Monday, December 6, 2010

సంక్షేమం, అభివృద్ధి నాకు రెండు కళ్లు * ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం..

 

సంక్షేమం, అభివృద్ధి నాకు రెండు కళ్లు
ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం..

అన్ని పథకాలను అమలు చేస్తాం
పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష..
అర్హులకు మాత్రమే ఫలాలు
ఉద్యమాలతో ఖజానాకు రూ.6వేల కోట్ల గండి..
త్వరలోనే ఇబ్బందులు అధిగమిస్తాం
ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటన..
తాండూరులో తొలి పర్యటన
ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. అదేసమయంలో... పథకాలను పూర్తిస్థాయిలో సమీక్షించి, లొసుగులను సవరించి అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక... తొలిసారిగా ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు.

తాండూరులో ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన హౌసింగ్ కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. "అభివృద్ధి, సంక్షేమం నాకు రెండు కళ్ల వంటివి. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను, వైఎస్ చేపట్టిన పథకాలను కొనసాగిస్తాం. ప్రత్యేక, సమైక్య ఉద్యమాల వల్ల రూ.6 వేల కోట్ల ఆదాయానికి గండి పడింది. ఆర్థిక ఇబ్బందులున్నాయి.

రెండు మూడు నెలల్లో పరిస్థితిని గాడిన పెడతాం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, అన్ని పథకాలకు సక్రమంగా నిధులు మంజూరు చేస్తాం'' అని ప్రకటించారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అభయ హస్తం, రాజీవ్ ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి ప్రాజెక్టులు తదితర పథకాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని కిరణ్ పేర్కొన్నారు.

ప్రాణహిత అంత ఈజీ కాదు: పోలవరం, చేవెళ్ల -ప్రాణహితలకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కిరణ్ కుమార్ తెలిపారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించడం అంతసులువు కాదని అభిప్రాయపడ్డారు. "చెప్పడానికి బాగానే ఉంటుంది.

కానీ... ఈ ప్రాజెక్టులో ఎన్నో కష్టాలు ఉన్నాయి. రంగారెడ్డితో పాటు తెలంగాణలోని జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించదలిచిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 38వేల కోట్లుగా అంచనా వేశారు. ప్రాజెక్టు రూపకల్పనకే రెండేళ్లు పట్టింది. కష్టాలు ఉన్నప్పటికీ... ఈ పనులు త్వరగా చేపట్టేందుకు కృషి చేస్తాం'' అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మీ ఎకరా 2 కోట్లు మాది 2 లక్షలు
DWARACRA ముఖ్యమంత్రిగా రంగారెడ్డి జిల్లాలో జరిపిన తొలి పర్యటనలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ‘మీకు (రంగారెడ్డి జిల్లా వాసులకు), మాకు (రాయలసీమ వాసు లకు) ఒకటే తేడా. మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో నీళ్లు లేవు, రెండు చోట్లా బోర్‌నీళ్లే వ్యవసాయానికి దిక్కు. అయితే, మా దగ్గర ఎకరా రూ.2 లక్షలు ఉంటే, మీ దగ్గర ఎకరా రూ.2 కోట్లు ఉంది’ అని కిరణ్‌కుమార్‌ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. జిల్లాపేరును ప్రస్తావించినప్పుడు కూడా మీ రంగారెడ్డి జిల్లా అంటూ సీఎం సంబోధించడం విశేషం. తాండూరులో ఆదివారం ఇందిరమ్మ గృహాల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరుపేదలకు ఇళ్ల పట్టాలను, స్వయం సహాయక సంఘాలకు రుణాలను ఈ సభలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్‌ పథకాల అమలుకు ఎన్నికోట్ల రూపాయలైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత తరుణంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, మరో రెండుమూడు నెలల్లో కాస్త కోలుకోగానే సోనియా, వైఎస్‌ నాయకత్వాల్లో అమలుచేసిన అన్ని పథకాలను కొనసాగించేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ర్టంలోని అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పథకాల అమలుకోసం పెద్దమొత్తంలో ప్రభుత్వం ఖర్చుచేస్తోందని తెలిపారు. 1983 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 47 లక్షల ఇళ్లను నిర్మిస్తే, ఆరేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వహయాంలో 51 లక్షల ఇళ్లను నిర్మించామని, మరో 14 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇంకో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి 25 లక్షల మంది రైతులకు ఉచిత కరెంటును అందజేశామని, టీడీపీ హాయంలో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టాల పాలైతే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 12వేల కోట్ల బకాయిలు మాఫీచేయడమే కాకుండా రూ. 1400 కోట్ల సాయాన్ని అందజేశామని తెలిపారు. ప్రస్తుతం పావలావడ్డీకి రైతులకు 35వేల కోట్ల పంటరుణాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకో గా, ఇప్పటివరకు 25వేల కోట్ల రుణాలను అంద జేశామని,మిగిలిన 10వేల కోట్ల రుణాలను త్వర లోనే పంపిణీ చేస్తామన్నారు.

గతంలో 18 లక్షల మంది వృద్ధులకు నెలకు 75 రూపాయల పింఛన్‌ ను అందజేస్తే తాము 72 లక్షల మందికి నెలకు రూ.200 చొప్పున పింఛన్‌లను అందజేస్తున్నామని తెలిపారు. 8 లక్షల మంది వికలాంగులకు రూ. 500 చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మహిళలు మరింత అభివృద్ధి సాధిస్తారని ఆశించి స్వయం సహాయక సంఘాలకు పావలావడ్డీకి 25వేల కోట్ల రుణాలను అందజేశామ న్నారు. 2003లో వైఎస్‌ ఈ పథకం అమలుకు హామీ ఇస్తే తన సొంతగ్రామమైన కలికిరిలో ఆశ్చ ర్యపోయామని, కంతులు(కిస్తీలు) ఎలా కడతారని అనుకున్నామని, అధికారంలోకి రాగానే వైఎస్‌ ఈ పథకాన్ని అమలుచేసి చూపించగా, 99 శాతం రుణాలను చెల్లించారని సీఎం గుర్తుచేశారు.

యేడా ది 280 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయించగా, ఇంకా కావాలని అడుగుతున్నారన్నారు. అంతేకా కుండా 39 లక్షల మందికి అభయహస్తం కార్యక్ర మం కింద 360 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కేవలం డబ్బులేక చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో సోనియా, వైఎస్‌లు ఫీజురియంబర్స్‌ మెంట్‌ను అమలుచేశారని, త్వరలోనే ఈ పథకం కింద స్కాలర్‌షిప్పులను, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను చెల్లిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 5.30 లక్షల మందికి 2400 కోట్ల రూపాయలు వెచ్చిం చామని, చదువులు, ఆపరేషన్‌లు, రుణాలకోసం ఏ ప్రభుత్వం వెచ్చించనివిధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ, సీమాంధ్ర గొడవల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రావల్సిన సుమారు 6వేల కోట్లు నష్టపోయామని, ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని, మరో రెండుమూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటామని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో అన్నిపథకాలకు నిధులను అందజేస్తామని, స్కాలర్‌షిప్పులకు, ఫీజు రియంబర్స్‌మెంట్‌కు అవసరమైన మేరకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు వైఎస్‌ కృషిచేశారని, కోర్టులో ఇబ్బందులు తలెత్తాయని, దీన్ని త్వరలోనే అధిగమిస్తామని సీఎం తెలిపారు. ఐకేపీలో చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయని, 12500 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తే, మైక్రో ఫైనాన్సులు 7500 కోట్ల రుణాలను అందజేశాయని, మైక్రో ఆగడాలను అరికట్టేందుకు ఆర్డినెన్స్‌ కూడా తీసుకువచ్చామ న్నారు. 1.20 కోట్ల మందికి తెల్లరేషన్‌కార్డులు అందించి రూ.3వేల కోట్ల సబ్సిడీలను భరిస్తున్నా మని సీఎం తెలిపారు. పలు శాఖల్లో లొసగులు ఉన్నాయని, త్వరలోనే వాటన్నింటినీ గుర్తించి సరిచేస్తానని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వ పథ కాలను అర్హులైన వారందరికీ అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకోసం ఎన్ని వ్యయప్రయాసలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభిం చినంత సులువుగా, ప్రాజెక్టును పూర్తిచేయలేమని, పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టులను కేంద్ర ప్రాజెక్టులుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. మొద టిసారిగా జిల్లాకు వచ్చిన తనను ఆశీర్వదించిన తాండూరు ప్రజలకు రుణపడివుంటానని, జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తగుచర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పాలనలో పారదర్శకతను పాటిస్తా మన్న సీఎం ఈక్రమంలోనే ఐదుమంది నిరుపేద లకు ఇళ్లపట్టాలను అందజేయగా, మిగిలిన 2659 పట్టాలను ఎన్‌సీసీ క్యాడెడ్ల ద్వారా పంపిణీ చేశారు. పొదుపు సంఘాలకు రూ.45.50 కోట్ల రుణాలను సీఎం పంపిణీ చేశారు.

1056 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా వైఎస్‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఇదిలా వుండగా, సమావేశ వేదిక వద్ద తెలంగాణ వాదులు తెలంగాణకు మద్దతుగా నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. హెలీప్యాడ్‌ వద్ద, గురుకుల పాఠశాల వద్ద విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు వ్యక్తంచేశారు.మంత్రులు పి.సబితారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, ఆకుల రాజేందర్‌, కూనశ్రీశైలంగౌడ్‌, బిక్షపతియాదవ్‌, కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో రచ్చబండ
క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు వైఎస్ తలపెట్టిన 'రచ్చబండ' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని కిరణ్ తెలిపారు. పథకాల్లో లొసుగులు తెలుసుకుని, అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేస్తామన్నారు.

మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. రాజీవ్ గృహకల్ప, పట్టణ గృహ నిర్మాణ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మేలు చేసేందుకు జీవో 42ను అమల్లోకి తెస్తామని తెలిపారు. దీని వల్ల రెండున్నర లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కిరణ్ తెలిపారు.

వైఎస్ విగ్రహావిష్కరణ
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తాండూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీని ప్రారంభించారు. సబ్ స్టేషన్‌తోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి , కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment