ్చి గుర్తింపు పొందారని చెప్పారు. ‘రాష్ర్టంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. ఈ సమయంలో పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు’ అని ముఖ్యమంత్రి పరోక్షంగా కడప మాజీ ఎంపి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు.
రైతు రుణాలు రీ షెడ్యూల్‌
వరదలు వచ్చి ఆరు జిల్లాల్లో రైతులు నష్ట పోయారని , వారు తీసుకున్న బ్యాంకు రుణాల్ని రీషెడ్యూల్‌ చేస్తామని, ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వరద ప్రాంతాలలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ, 400 కోట్లు ముందస్తు సహాయం కింద మంజూరు చేసిందని, గడిచిన 6 సంవత్సరాలలో వరదల్లో నష్ట పోయిన రైతుకు తమ ప్రభుత్వం రూ, 8 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, 9 ఏళ్ల టిడిపి పాలనలో కేవలం 33 కోట్లే ఖర్చు పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరు రైతుల పక్షపాతో ప్రజలే నిర్ణయించాలన్నారు.అతి త్వరలో రచ్చబండ కార్యక్రమాన్ని పనరుద్ధరిస్తున్నామని, ప్రజల దగ్గరే సమస్యలు పరిష్కారం అవుతాయని, అక్కడిక్కడే సంబంధిత శాఖ అధికారులను పిలించి పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపూ ఆందోళనగా ఉన్నట్టు కనిపించారు. ఆయన జిల్లా పర్యటనకు వచ్చేదారిలో టీఆర్‌ఎస్‌, టిడిపి, జగన్‌ వర్గం నాయకులు కిరణ్‌ కాన్వయిని అడ్డుకున్నారు. పోలీసుల ఆందోళన కారులను చెదరగొట్టి సీఎం కాన్వాయ్‌ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.

అయితే, ఆయన మాత్రం ప్రసంగంలో తడబాటుకు గురయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో మడమ తిప్పలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో 28 లక్షల మంది రైతులకు ఉచిత కరెంటు అందేశామని, అందుకు అయిన 21 వేల కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వమే భరించిందనీ చెప్పారు. రాష్ర్టంలో ఒకే సమయంలో అతివృష్టి అనావృష్టి సంభవిస్తే తట్టుకోలేమని గుర్తించిన వైఎస్‌ 86 ప్రాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారని ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి సంవత్సరం 3,4 వేల టీఎంసీల నీరు ఆదా చేసుకోవచ్చన్నారు.

Wednesday, December 22, 2010

రైతు బాంధవుడు అనిపించుకోవాలన్న మీ లక్ష్యం నెరవేరింది కదా, ఇక దీక్ష విరమించండి * చంద్రబాబుకు కిరణ్‌కుమార్ విజ్ఞప్తి

జడ్చర్ల, డిసెంబర్ 22 : రైతు బాంధవుడు అనిపించుకోవాలన్న మీ లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇకనైనా నిరాహార దీక్ష విరమించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక ఆలస్యం చేయకుండా చంద్రబాబు దీక్ష విరమించుకోవాలని సభాముఖంగా కోరుతున్నట్టు ఆయన చెప్పారు.

బుధవారంనాడు జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు అమలుచేసిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వై.ఎస్.తో కలిసి తాము ప్రతిపక్షంలో ఉండగా 11 రోజులు దీక్ష చేస్తే అప్పుడు కనీసం పట్టించుకున్న నాథుడు లేరని గుర్తు చేశారు. జడ్చర్లలో వై.ఎస్. విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి ఆనాటి విషయాలను గుర్తు చేశారు.

ఇప్పటికే తాము రైతులకోసం ఎంతో చేశామని, ఇంకా చేస్తామని, అందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో మీరు ఇచ్చినదెంతో, మేము ఒక్క సంవత్సరంలోనే రైతులకు చేసిన సంక్షేమ కార్యక్రమాల విలువ ఎంతో బేరీజు వేసుకోవాలని సభాముఖంగా కోరుతున్నట్టు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఐదరేళ్ళలో అంటే 2004 నుంచి 2010 వరకు వరదలకు, కరువులకుగాను మనకు 3,400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ భారీ వర్షాల నష్టపోయిన రైతులకోసం 400 కోట్ల రూపాయలను ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లో 2004 నుంచి 3,200 కోట్లు ఖర్చుపెట్టాం. అంటే గత ఐదేళ్ళలో 6,600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. అదిగాక రైతుల కోసం మరో వెయ్యి కోట్లు మంగళవారం ప్రక టించాం. అంటే సుమారు రూ. 7,600 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చుపెడితే తెలుగుదేశంపార్టీ తమ తొమ్మిదేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ. 1600 కోట్లు కాక 33 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. దీనిని బట్టి మీరు అర్ధం చేసుకోండి ఎవరు రైతు బాంధవుడు, ఎవరు రైతు పక్షపాతి అని - ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ళలో 8,000 కోట్లు ఖర్చుపెట్టిన మేము రైతుబాంధవులమా, తొమ్మిదేళ్ళలో 33 కోట్లు ఖర్చుపెట్టిన వారు రైతు బాంధవులా మరొక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను అని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో సమస్య ఎక్కువగా ఉంది. అందులో విభేదించేది లేదు. పంటలుపోయి రైతులు చాలా నష్టపోయారు. రైతులు నష్టపోయినదానికి వీలైనంత వరకు ఈ ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను మరోమారు చంద్రబాబును కోరుతున్నా - మీరు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చేసిన దీక్ష ప్రజల దృష్టికి వచ్చింది. ప్రజల దగ్గర రైతుబాంధవుడిగా చెప్పుకునేందుకు మీ లక్ష్యం నెరవేరింది. అందుచేత దేనికోసమైతే నిరాహారదీక్ష చేస్తున్నారో అది నెరవేరినందువల్ల దీక్ష విరమించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అంటే అభిమానం ఉంది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే అలాగే ఇచ్చేవాళ్ళమని, ఇచ్చే పరిస్థితి లేదని, ఎటువంటి భేషాజాలకు పోవలసిన అవసరం లేదని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన రైతు వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొని తొమ్మిదేళ్ళు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అటువంటిది మనం చెడు చేసుకునే పరిస్థితి రాకూడదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇటిక ఇటిక కూడబెట్టి పునాదిని గట్టి చేసి, ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేశారని ఆయన చెప్పారు.

ఈ ప్రభుత్వం ఉందంటే ఇది మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, మీరు తెచ్చిన ప్రభుత్వం, ఇది నాయకులు తెచ్చిన ప్రభుత్వం కాదు, కార్యకర్తలు మీరు కష్టపడి తీసుకొచ్చిన ప్రభుత్వం. అందుచేత దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రజలకు మేలు చేయాలని మమ్మల్ని మీరు నిలబెట్టారు. ఆ నమ్మకం ఉంచి, మీకు తలవంచి ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాను.

ఇది గాక ఇంకొక ప్రధానాంశం - దివంగత రాజశేఖర్‌రెడ్డి 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పునాదిని నెలబెట్టడానికి ఎంతో కష్టపడి పాదయాత్రచేసి ఎంతో కృషి చేశారు. దానికి మనమంతా సహకరించడం జరిగింది. అందుచేత వై.ఎస్.కు సోనియాగాంధీ దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉండేది. మేమందరం కూడా గౌరవించే వ్యక్తి ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీని వదిలిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. అలాగే తిరిగి వచ్చినవాళ్లు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాది గట్టిగా ఉంది అని ఆయన చెప్పారు. త్వరలోనే రచ్చబండ కార్యక్రమం మొదలుబెట్టబోతున్నామని కూడా కిరణ్ ప్రకటించారు.

click here

నత్తనడకన నల్లారి పాలన * కిరణ్‌ బెంబేలు ! * సోనియాకు సవాల్‌ !

Secretariat
నల్లారి పాలన నత్తను తలపిస్తోంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి ఫైళ్ళు పెండింగ్‌ పెట్టబోనని స్పష్టం చేసిన సిఎంగారు తన మంత్రివర్గంలోని సభ్యులకు మాత్రం ఇప్పటి వరకు సహా యకులను, కార్యాలయాల సిబ్బందిని అందించలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ మంత్రుల కార్యాలయాల నుంచి సాధారణ పరిపాలన శాఖ(జిఎడి)కి ప్రతిపాదనలు అంది దాదాపు నెలరోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రులకు సంబంధించిన ఆఫీసు వ్యవహారాల విషయంలోనే ఇంతగా నిర్లక్ష్యం ఉంటే ఇక రాష్ట్ర పరిపాలన వ్యవహారాల సంగతి మాటేమిటనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

సాధారణంగా మంత్రుల కార్యాలయాల్లో వ్యక్తిగత కార్యదర్శులు(పిఎస్‌), ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ(ఒఎస్‌డి)వ్యక్తిగత సహాయకులు(పిఎ), ప్రజా సంబం ధాల అధికారులు(పిఆర్వోలు)లతో పాటు అటెండర్ల కేటాయింపులు ఉంటాయి. ఇందులో ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్‌(డిడి) స్థాయికి మించి జాయింట్‌ డైరెక్టర్‌(జెడి) లేదా ఆపై స్థాయి అధికారులు మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శులుగా, ఒఎస్‌డిలుగా పనిచేసే అవకాశం ఉంది. జాయింట్‌ డైరెక్టర్‌ హోదా కలిగిన అధికారుల డిప్యూటేషన్లకు మాత్రం ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరి. జెడి స్థాయి అధికారులు మినహా మిగతా సిబ్బంది డిప్యూటేషన్లకు ఆయా శాఖల అధిపతుల ద్వారా ఆర్ధిక శాఖ అనుమతితో నియామకాలు జరిపే అవకాశం ఉంటుంది.

కానీ ఇప్పటి వరకు మంత్రుల కార్యాలయాల్లో సిబ్బంది కేటాయింపులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో మంత్రులు శాఖలపై ఇంకా పట్టుసాధించలేకపోతున్నారు. దీంతో సదరు మంత్రులు తమ పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడ కొనసాగించాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్తగా మంత్రిపదవులు పొందిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసలే ఇష్టంలేని శాఖలు, ఆపై సహాయకులు(పిఎస్‌ లేదా ఒఎస్‌డి) లేకపోవడంతో ఏమి చేయాలో పోలుపోని పరిస్థితుల్లో మరికొందరు ఉన్నారు.

మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్ళే ముందు వారి పర్యటన(టూర్‌ ప్రోగ్రామ్‌)లకు సంబంధించిన వివరాలను సదరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు తెలియజేయాల్సి ఉం టుంది. అదేవిధంగా సాధారణ పరిపాలన శాఖకు కూడా సమాచారం అందజేయాల్సి ఉంటుంది. అధికారికంగా మంత్రుల వ్యక్తి గత కార్యదర్శులుగా ఖరారు కాని వారి నుంచి వచ్చే సమాచారాన్ని జిల్లా యంత్రాంగం బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తు తున్నాయి. ఇటీవల కొందరు మంత్రులు తమ సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పర్యటించాల్సిన సందర్భాల్లోనూ తప్పని పరిస్థితుల్లో అనధికారికంగా వారి వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది వెంట వెళ్తున్నారు.

కిరణ్‌ బెంబేలు !
Kiran-cmmవిజయవాడలో జగన్‌ చేపట్టిన లక్ష్య దీక్ష్య ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి దడ పుట్టిస్తున్నది. రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యంగా మంగళవారం నుంచి 48 గంటల పాటు దీక్షకు ఉపక్రమించిన జగన్‌కు జనం, కాంగ్రెస్‌ కార్యకర్తలు నీరాజనం పట్టడం, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు పీఆర్పీ, టీడీపీ నేతలు కలిసి రావడంతో దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కడ పడుతుందోనని సిఎంకు, పార్టీ పెద్దలకు భయం చుట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

మంగళవారం మొదటి రోజునే కాంగ్రెస్‌కు చెందిన సుమారు 22 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే, పీఆర్పీ నుంచి ఇద్దరు దీక్షలో పాల్గొని బాహటంగానే జగన్‌కు మద్ధతు పలికారు. మరో వైపు సీమాంధ్రకు చెందిన ఐదుగురు ఎంపీలు కూడా జగన్‌కు మద్దతు ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీలో ఉన్న ఎంపీలు మం గళవారం రాత్రికి, బుధవారం విజయవాడకు చేరుకుని జగన్‌ శిబిరంలో పాల్గొనే అవకాశాలు న్నట్లు తెలుస్తోంది. జగన్‌ దీక్ష బుధ, గురు వారాల్లో కూడా కొనసాగనుండటంతో ఇంకెంత మంది పార్టీ నేతలు జగన్‌ బాట పడతారోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పెద్ద నేతలకు ఆందోళన కలిగిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పలువురు మంత్రులు, పార్టీ నేతలు కొందరు జగన్‌ దీక్షపై మంగళవారం మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేసినప్పటికీ అంత ర్గతంగా వారు కూడా దీక్షకు తరలి వచ్చిన జనం, నేతలను చూసి గుబులు పడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాంగ్రెస్‌అధిష్ఠానాన్ని ధిక్కరించి, పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిన కడప మాజీ ఎంపి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై రైతుసమస్యలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగిన జగన్‌కు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు మద్దతు పలకడం కాంగ్రెస్‌ నాయకత్వం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిందని విని పిస్తోంది. తమ ఆదేశాలను ధిక్కరించి, పార్టీని సైతం లెక్క చేయకుండా ఊహించని విధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు జగన్‌ శిబిరంలో పాల్గొని బాహటంగానే అతనికి మద్దతు పలకడమే కాకుండా పాటు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికే వ్యతి రేకంగా వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నేతలకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. మరో రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనున్నందున పార్టీ నేతలు ఇంకెంత మంది జగన్‌ వెంట క్యూలు కడతారోననే భయం కాంగ్రెస్‌ పెద్దలను వెంటాడుతున్నది.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డి మంగళవారం ప్రధానంగా జగన్‌ దీక్షపైనే దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్‌ దీక్షకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎంత మంది వెళ్ళారు, ఏ ప్రాంతం నుంచి అధికంగా వచ్చారు, జగన్‌ వెంట నడిచిన నేతలు ఏ ప్రయోజనాలు ఆశించి అటూ వెళు తున్నారు?, జగన్‌తో వారికి ఉన్న సంబం ధాలు, వ్యాపార లావాదేవిలపై సిఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు పార్టీ వైపు నుంచి సిఎం జగన్‌ శిబిరంపై సమాచారం సేకరించినట్లు విని పిస్తోంది. ఈ సమాచారంతో ఒక నివేదికను తయారు చేసి ఆయన పార్టీ హైకమాండ్‌కు నివేదించనున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

పీసీసీ, ఎఐసీసీ ఆరా
పార్టీ ఆదేశాలను, క్రమశిక్షణను ఉల్లం ఘించి జగన్‌ దీక్షలో పాల్గొన్న పార్టీ నేతల విషయంలో పీసీసీ ఆరా తీస్తున్నట్లు సమా చారం. జగన్‌ దీక్షలో పార్టీ నేతలు ఎవరెవరు పాల్గొన్నారో, ఎంత మంది పార్టీ కార్యకర్తలు తరలి వెళ్ళారో వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని విజయవాడ కాంగ్రెస్‌ కమి టీతో పాటు ఆయా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు పీసీసీ తరఫున ఆదేశాలు వెళ్ళినట్లు తెలు స్తోంది. హస్తినలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఇప్పటికే ఈ మేరకు ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మరో వైపు ఎఐసీసీ కూడా జగన్‌ దీక్షపై తన నిఘా వర్గాల ద్వారా సమా చారం సేకరించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
సోనియాకు సవాల్‌ !
Sonia-B
వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దయ నీయంగా, విషాదకరంగా మారింది. రెండు డజ న్లుకు పైన పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ ఏర్పాటు చేసుకున్న వేదికపైకెక్కి ఇరవైనాలుగు గంటలు గడిచినా వారికి కనీసం షోకాజ్‌ నోటీసులు ఇచ్చే ధైర్యం, దమ్ము కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయ కత్వానికి కరవయిన దయనీయ పరిస్థితి నెల కొంది. మంగళవారం విజయవాడ కృష్ణానది ఒడ్డున వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన లక్ష్యదీక్ష శిబిరానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు పీఆర్పీ, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హాజరుకావడం సంచలనం సృష్టించింది. రెండవరోజుయిన బుధవారం మరో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరు కానున్నారు.

ఒక రకంగా.. రాజకీయ చైత న్యానికి ప్రతీకగా భావించే విజయవాడ జగన్‌ మద్దతుదారుల బలప్రదర్శనకు వేదిక. జగన్‌ను చూసి కాంగ్రెస్‌ నిలువెల్లా వణికిపోతోంది. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నిద్ర కూడా కరవ వుతోంది. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని సవాలు చేస్తారన్న ఊహలు ఆయనను ఒక పట్టాన నిలవనీయడం లేదు. 22 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన పార్టీని సవాల్‌ చేస్తున్న జగన్‌ దీక్షకు బాహాటంగా మద్దతు ప్రకటించడం, అయినా వారికి కనీసం ఇప్పటివరకూ షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేయటం, చర్యలు తీసు కుంటామని పీసీసీ అధ్యక్షుడు కూడా ఇప్పటి వరకూ హెచ్చరించకపోవడం బట్టి.. కాంగ్రెస్‌ అధిష్ఠానం జగన్‌ విషయంలోఅడకత్తెరలో పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

విజయవాడలో జగన్‌ నిర్వహించిన తొలిరోజు లక్ష్యదీక్షలో ప్రసంగించిన ప్రముఖులంతా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారపట్టారు. స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపు నిచ్చారు. అంబటి, జూపూడి ప్రభాకర్‌రావు, ప్రసన్నకుమార్‌రెడ్డి, రోజా, రాజశేఖర్‌, విజయచందర్‌, గట్టు రాంచందర్‌రావు, జక్కంపూడి విజయలక్ష్మి వంటి ప్రముఖు లంతా కాంగ్రెస్‌ను దుయ్యబడుతూ ప్రసంగిం చారు. అయినప్పటికీ వేదికపైనే ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వాటిని కనీసం ఖండిం చలేదు. తమ పార్టీని విమర్శిస్తున్నా నోరు మెదపకుండా జనం చేసే చప్పట్లకు తన్మ యులయ్యారు. వారంతా జగన్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మాదిరిగానే అత్యంత క్రమశిక్షణ గల సైనికులుగా కనిపించారు.

జగన్‌ దీక్షా శిబిరానికి 22 మంది ఎమ్మెల్యేలు హాజరయినప్పటికీ, వారిపై చర్యలు తీసు కోవాలా? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసు కోవాలి? ముందు షోకాజ్‌ ఇవ్వాలా? వద్దా? ఇస్తే వారంతా పార్టీపై ఇక బాహాటంగానే తిరుగుబాటు చేస్తారా? అదే జరిగితే పార్టీ కొంప కొల్లేరవుతుందా? బుధవారం నాటి రెండవ రోజు దీక్షకు ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరవుతే ఏం చేయాలి అన్న ప్రశ్నలు అధిష్ఠానాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం నాటి దీక్షకు మరో 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరయేందుకు సిద్ధమవు తోన్న వైనం నాయకత్వాన్ని కలవరపరు స్తోంది. నిజంగా అదే జరిగితే ఇక కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసు కుంటే, అసంతృప్తితో ఉన్న జగన్‌కు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారితో జత కలిస్తే కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడానికి ఎక్కువ కాలం అవసరం లేదని నాయకత్వం అంచనా వేస్తోంది. ఒక్క షోకాజ్‌ నోటీసు ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెడుతుందన్న అదురు అధిష్ఠానంలో కనిపి స్తోంది. అందుకే ఈ విషయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు కళ్లెదుటే తనను ధిక్కరిస్తున్నా వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయతలో ఉంది. ఈ విషయంలో పీసీసీ పరిస్థితి మరీ ఘోర ంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ డి..శ్రీనివాస్‌ అసలు పనిచేస్తున్నారా? లేరా అన్న అనుమానం ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగన్‌ వైపు వెళుతున్నా కనీసం తన స్థాయిలో కూడా స్పందించి, వారిపై హెచ్చరికలు కూడా జారీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

అటు ఢిల్లీ నాయకత్వం కూడా రాష్ట్రంపై నిశితంగా దృష్టి సారిస్తోంది. జగన్‌ లక్ష్య దీక్షకు వస్తున్న జనాలు, ఎమ్మెల్యేల సంఖ్య, స్పందన వంటి అంశాలపై ఆరా తీస్తోంది. జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. సీనియర్‌ నే త వి.హన్మంతరావు మాత్రం జగన్‌కు మద్దతు నిచ్చిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరతానని వెల్లడించగా, మంత్రి శంకర్‌రావు మరో అడుగు ముందుకేసి జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.జగన్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చర్యలపై తరచూ స్పందించే ఏఐసీసీ అధికార ప్రతినిధులు కూడా తాజా పరిణామాలపై నోరు మెదపకపోవడం చూస్తుంటే.. జగన్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకత్వం ఎంత భయపడుతోందో? ఎవరిపై చర్యల కొరడా ఝళిపిస్తే ఏమి కొంపలు మునుగు తాయోనన్న ముందుచూపుతో తర్జనభర్జన పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Sunday, December 19, 2010

కిరణ్‌ను చుట్టుముడుతున్న సవాళ్లు

krianaa నూతన సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డికి రోజుకో సమస్య ఆయనను ఊపరి పీల్చుకోకుండా చుట్టుముడుతున్నాయి. ఒకవైపు జగన్‌ సెగ, మరోవైపు రైతు సమస్యలు, ప్రతిపక్షాలు నిరహార దీక్ష లకు తోడు.. డిసెంబర్‌ తొలిత క్యాబినేట్‌ కూర్పులోనే మంత్రి పదవుల పంపకంలో సమతూకం గాడి తప్ప డంతో... సీనియర్లు ఆయనపై భగ్గున మండిపడుతు న్నారు. పైకి అసంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ.. లోలోపల మాత్రం తమకి జరిగిన అన్యాయం వారికి ఎంతమాత్రం మింగుడు పడడంలేదు. దీంతో వారు సీఎంకి అంటీ అంట నట్లు ఉంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా ఏమాత్రం కనికరించడంలేదు. తాము ఈ భారాన్ని ఇక భరించలేమని.. ఇప్పటికే పెద్ద సం ఖ్యలో రైతులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. కొత్త సీఎం తమను ఆదుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు.

సర్కార్‌ నిర్లక్ష్యంపై బాబు కన్నెర్ర
ఇటీవల సీఎం అసెంబ్లీలో తుపాన్‌ ప్రభాంతో దెబ్బతిన్న బాధిత రైతులను ఆదుకోవడానికి ప్రకటించిన ప్యాకేజీ కొంతమేరకు వారికి ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి. మరోవైపు ప్రతిపక్షాలు ఈ సాయం మరింత పెంచాలని, ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకి రూ. 10 వేలకి పెంచాలని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తూ .. 17వ తేదీ నుంచి నిరవదిక నిరహాదీక్షను చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్ష కూడా రెం డో రోజుకి చేరుకున్నది.

21 నుంచి సీన్‌లోకి జగన్‌...
మరోవైపు జగన్‌ త్వరలో ప్రకటించనున్న కొత్త పార్టీలోకి వెళ్లడానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మాజీలు తెరవెనుక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు జగన్‌కి మద్దుతు ప్రకటిస్తున్న విష యం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్య మంత్రి నూతన ఎమ్మెల్యేలతో విందు సమావేశాలను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు జగన్‌ కూడా రైతులకి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఎంత మాత్రం చాలదని, తక్షణం ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎకరానికి రూ. 5 వేలకి పెంచాలని ఆయన డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 21,22 తేదీల్లో నిరహారదీక్షలను చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర బాబు నిరహార దీక్ష నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు ఊపందుకున్నాయి. జగన్‌ కూడా అదే దారిపడితే.. ప్రభు త్వానికి మరిన్ని సమస్యలు తప్పవని రాజకీయ వర్గాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి.

తాడోపేడో తేల్చుకుంటాం: ఉద్యోగ సంఘాలు
ఈ నెల 20 తేదీ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు సర్కార్‌కి తుది గడువు ప్రకటించారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే.. 20 తేదీ నుంచే తమ నిరసన ప్రద ర్శనలను ప్రారంభిస్తామని, తొలిదశలో పెన్‌డౌన్‌.. ఆ తర్వాత దశల వారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. తాము ప్రభుత్వం ముందుంచిన.. 11 డిమాండ్లలో కొనై్న నా అంగీకరిస్తేనే.. 20 డెడ్‌లైన్‌ నుంచి తప్పుకుంటా మని, లేకపోతే.. సర్కార్‌తో తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు దేవాదాయ ఉద్యోగులతో పాటు. ఇతర పీఆర్సీ అమలుకు నోచుకోని శాఖలు కూడా తమకి కూడా 9వ పీఆర్సీని వర్తింప చేయాలని ప్రభు త్వంపై ఒత్తిడి చేస్తు న్నారు. కాగా ఉద్యోగసంఘాలు గతంలో ప్రకటించిన డెడ్‌లైన్‌ ఈ నెల 20తో ముగియనుంది.

Friday, December 17, 2010

రైతుల వడ్డీ మాఫీ

krian-sir ప్రకృతి వైపరీత్యాలు, అకాల నష్టాలకు గురై బతుకులు అతలాకుతలం అవుతున్న రైతాంగాన్ని కొంతమేరనైనా ఆదుకోవటానికి రాష్ట్ర సర్కార్‌ ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు ఆమరణ నిరశన దీక్ష, కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 21, 22 తేదీలలో తలపెట్టిన 48 గంటల నిరశన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి గురువారం శాసనసభ శీతాకాల సమావేశాల ముగింపు రోజున రైతులకు కొన్ని తాయిలాలు ప్రకటిం చారు. బ్యాంకు నుంచి రూ.16,500 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారని, వాటిపై వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు.

పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.6,000 చెల్లిస్తా మన్నారు. గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు మరో రూ.1,500 పెంచామన్నారు. అలాగే గేదెలు, ఆవులకు రూ.15,000, దూడలకు రూ.10,000, గొర్రెలకు రూ.2,000, పౌల్ట్రీ రంగానికి రూ.40,000 చెల్లిస్తామని తెలిపారు. చేనేత రంగంలో మగ్గానికి రూ.5,000, రంగు మారిన, తడిసి పోయిన నూలుకు రూ.5,000 చెల్లిస్తామనిమత్స్యకార రంగంలో చెడిపోయిన పడవలకు రూ.5,000, పెద్ద పడవలు, వలలు నష్టపోయిన వారికి రూ.10,000 చెల్లిస్తామన్నారు.

ప్రధానమంత్రికి లేఖ
15 మాసాల్లో ప్రకృతి ఐదు పర్యాయాలు ఆగ్రహించిందని, జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఢిల్లీలో ఉన్న సందర్భంగా మళ్ళీ మాట్లాడతామన్నారు. ఎఫ్‌సీఐ చైర్మన్‌ శుక్రవారం వస్తున్నారని, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు అంగీకరించే అవకాశం ఉందన్నారు. దెబ్బ తిన్న వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతోనే కొనాలని కోరామన్నారు. పంటల బీమా విషయంలో వీలైనంత సాయం చేస్తామని, ఇప్పటికి 483 మండలాలు గుర్తించగా, మరి కొన్నిటిని గుర్తిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలలో రుణాలు రీ షెడ్యూల్‌ చేస్తామని, మరోవైపు రబీకి తాజా రుణాలు ఇస్తామన్నారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ డబ్బు కోసం ఒత్తిడి చేస్తామని, కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ఖర్చు చేస్తామన్నారు. ఇది రైతుల ప్రభుత్వం అని, అదే పంథా కొనసాగిస్తామన్నారు.

మౌలిక సదుపాయాలకు రూ.1,000 కోట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ రాజ్‌, రోడ్లు, భవనాల శాఖలకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటికే రూ.810 కోట్లకు టెఏండర్లు పిలిచామన్నారు. జాతీయ విపత్తు నిధుల విషయంలో తెలుగుదేశం పార్టీ తొమ్మిదేళ్ళలో రూ.1,677 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ఈ ఆరు సంవత్సరాలలో కేంద్రం నుంచి రూ.3,204 కోట్లు వస్తే రాష్ట్రం నుంచి రూ.3,375 కోట్లు కలిపి రూ.6,579 కోట్లు వెచ్చించామన్నారు.

కనీస మద్దతు ధర
కనీస మద్దతు ధరపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటామని, మిల్లర్లు ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాటన్‌ కార్పొరేషన్‌తో మాట్లాడుతున్నామని, మంచి ధర ఇప్పిస్తామన్నారు. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, ఇది వారి ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి అన్నారు.

Friday, December 10, 2010

పారదర్శక పాలనకు ఊత మివ్వండీ... భాద్యతాయుతంగా నిధులు నిర్వర్తించా లి...సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే స్పందించాలి. * సీఎంఓ అధికారులకు సీఎం క్లాస్‌

Kiran-kumar-reddyపారదర్శక పాలనకు ఊత మివ్వండీ... భాద్యతాయుతంగా నిధులు నిర్వర్తించా లి...సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే స్పందించాలం టూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంఓ అధి కారులకు క్లాస్‌ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వీ.ప్రసాద్‌ సిఎంవో అధికా రులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికా రుల పనితీరుతోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగు తుందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తన పేషీలో పనిచేస్తున్న అధికారులకు సూచించారు. పారదర్శకతతో, సమర్ధవంత పాలనకు పెద్దపీట వేసి ప్రజలకు చేరువయ్యే విధంగా సుపరిపాల నను అందించి, తద్వారా సంస్కరణలకు పెద్దపీట వేయాల ని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసా గించాలని, ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేవిధంగా విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

సాధారణ ప్రజానీకం నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిం చడానికి అధికప్రాధాన్యం ఇవ్వాలని, అందుకనుగుణంగా రానున్న రోజుల్లో ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కాగలమన్నారు. ఇందుకు గతంలో కంటే భిన్నంగా ఓ ప్రత్యేక విధానాన్ని అమలులోకి తీసుకరావాల్సి ఉందని, అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పధకాలు చేరినప్పుడే సార్ధకత చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలౌతున్న పలు పధకాలను సిఎం సమీక్షించారు. సిఎంవో అధికారులు పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఇందుకు ఆయా శాఖల ప్రత్యేకప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగా ధిపతులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కాగా గతంలో ముఖ్యమంత్రి కార్యాలయాల్లో నిర్వహించి న విధానాలను కాకుండా కొత్తవిధానాలను ప్రవేశపెట్టాల ని, తద్వారా అధికారుల విధులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించే కార్యక్రమాలకు కొత్త విధి విధా నాలు అమలుచేయనున్నారు. ఇందులో కొన్ని ముఖ్యాశాంలు.

- సమయ పాలన
- సమావేశాల నిర్వహణ *సందర్శకుల ఫిర్యాదులు, సమస్యలు పరిష్కారం
-ప్రజలనుంచి వచ్చిన ఫిర్యా దులకు జవాబుదారీతనం

-ఫైళ్ళ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాలు లేన ప్పుడు ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి చర్య లు తీసుకోవాలన్నారు. ఇందులో ప్రభుత్వం అమలు చేసు ్తన్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకూ వర్తిస్తాయి. ము ఖ్యంగా ముఖ్యమంత్రికి వచ్చే అభ్యర్ధనలు కేంద్ర ప్రభు త్వం పంపించే లేఖలు,.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు ప్రజలు, ప్రతిపక్షాలు అందించే లేఖలను పరిశీ లించేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలన్నా రు. అంతేకాకుండా వాటి పరిష్కారం దిశగా అధికారులు ఏమేరకు చర్యలు తీసుకున్నారో సంబంధిత వ్యక్తులకు జవాబు లేఖలు పంపాలన్నారు.

అంతా పారదర్శకంగా ఉండాలి....
ప్రజలకు నిత్యం అవసరమయ్యే పలు ప్రభుత్వ విభా గాలు అమలు చేస్తున్న సంక్షేమకార్యక్రమాలు ఇ-గవర్నెన్స్‌ విధానంలో ఉండాలని ఇందులో ప్రజా పంపిణీ వ్యవస్ధ, ఫించన్లు, రిజిస్ట్రేషన్‌, రవాణ, భూ రికార్డులు పొందుపర చాలని అధికారులను ఆదేశించారు. రానున్న జిల్లాస్ధాయి లో గ్రామాలకు సందర్శించాలని ముఖ్యమంత్రి యోచిస్తు న్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను అధికా రులు సిద్దంచేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

Tuesday, December 7, 2010

ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దాం

cmkirankumar
రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ది పరుచుకోవా ల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలంలోని అర్జున్‌ గుట్ట వద్ద పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై..ప్రాణహిత నది పుష్కరాలను ప్రారంబించారు. అనంతరం ప్రాణహిత నది ఒడ్డున ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది అంశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు పార్టీలకతీతంగా అందరు కృషి చేయాలన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాకై రాష్ట్రంలోని 42 మంది ఎంిపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని.. అందుకు తన సహకారం కూడ ఉంటుందన్నారు. ప్రాణహిత చేవేళ్లతో పాటు పోలవరాన్ని కూడ సాధించుకుందామని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చా రు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నామన్నారు. ఈప్రాజెక్టు కింద 16 లక్షల 60 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ఆదిలాబాద్‌ జిల్లాలో లక్ష 50 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందన్నారు.

జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నా రన్నారు. తెలంగాణలోనే ఆదిలాబాద్‌ జిల్లా వెనుకబాటు వల్ల కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. వాటి పరిష్కరానికి తన వంతు సహకారంగా కృషి చేస్తానన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి రీమ్స్‌ కళాశాలను ప్రారంభించారని.. అక్కడ శిక్షణకేంద్రంతో పాటు ఎమ ర్జెన్సీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలో అనేక ఖాళీలు ఉన్నందున వాటిని భర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అర్జుని గుట్ట వద్ద మందిర నిర్మాణా నిి, చెన్నూర్‌లో బతుకమ్మ వాగుకు వంతెన నిర్మాణానికి రోడ్ల అభివృద్దికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సర్వతోముఖా భివృద్దికి అందరు సహకారం అందించాలని కోరారు. గిరి జనులకు వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు 28 మంది వైద్యులను నియమించామన్నారు. మరో 40 మంది మెడికల్‌ ఆఫీసర్స్‌తో పాటు 125 మంది నర్సులను నియమిస్తామన్నారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు.

pushakaralu8 పిహెచ్‌సిలకు రూ.40 లక్ష లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 28 సబ్‌ సెంట ర్లను, 5 కమ్యూనిటి సెంటర్ల కోసం రూ. 5 లక్షల వంతున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల అభివృద్ది కోసం ప్రత్యేక ప్లాన్‌ను రూపొందించామని అన్నా రు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆదిలాబాద్‌ జిల్లాకు రూ. 25 కోట్లు మంజూరయ్యాయని వచ్చే ఏడాది మరో రూ. 30 కోట్లు మంజురు కానున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక తొలి నిధులు జిల్లాకే వచ్చాయని అన్నారు. జిల్లాలో జల యజ్ఞం కింద 5 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వాటి పనులను వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కృష్ణారావ్‌ పాల్గొన్నారు.

సోమవారం ఉదయం 9.30 గంటలకు కరీంనగర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలను పౌరసరఫరాల శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం కల్పిం చలేని దుస్థితి నెలకొంది. భక్తులకు సరిపడ స్నానఘట్టాలు ఏర్పరచ లేకపోయారు. చలువ పందిళ్ళు సైతం అంతంత మాత్రం గానే ఉన్నాయి. కొద్ది మందికి మాత్రమే బస ఏర్పాట్లు లభ్య మవుతున్నాయి. వేలాది మంది చలిపులిని తట్టుకోవడం కష్ట మే. రోడ్డంతా దుమ్ము, ధూళి. అడుగుతీసి అడుగు వేయలేక పోతున్నారు. క్యూలైన్‌ వద్ద సైతం గందరగోళం నెలకొంది. భోజన వసతి సైతం కల్పించ లేకపోయారు.

Monday, December 6, 2010

సంక్షేమం, అభివృద్ధి నాకు రెండు కళ్లు * ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం..

 

సంక్షేమం, అభివృద్ధి నాకు రెండు కళ్లు
ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం..

అన్ని పథకాలను అమలు చేస్తాం
పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష..
అర్హులకు మాత్రమే ఫలాలు
ఉద్యమాలతో ఖజానాకు రూ.6వేల కోట్ల గండి..
త్వరలోనే ఇబ్బందులు అధిగమిస్తాం
ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటన..
తాండూరులో తొలి పర్యటన
ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. అదేసమయంలో... పథకాలను పూర్తిస్థాయిలో సమీక్షించి, లొసుగులను సవరించి అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక... తొలిసారిగా ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు.

తాండూరులో ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన హౌసింగ్ కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. "అభివృద్ధి, సంక్షేమం నాకు రెండు కళ్ల వంటివి. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను, వైఎస్ చేపట్టిన పథకాలను కొనసాగిస్తాం. ప్రత్యేక, సమైక్య ఉద్యమాల వల్ల రూ.6 వేల కోట్ల ఆదాయానికి గండి పడింది. ఆర్థిక ఇబ్బందులున్నాయి.

రెండు మూడు నెలల్లో పరిస్థితిని గాడిన పెడతాం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, అన్ని పథకాలకు సక్రమంగా నిధులు మంజూరు చేస్తాం'' అని ప్రకటించారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అభయ హస్తం, రాజీవ్ ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి ప్రాజెక్టులు తదితర పథకాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని కిరణ్ పేర్కొన్నారు.

ప్రాణహిత అంత ఈజీ కాదు: పోలవరం, చేవెళ్ల -ప్రాణహితలకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కిరణ్ కుమార్ తెలిపారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించడం అంతసులువు కాదని అభిప్రాయపడ్డారు. "చెప్పడానికి బాగానే ఉంటుంది.

కానీ... ఈ ప్రాజెక్టులో ఎన్నో కష్టాలు ఉన్నాయి. రంగారెడ్డితో పాటు తెలంగాణలోని జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించదలిచిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 38వేల కోట్లుగా అంచనా వేశారు. ప్రాజెక్టు రూపకల్పనకే రెండేళ్లు పట్టింది. కష్టాలు ఉన్నప్పటికీ... ఈ పనులు త్వరగా చేపట్టేందుకు కృషి చేస్తాం'' అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మీ ఎకరా 2 కోట్లు మాది 2 లక్షలు
DWARACRA ముఖ్యమంత్రిగా రంగారెడ్డి జిల్లాలో జరిపిన తొలి పర్యటనలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ‘మీకు (రంగారెడ్డి జిల్లా వాసులకు), మాకు (రాయలసీమ వాసు లకు) ఒకటే తేడా. మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో నీళ్లు లేవు, రెండు చోట్లా బోర్‌నీళ్లే వ్యవసాయానికి దిక్కు. అయితే, మా దగ్గర ఎకరా రూ.2 లక్షలు ఉంటే, మీ దగ్గర ఎకరా రూ.2 కోట్లు ఉంది’ అని కిరణ్‌కుమార్‌ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. జిల్లాపేరును ప్రస్తావించినప్పుడు కూడా మీ రంగారెడ్డి జిల్లా అంటూ సీఎం సంబోధించడం విశేషం. తాండూరులో ఆదివారం ఇందిరమ్మ గృహాల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరుపేదలకు ఇళ్ల పట్టాలను, స్వయం సహాయక సంఘాలకు రుణాలను ఈ సభలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్‌ పథకాల అమలుకు ఎన్నికోట్ల రూపాయలైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత తరుణంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, మరో రెండుమూడు నెలల్లో కాస్త కోలుకోగానే సోనియా, వైఎస్‌ నాయకత్వాల్లో అమలుచేసిన అన్ని పథకాలను కొనసాగించేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ర్టంలోని అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పథకాల అమలుకోసం పెద్దమొత్తంలో ప్రభుత్వం ఖర్చుచేస్తోందని తెలిపారు. 1983 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 47 లక్షల ఇళ్లను నిర్మిస్తే, ఆరేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వహయాంలో 51 లక్షల ఇళ్లను నిర్మించామని, మరో 14 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇంకో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి 25 లక్షల మంది రైతులకు ఉచిత కరెంటును అందజేశామని, టీడీపీ హాయంలో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టాల పాలైతే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 12వేల కోట్ల బకాయిలు మాఫీచేయడమే కాకుండా రూ. 1400 కోట్ల సాయాన్ని అందజేశామని తెలిపారు. ప్రస్తుతం పావలావడ్డీకి రైతులకు 35వేల కోట్ల పంటరుణాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకో గా, ఇప్పటివరకు 25వేల కోట్ల రుణాలను అంద జేశామని,మిగిలిన 10వేల కోట్ల రుణాలను త్వర లోనే పంపిణీ చేస్తామన్నారు.

గతంలో 18 లక్షల మంది వృద్ధులకు నెలకు 75 రూపాయల పింఛన్‌ ను అందజేస్తే తాము 72 లక్షల మందికి నెలకు రూ.200 చొప్పున పింఛన్‌లను అందజేస్తున్నామని తెలిపారు. 8 లక్షల మంది వికలాంగులకు రూ. 500 చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మహిళలు మరింత అభివృద్ధి సాధిస్తారని ఆశించి స్వయం సహాయక సంఘాలకు పావలావడ్డీకి 25వేల కోట్ల రుణాలను అందజేశామ న్నారు. 2003లో వైఎస్‌ ఈ పథకం అమలుకు హామీ ఇస్తే తన సొంతగ్రామమైన కలికిరిలో ఆశ్చ ర్యపోయామని, కంతులు(కిస్తీలు) ఎలా కడతారని అనుకున్నామని, అధికారంలోకి రాగానే వైఎస్‌ ఈ పథకాన్ని అమలుచేసి చూపించగా, 99 శాతం రుణాలను చెల్లించారని సీఎం గుర్తుచేశారు.

యేడా ది 280 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయించగా, ఇంకా కావాలని అడుగుతున్నారన్నారు. అంతేకా కుండా 39 లక్షల మందికి అభయహస్తం కార్యక్ర మం కింద 360 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కేవలం డబ్బులేక చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో సోనియా, వైఎస్‌లు ఫీజురియంబర్స్‌ మెంట్‌ను అమలుచేశారని, త్వరలోనే ఈ పథకం కింద స్కాలర్‌షిప్పులను, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను చెల్లిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 5.30 లక్షల మందికి 2400 కోట్ల రూపాయలు వెచ్చిం చామని, చదువులు, ఆపరేషన్‌లు, రుణాలకోసం ఏ ప్రభుత్వం వెచ్చించనివిధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ, సీమాంధ్ర గొడవల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రావల్సిన సుమారు 6వేల కోట్లు నష్టపోయామని, ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని, మరో రెండుమూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటామని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో అన్నిపథకాలకు నిధులను అందజేస్తామని, స్కాలర్‌షిప్పులకు, ఫీజు రియంబర్స్‌మెంట్‌కు అవసరమైన మేరకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు వైఎస్‌ కృషిచేశారని, కోర్టులో ఇబ్బందులు తలెత్తాయని, దీన్ని త్వరలోనే అధిగమిస్తామని సీఎం తెలిపారు. ఐకేపీలో చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయని, 12500 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తే, మైక్రో ఫైనాన్సులు 7500 కోట్ల రుణాలను అందజేశాయని, మైక్రో ఆగడాలను అరికట్టేందుకు ఆర్డినెన్స్‌ కూడా తీసుకువచ్చామ న్నారు. 1.20 కోట్ల మందికి తెల్లరేషన్‌కార్డులు అందించి రూ.3వేల కోట్ల సబ్సిడీలను భరిస్తున్నా మని సీఎం తెలిపారు. పలు శాఖల్లో లొసగులు ఉన్నాయని, త్వరలోనే వాటన్నింటినీ గుర్తించి సరిచేస్తానని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వ పథ కాలను అర్హులైన వారందరికీ అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకోసం ఎన్ని వ్యయప్రయాసలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభిం చినంత సులువుగా, ప్రాజెక్టును పూర్తిచేయలేమని, పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టులను కేంద్ర ప్రాజెక్టులుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. మొద టిసారిగా జిల్లాకు వచ్చిన తనను ఆశీర్వదించిన తాండూరు ప్రజలకు రుణపడివుంటానని, జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తగుచర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పాలనలో పారదర్శకతను పాటిస్తా మన్న సీఎం ఈక్రమంలోనే ఐదుమంది నిరుపేద లకు ఇళ్లపట్టాలను అందజేయగా, మిగిలిన 2659 పట్టాలను ఎన్‌సీసీ క్యాడెడ్ల ద్వారా పంపిణీ చేశారు. పొదుపు సంఘాలకు రూ.45.50 కోట్ల రుణాలను సీఎం పంపిణీ చేశారు.

1056 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా వైఎస్‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఇదిలా వుండగా, సమావేశ వేదిక వద్ద తెలంగాణ వాదులు తెలంగాణకు మద్దతుగా నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. హెలీప్యాడ్‌ వద్ద, గురుకుల పాఠశాల వద్ద విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు వ్యక్తంచేశారు.మంత్రులు పి.సబితారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, ఆకుల రాజేందర్‌, కూనశ్రీశైలంగౌడ్‌, బిక్షపతియాదవ్‌, కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో రచ్చబండ
క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు వైఎస్ తలపెట్టిన 'రచ్చబండ' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని కిరణ్ తెలిపారు. పథకాల్లో లొసుగులు తెలుసుకుని, అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేస్తామన్నారు.

మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. రాజీవ్ గృహకల్ప, పట్టణ గృహ నిర్మాణ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మేలు చేసేందుకు జీవో 42ను అమల్లోకి తెస్తామని తెలిపారు. దీని వల్ల రెండున్నర లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కిరణ్ తెలిపారు.

వైఎస్ విగ్రహావిష్కరణ
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తాండూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీని ప్రారంభించారు. సబ్ స్టేషన్‌తోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి , కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Thursday, December 2, 2010

'' టార్గెట్ జగన్ '' కేబినేట్ శాఖలపై భగ్గుమన్న మంత్రులు * శాఖల కేటాయింపుపై ఆగ్రహం...

మరికొందరిదీ రాజీనామా బాటే
తాజా మంత్రుల నిరసన గళం
ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన వట్టి
వట్టి ఇంట్లో పది మంది మంత్రుల సమావేశం
ఆనం రాంనారాయణరెడ్డి రాయబారం విఫలం
పభుత్వమంటే ప్రైవేట్ కంపెనీ కాదన్న బొత్స
నేటి ఉదయం బొత్స ఇంట్లో మంత్రుల భేటీ

కెప్టెన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తొలి బంతికే డకౌటయ్యారు. టీమ్ కూర్పులో, బ్యాటింగ్ ఆర్డర్ కేటాయింపులో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన తమకు ఫక్తు ‘జూనియర్ల’ తరహా ట్రీట్‌మెంట్ ఇచ్చారంటూ సీనియర్లంతా భగ్గుమన్నారు. వైఎస్ సన్నిహితులకు అప్రాధాన్య శాఖలివ్వడం, ఆయన్ను, యువనేతను విమర్శిస్తున్న వారికి పెద్దపీట వేయడంపై మండిపడ్డారు. వట్టి వసంతకుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వట్టి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. లేఖ అందిన విషయాన్ని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ధ్రువీకరించారు. బొత్స సత్యనారాయణ అయితే నేరుగా సీఎంకే ఫోన్ చేసి శాఖ కేటాయింపుపై భగ్గుమన్నారు. రాజీనామా చేస్తానని హెచ్చరించారు. పార్టీని నట్టేట ముంచాలనుకుంటున్నారా అంటూ నిలదీశారు. ప్రభుత్వమంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదన్నారు. ధర్మాన ప్రసాదరావు నుంచి పొన్నాల లక్ష్మయ్య దాకా సీనియర్లంతా శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారిలో చాలామంది ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. పదిమందికి పైగా మంత్రులు వట్టి నివాసంలో భేటీ అయ్యారు. వట్టిని బుజ్జగించేందుకు రామనారాయణరెడ్డిని ఆయన నివాసానికి సీఎం పంపినా, వెనక్కు తగ్గేదే లేదని వట్టి కుండబద్దలు కొట్టారు. అసంతృప్తులంతా కలిసి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

కెప్టెన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తన తొలి ఇన్నింగ్స్‌లోనే డకౌట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. మంత్రివ ర్గ ప్రమాణ స్వీకారం ముగిసిన పది గంటలు గడవక ముందే రాజీనామాల పర్వం మొదలైంది. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించారని, కుల సమీకరణల్లో అన్యాయం జరిగిందని కొందరు, అప్రాధాన్య పోస్టులని మరికొందరు, తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇంకొందరు, వై.ఎస్. సన్నిహితులను చిన్నచూపు చూశారని మరికొందరు నిరసన గళం విప్పారు. రాత్రికి రాత్రే వట్టి వసంత్‌కుమార్ ఇంట్లో 10 మంది మంత్రులు భేటీ అయ్యారు. ఆ వెంటనే అప్రాధాన్య పోర్టుఫోలియో కేటాయించారంటూ వట్టి వసంత్‌కుమార్ రాజీనామా చేశారు. తెలంగాణకు సంబంధంలేని పోర్టులు వంటి పోర్టుఫోలియోను తనకు కేటాయించారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారు.

ప్రయివేట్ లిమిటెడ్ కాదు..

కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ కూర్పు మంత్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కల్గించింది. సీనియర్లని కూడా చూడకుండా ఈరోజు ఉదయం 5 గంటల వరకు జాబితా వెలువరించకపోవడంతో అవమాన భారంతో రగిలిపోయారు. పోర్టుఫోలియోలు కేటాయించిన తరువాత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి.. రాజీనామా చేస్తానని బెదిరించినట్టు తెలిసింది. ‘పార్టీని నట్టేట ముంచాలనుకుంటున్నారా? ప్రభుత్వం అంటే ప్రయివేట్ లిమిటెడ్ కాదు..’ అని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇక మంత్రి వట్టి వసంత్‌కుమార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి శాఖ కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తంచేయడంతో ‘రేపు మాట్లాడుకుందాం..’ అంటూ సీఎం చెప్పినట్టు తెలిసింది. దీంతో వట్టి ఒక వ్యక్తికి రాజీనామా లేఖ ఇచ్చి సీఎం ఇంటికి పంపారు. అది తీసుకోవడానికి సీఎం సెక్యూరిటీ నిరాకరించారు. అనంతరం తన రాజీనామాను సీఎంకు ఫ్యాక్స్ చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు.

అసంతృప్త మంత్రుల భేటీ

వట్టి వసంత్‌కుమార్ ఇంట్లో దాదాపు పది మంది అసంతృప్త మంత్రులు సమావేశమయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాద్‌రావు, బొత్సా సత్యనారాయణ, విశ్వరూప్‌లు తమకు అప్రాధాన్య శాఖలు కట్టబెట్టి అవమానించారంటూ ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. కీలక శాఖలు మూడు సీఎం వద్దే పెట్టుకున్నార ని, సీనియర్లమైన తమను ఉదయం 5 గంటల వరకు వెయిటింగ్‌లో పెట్టడం కలచివేసిందని చర్చించినట్టు సమాచారం. మరోవైపు రాజీనామా చేయాలంటూ ధర్మాన ప్రసాదరావుకు తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం నుంచి 9 మందిని గెలిపించినందుకు ఇదా బహుమానం అంటూ ధర్మాన ఆవేదన వ్యక్తంచేశారు. మూడు శాఖలు కలిపి డీఎల్ రవీందర్‌రెడ్డికి ఇచ్చి.. తమ లాంటి వారికి ఇంత అన్యాయం చేస్తారా అంటూ సీనియర్లంతా మండిపడ్డారు. బీసీలు, దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని వట్టి ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. మరోవైపు పి.విశ్వరూప్‌కు కూడా కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని మీడియాలో ప్రచారం జరిగింది. జూపల్లి కూడా తీవ్ర అసంతృప్తితో సన్నిహితులకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ కన్నా లక్ష్మీనారాయణ, తన శాఖలన్నీ కత్తిరించారంటూ డొక్కా మాణిక్యప్రసాద్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనుకున్న దామోదర రాజనర్సింహ కూడా నైరాశ్యంలో ఉన్నారు.

ముగ్గురిని గెలిపించా..

జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిపించి పార్టీకి కట్టుబడి ఉంటే తనకు లభించే గౌరవం ఇదేనా? అంటూ కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణకు సంబంధంలేని మంత్రి పదవిని తనకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వల్ప మెజారిటీతో బయటపడ్డ జానారెడ్డికి ప్రాధాన్యం గల పంచాయతీరాజ్ శాఖ కేటాయించి తనకు అప్రాధాన్య శాఖను కేటాయించారంటూ మండిపడి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఖమ్మం నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి తనకు కేవలం ఉద్యానవన శాఖ కేటాయించడంపై అవమాన భారంతో రగులుతున్నారు. వట్టి వసంత్‌కుమార్ ఇంట్లో భేటీ అయిన మంత్రులను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని పంపించారు. ఆనం చెప్పిన మాటలు వినేందుకు మంత్రులు సుముఖత వ్యక్తంచేయలేదు. మరోవైపు అసంతృప్త మంత్రులు అందరితో చర్చించి బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.


సీనియర్లలో అసంతృప్తి!

శాఖల కేటాయింపులో స్థాయి తగ్గించి అవమానించారంటూ సీనియర్లంతా రగిలిపోతున్నారు. వైఎస్ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంత్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి మాజీ మంత్రులకు తాజా కూర్పు తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఆరున్నరేళ్ల పాటు వైఎస్ మానసపుత్రిక జలయజ్ఞం బరువు బాధ్యతలు మోసిన పొన్నాలకైతే అవమాన భారాన్నే మిగిల్చింది. భారీ నీటిపారుదల శాఖను చూసిన ఆయనకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ల శాఖతో సరిపెట్టారు.

పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చూసిన బొత్స సత్యనారాయణ రవాణా శాఖతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీసీసీ కిరీటం దక్కుతుందనుకున్న బొత్స సత్యనారాయణ పేరు మంత్రివర్గ జాబితాలో కనిపించడం కూడా ఆశ్చర్యపరిచింది. హోం శాఖను ఆశించిన జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ దక్కడంతో అసంతృప్తికే లోనయ్యారు. గతంలో వైద్యవిద్య బాధ్యతలు చూసిన సుదర్శన్‌రెడ్డికి భారీ నీటిపారుదల శాఖ ఇచ్చారు. గతంలో ఐటీ శాఖ చూసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా విద్యుత్తు గానీ, రోడ్లు, భవనాల శాఖ గానీ ఆశించారు. పెట్టుబడులు, మౌలిక వసతులు కేటాయించడంతో అసంతృప్తికి లోనయ్యారు. గతంలో దానం నాగేందర్, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి ముగ్గురు కలిసి చూసిన కీలకమైన వైద్యవిద్య, వైద్యవిధానపరిషత్తు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యశ్రీ, 104, 108, వైద్య మౌలిక వసతుల శాఖలన్నింటినీ కలిపి డి.ఎల్.రవీంద్రారెడ్డికి అప్పగించారు!

రెవెన్యూ శాఖ చూసిన ధర్మాన ప్రసాదరావుకు రోడ్లు, భవనాల శాఖ కేటాయించినా దానికి ప్రస్తుతం నిధులే లేవు. ఇప్పటికే బకాయిలు పేరుకుపోయాయి. కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను చూసిన వట్టి వసంత్‌కుమార్‌కు అప్రాధాన్యమైన పర్యాటక, సాంస్కృతిక శాఖను కేటాయించారు. వీటికి యువజన సర్వీసులు, క్రీడల శాఖను జోడించినా.. వసంత్‌కుమార్‌కు తీవ్ర అసంతృప్తినే మిగిల్చింది. వైద్య, ఆరోగ్య శాఖ చూసిన దానం నాగేందర్‌కు అంతగా ప్రాధాన్యం లేని కార్మిక శాఖను కేటాయించడంతో ఆయన కూడా నిరాశకు లోనయ్యారు. గతంలో బీసీ సంక్షేమ శాఖ చూసిన ముఖేష్‌గౌడ్ మార్కెటింగ్, గిడ్డంగుల శాఖపై మండిపడుతున్నారు. పౌరసరఫరాల శాఖ చూసిన జూపల్లి కృష్ణారావు దేవాదాయ శాఖ ఇవ్వడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

39 మందితో కిరణ్ కేబినెట్ * ఒక వర్గానికే పెద్ద పీట * ముసలం

వట్టి వసంత రాజీనామా, అర్ధరాత్రే సీఎంకు
వట్టి ఇంట్లో బొత్స, పొన్నాల, కన్నా, ధర్మాన మంతనాలు
దానం, ముఖేష్, శంకరరావు, కాసు, డొక్కా, దామోదర్‌ల్లోనూ అసంతృప్తి
చిల్లర శాఖలు మాకు... కీలక శాఖలు మీకా? ఇదెక్కడి న్యాయం?
తలో ముక్క పడేశారా? రగిలిన సీనియర్లు, ఇతర వర్గాలు
ఔను, దారుణంగా ఉంది.. అవసరమైతే రాజీనామా చేస్తా: బొత్స

రాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. కొలువుదీరీ తీరక ముందే కొత్త కేబినెట్‌లో కలహాల కుంపటి రగిలింది. 'సామాజిక' యుద్ధం మొదలైంది. శాఖలు కేటాయించిన కొన్ని గంటల్లోనే సచివుల్లో అసంతృప్తి భగ్గుమంది. 'ఇదేనా మాకిచ్చే ప్రాధాన్యం?' అంటూ కొందరు... 'కీలక శాఖలన్నీ మీ వర్గానికేనా?' అని మరికొందరు... 'మీకూ ఒక ముక్క అంటూ చిల్లర శాఖను పడేస్తారా?' అని ఇంకొందరు! దాదాపు అందరిలోనూ అదే అసంతృప్తి, అసమ్మతి! కొందరు లోలోపల రగిలిపోతుండగా... మరికొందరు ఇప్పటికే బయటపడ్డారు. సాయంత్రం చిన్నగా మొదలైన అసంతృప్తి... అర్ధరాత్రి సమయానికి ఆగ్రహజ్వాలగా మారింది.

బుధవారం రాత్రి బాగా పొద్దుపోయాక... కోస్తా ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు వట్టి వసంతకుమార్, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణతోపాటు తెలంగాణ ప్రాంత నేత పొన్నాల లక్ష్మయ్య... వట్టి నివాసంలో సమావేశమయ్యారు. "శాఖల కేటాయింపులో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ... బీసీలను, ఇతర వర్గాలను పట్టించుకోని కేబినెట్‌లో కొనసాగడం అవసరమా?'' అని తమను తాము ప్రశ్నించుకున్నారు. వీరంతా అక్కడి నుంచే సీఎంతో మాట్లాడారు. శాఖల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని ఆయన చెప్పినట్లు తెలిసింది.

దీనిపై సీఎం స్పందన మాత్రం తెలియరాలేదు.అయితే.. తామంతా భేటీ అయిన మాట నిజమేనని, శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. అవసరమైతే తామూ రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు. మరోవైపు... గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పర్యాటకానికి మారిన వట్టి వసంతకుమార్ ఒక అడుగు ముందుకు వేసి అర్ధరాత్రి సమయంలో తన రాజీనామాను ముఖ్యమంత్రికి పంపించినట్లు తెలుస్తోంది. ఐటీ కోల్పోయి మౌలిక సదుపాయాలు దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. భారీ నీటిపారుదల నుంచి ఐటీకి మారిన పొన్నాల లక్ష్మయ్య కూడా ఇదే యోచనలో ఉన్నారు.

ఒక ముఖ్యమంత్రి, 39 మంది మంత్రులు! మొత్తంగా నలభై మంది! చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో 'జంబో కేబినెట్' ఏర్పాటైంది. మంత్రులుగా ఎంపికైన వాళ్లకు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నుంచి పిలుపులు వెళ్లాయి. అభినందనలు అందాయి. గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో 39 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సాయంత్రానికి... శాఖలూ ఖరారయ్యాయి. అంతే... అనేక మందికి షాక్‌లు తగిలాయి. ఉదయం పదవి దక్కిందన్న ఆనందం... సాయంత్రానికి ఆవిరయ్యింది. ప్రాధాన్యం తగ్గిందని కొందరు, చిల్లర శాఖలు కేటాయించారని మరికొందరు, ఇష్టంలేని శాఖలు కట్టబెట్టారని మరికొందరు... రగిలిపోవడం మొదలైంది.

మరీ ముఖ్యంగా... కీలక శాఖలన్నీ ఒకే వర్గానికి కట్టబెట్టారనే ఆగ్రహం భగ్గుమంది. కేబినెట్‌లోని బెర్తుల్లో సింహభాగం సొంతం చేసుకున్న వర్గానికే... కీలక శాఖలూ దక్కాయనే అసంతృప్తి రగిలింది. తమ వారికి మంచి శాఖలు ఇచ్చుకుని, ఇతరులకు చిల్లరమల్లర శాఖలు కేటాయించారనే అభిప్రాయం నెలకొంది. "మేం హోం మంత్రిగా పనికిరామా? ఆ బాధ్యతలు నిర్వహించలేమా? ఏం జరుగుతుందో వేచి చూడండి!'' అంటూ ఒక మంత్రి తీవ్రంగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న మంత్రుల్లో కొందరు నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిసి తమ అసంతృప్తి వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరిద్దరు ఇప్పటికే సీఎంకు ఫోన్ చేసి ఆగ్రహం వెళ్లగక్కినట్లు సమాచారం.

'నల్లగొండ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేని జానారెడ్డికి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు. ఎంపీతో సహా అనేకమందిని గెలిపించిన నాకు చిల్లర శాఖలు అప్పగించారు. తెలంగాణలో పోర్టులు ఎక్కడున్నాయి? ఆ శాఖతో నేను ఏం చేసుకోవాలి? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రాజీనామా చేయాలనే యోచన కూడా ఉంది. కార్యకర్తలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటాను''
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మాకు ముక్కలేనా?
అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం కుదరనట్లే... అందరికీ మంచి శాఖలు కేటాయించడం కూడా కుదరదు! కానీ... ప్రాధాన్యాల మేళవింపులోనే సమతుల్యత లోపించిందని పలువురు మంత్రులు వాపోతున్నారు. వైఎస్ జగన్ వెంట వెళ్లే అవకాశమున్న రెడ్డి, ఎస్సీ వర్గాలకు పెద్ద పీట వేయడం, తద్వారా యువనేత ప్రాబల్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా శాఖల కూర్పు జరిగిందని చెబుతున్నారు. అయినప్పటికీ... ఈ 'లాజిక్'తో మంత్రులు సంతృప్తి చెందలేకపోతున్నారు. వైఎస్ హయాంలో ముక్కలైన శాఖలను మళ్లీ అతికించి ఒక్కరికే కట్టబెట్టడం... అప్పుడు ఒక్కటిగా ఉన్న శాఖలను ముక్కలు చేసి తలా ఒకటి పంచడంలో హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నారు.

"గతంలో మూడు ముక్కలుగా ఉన్న వైద్య, ఆరోగ్యాన్ని ఇప్పుడు ఒకటి చేసి డీఎల్ రవీంద్రా రెడ్డికి అప్పగించారు. అదే సమయంలో... అంతకుముందు కలిసి ఉన్న చిన్న శాఖలను ముక్కలు చేసి మాలాంటి వాళ్లకు పంచారు'' అని ఒక మంత్రి ఆగ్రహించారు. ఉదాహరణకు గతంలో వైద్య, ఆరోగ్యశాఖను మూడుగా విభజించి ముగ్గురు మంత్రులకు కేటాయించగా... ఇప్పుడు ఈ శాఖలన్నింటినీ డీఎల్ రవీంద్రారెడ్డికి అప్పగించారు. అదే సమయంలో... భూగర్భ గనులతో కలిసి ఉన్న చేనేత, జౌలిశాఖను తీసి శంకర్‌రావుకు అప్పగించారు.

నష్టాల్లో ఉన్న ఆప్కో మినహా ఈ శాఖలో మిగిలిందేమీ లేదు. పదవి ఇవ్వకుంటే నానా గందరగోళం చేస్తారనే ఉద్దేశంతో, ఇచ్చామంటే ఇచ్చామంటూ ఇలా 'ముక్కల శాఖలు' అప్పగించారని భావిస్తున్నారు. వివిధ సమీకరణాల రీత్యా మంత్రి పదవులు ఇవ్వక తప్పని వారికి ఆషామాషీ శాఖలతో సరిపుచ్చారని చెబుతున్నారు. దీనిపై శంకర్‌రావు గురువారమే మీడియా ముందుకో, నేరుగా సీఎం వద్దకో వెళ్లి తన అసంతృప్తి వెళ్లగక్కే అవకాశముందని చెబుతున్నారు. ఇక... గ్రామీణాభివృద్ధి శాఖదీ అదే పరిస్థితి. నిజానికి ఇది కీలక శాఖే. కానీ... ఇందులో అత్యంత కీలకమైన ఇందిరా క్రాంతిపథం, స్వయం సహాయ బృందాలను తప్పించి సునీతా లక్ష్మారెడ్డికి అప్పగించారు.

కేవలం గ్రామీణాభివృద్ధి శాఖ, ఉపాధి హామీని మాణిక్య వరప్రసాద్‌కు అప్పగించారు. కేంద్ర నిధులతో నడిచే ఉపాధి హామీ పథకం, కీలక విభాగాలు లేని గ్రామీణాభివృద్ధి శాఖతో మాణిక్యవరప్రసాద్ చేసేదేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. విద్యాశాఖ మంత్రిగా కీలక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న మాణిక్య వరప్రసాద్‌కు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిందిపోయి...అసలుకే మోసం చేయడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్‌కు కార్మిక శాఖ, ముఖేశ్ గౌడ్‌కు మార్కెటింగ్ అప్పగించారు. 'రాష్ట్ర రాజధానికి చెందిన వీరికి కీలక శాఖలు అప్పగించకుంటే... నగరాభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది?' అంటూ ఒక మంత్రి ప్రశ్నించారు.

నిజానికి... ముఖేశ్ గౌడ్ తనకు మున్సిపల్ శాఖ వస్తుందని ఆశించారు. దానం కూడా ప్రాధాన్య శాఖపైనే ఆశలు పెట్టుకున్నారు. శాఖల వెల్లడి తర్వాత వీరిద్దరి అనుచరుల్లోనూ అసంతృప్తి మొదలైంది. మొత్తం మీద... అనుభవంలేని వారికి, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికే ప్రాధాన్య శాఖలు లభించాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఇదేనా ప్రాధాన్యం?
గతంలోకంటే ఇప్పుడు తమ ప్రాధాన్యం పెరుగుతుందని భావించిన పలువురు సీనియర్లకూ శాఖల కేటాయింపులో షాక్ తగిలింది. పొన్నాల లక్ష్మయ్య మొత్తం కేబినెట్‌లోకే పెద్ద వయస్కుడు. తెలంగాణలో సీనియర్ నాయకుడు. కానీ... ఆయనకు 'భారీ' కుదుపు తప్పలేదు. దాదాపు ఆరున్నరేళ్లుగా ఆయన నిర్వహిస్తున్న భారీ నీటిపారుదల శాఖను తప్పించారు. ఐటీ శాఖ అప్పగించారు. కీలకమైన ఇరిగేషన్ శాఖను నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి ఇచ్చారు.

ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఒక నేత సిఫారసు మేరకే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. అంతగా సామర్థ్యం, చురుకుదనం లేదనే పేరున్న సుదర్శన్ రెడ్డికి ఇంత కీలక శాఖ దక్కడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలకమైన రెవెన్యూ మంత్రిగా చక్రం తిప్పిన ధర్మాన ప్రసాదరావుకు ఇప్పుడు రోడ్లు, భవనాలను అప్పగించారు. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న, ఉత్తరాంధ్రలో కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణను పంచాయతీరాజ్ నుంచి తప్పించి రవాణా శాఖ అప్పగించారు.

కన్నా లక్ష్మీ నారాయణ (గృహ నిర్మాణం) కూడా తన ప్రాధాన్యం తగ్గినట్లు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్ రెడ్డికి ఎలాంటి అనుభవం లేకపోయినా కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించడం విశేషం. ఇక... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడు కావడంవల్లే రఘువీరా రెడ్డికి వ్యవసాయం నుంచి 'రెవెన్యూ'కు ప్రమోషన్ లభించినట్లు చెబుతున్నారు. అనూహ్యంగా రగిలిన అసంతృప్తి సెగలను చల్లార్చేందుకు సీఎం కిరణ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో శాఖల కేటాయింపుపై చర్చించుకుందామని ఆయన మంత్రులకు సర్దిచెబుతున్నట్లు తెలుస్తోంది. 
‘రెడ్డి’ కార్పెట్‌
Sabitaరాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం మొదలయింది. పధ్నాలుగు నెలల ముందు వరకూ వైఎస్‌ రాజ శేఖరరెడ్డి! ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి!! మరి బీసీల గతి? ఏముంది మళ్లీ అధోగతే!!! బీసీలు ఓట్లకే పనికివస్తారు తప్ప, పదవులకు పనికి రారని కాంగ్రెస్‌ నాయ కత్వం తన చర్యలతో మళ్లీ రుజువు చేసింది. జనాభా దామాషా ప్రకారం దక్కవలసిన పదవులన్నీ రివర్సయిన వైనం కిరణ్‌ కుమార్‌రెడ్డి సారథ్యంలోని సర్కారులో మరోసారి దర్శన మిచ్చింది. 52 శాతం ఉన్న బీసీలకు వచ్చిన పదవులు పదయితే, జనాభాలో కేవలం 4 శాతమే ఉన్న రెడ్లకు మాత్రం దక్కిన పద వులు పచ్చగా పధ్నాలుగు. ఆ రకంగా కాంగ్రెస్‌ పార్టీ రెడ్డి వర్గానికి రెడ్‌కార్పెట్‌ వేసి, బీసీలను వెనక్కితోసి ముందుకు వెళ్లింది. కాంగ్రెస్‌ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధికి ఇదో నిలువెత్తు నిద ర్శనం. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి రెడ్డి సామాజికవర్గానికేపట్టం కట్టి, బీసీలను అణచివే యాలని నిర్ణయిం చుకున్నట్లు బుధ వారం నాటి మంత్రివర్గం స్పష్టం చే సింది. గతంలో 34 మంది ఉన్న మంత్రిమండలిలో 12 మంది రెడ్లకు స్థానం కల్పించగా, ఈసారి 40మంది ఉన్న మంత్రి మండలిలో 14 మందికి స్థానం దక్కడం చూస్తే ఆ వర్గం హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవు తోంది.

Janareddyఅదేవిధంగా, గతంలో 11 మంది బీసీ లు న్నారు. కొండా సురేఖ రాజీనామా చేయగా ఆ సంఖ్య 10 మందికి పడింది. రెడ్ల మాదిరి గానే గతానికన్నా ఇప్పుడు బీసీల సంఖ్య పెంచే అవకాశం ఉన్నా ఆ పనిచేయలేదు. ఇప్పుడు 40 మంది మంత్రులున్నా అందులో బీసీల సంఖ్య పది మందే కావడం బట్టి, కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తులో బీసీల అవసరం లేదని చ ెప్పకనే చెప్పినట్టయింది. మంత్రివర్గంలో ఈసారి జనాభా దామాషా ప్రకారం ప దవులు ఇవ్వకపోతే ఆందోళన తప్పదని బీసీ సంఘాలు హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్‌ దానిని ఏ మాత్రం ఖాతరు చేసినట్లు కనిపించలేదు. చివరకు శాఖల కేటాయింపులో కూడా రెడ్లదే హవా. హోం, సమాచార, భారీ నీటిపారుదల, ఆ ర్థిక, పురపాలక, వ్యవసాయం, ఆరోగ్య, పంచాయతీరాజ్‌, న్యాయశాఖలు రెడ్డి వర్గానికే దక్కాయి. బీసీలకు ఎకై్సజ్‌, రెవిన్యూ, రవాణా, ఆర్‌ అండ్‌ బి శాఖలు మాత్రమే కీలకమైనవి దక్కాయి. రాయలసీమకు కీలక శాఖలు కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి తన ప్రాంతానికి న్యాయం చేశారు.

Sudarshanరాష్ట్ర రాజకీ యాల్లో ప్రభావితం చేసే పాత్ర పోషించే కమ్మ వర్గానికి దక్కింది ఒక్కటే. దీనిపై నా ఆ వ ర్గీయులు మండిపడుతున్నారు. తమను కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీగా చూ స్తోందని విరుచుకుపడుతున్నారు. తమ వర్గానికి ఎక్కువ శాఖలు ఇ వ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన డిమాండ్‌ను ఎవరూ పట్టిం చుకోలేదని స్పష్టమయింది. కాంగ్రెస్‌ వైఖరి చూస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తమకు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తమ వర్గం టీడీపీ వైపు మొగ్గు పచూ పుతుందన్న ముందుచూపుతోనే తమను పక్కకు పెట్టారని మండిపడుతున్నారు. కాపులలో కూడా అసంతృప్తి రగులుతున్నది. కోస్తాలో కాపులు, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు, తెలంగాణలో మున్నూరు కాపులను కలి పితే మొత్తం కాపులకు 5 పదవులు దక్కినట్లయింది.ే సంఖ్యాపరంగా 5 పదవు లు దక్కినప్పటికీ, ఏ ఒక్కటీ కీలక శాఖ కాకపోవడం కాపుల్లో అసంతృప్తి రాజేసింది.

మంత్రి మండలం

ఒక ముఖ్యమంత్రి, 39 మంది మంత్రులు! మొత్తంగా 40 మందితో కేబినెట్ ఏర్పాటైంది.
- మంత్రుల్లో 11 కొత్త ముఖాలే. వీరిలో ఏడుగురికి తొలిసారిగా మంత్రి పదవులు.
- తెలంగాణ (16)కు ప్రాధాన్యం పెరిగింది. గతంలోకంటే ఈసారి మూడు మంత్రి పదవులు పెరిగాయి.
- కోస్తా నుంచి 15 మంది, సీమ నుంచి 8 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- సంఖ్యాపరంగా గుంటూరుదే అగ్రస్థా నం.ఈసారీ జిల్లాలో నలుగురికి చోటు.
- హైదరాబాద్, మెదక్, కడపలకు ప్రాధాన్యం. ఈ జిల్లాల నుంచి ముగ్గురేసి మంత్రులు.
- ఆదిలాబాద్‌కు మరోసారి రిక్తహస్తం.
- 39 మందిలో 13 మంది.. అంటే మూడోవంతు మంది రెడ్డి వర్గీయులే.
- కేబినెట్‌లో బీసీలు 10, ఎస్సీలు 6, ఎస్టీలు 2, కాపు వర్గానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, క్షత్రియుల నుంచి ఒక్కొక్కరికి చాన్స్.
- జగన్ వర్గీయులైన బాలినేని, పిల్లి సుభాష్, శిల్పా మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డిలకు ఉద్వాసన.
- మహిళా మంత్రుల పదవులు పదిలం.
- ఒకరికి మంత్రిపదవి రావడం ఖాయమనుకున్నారు. కానీ.. రాలేదు. ఆయన.. జేసీ దివాకర్ రెడ్డి. ఇంకొకరిని తొలగిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ, తొలగించారు. ఆయన.. గాదె వెంకటరెడ్డి. ఇక.. ఒకరికి పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. వచ్చింది. ఆయన.. కాసు వెంకట కృష్ణా రెడ్డి.
- ఎమ్మెల్సీల్లో ఒకే ఒక్కరికి అవకాశం! అంతా ఊహించినట్లుగా వైఎస్ వివేకానందరెడ్డికి అందలం. అబ్బాయ్‌తో విభేదించి వచ్చిన బాబాయ్‌కి ఆయనకు ఇష్టమైన వ్యవసాయ శాఖను కేటాయించారు.

ఇదీ కిరణ్ జట్టు