Sunday, January 9, 2011

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

cm
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహాకాలు అందిస్తుందని, పెట్టుబడులకు రాష్ట్రం అనుకూల ప్రదేశమని ఆర్‌బీఐ కీతాబిచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని మరో గుజరాత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో విద్యుత్‌ రేటు చాలా తక్కువగా ఉందని సీఎం స్పష్టంచేశారు. పరిశ్రమలు స్ధాపించేవారికి తక్షణ అను మతులు ఇస్తామని, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్విహ స్తున్నాయని ముఖ్యమంత్రి ప్రవాసాంధ్రులకు తెలిపారు.

గుజ రాత్‌ తరహా అభివృద్ధే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. నేడు ఢిలీ ్లలో జరగనున్న ప్రవాస భారతీయ దివస్‌-2011 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డిని పాల్గొనాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రి గీతారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్‌.వీ.ప్రసాద్‌ ఇతర ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పలుఅంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్రం లో పరిశ్రమలకు కావల్సిన ఆయా ముడిసరుకుతోపాటు, సుపరిపాలన, పెట్టుబడులకు అనుకూలంగా ఉండే విధానా లతోపాటు అన్నీంటికీ మించి వృత్తి నైపుణ్యం ఉన్నవారు అందు బాటులో ఉన్నారన్నారు. ముఖ్యంగా విద్యుతుత్పాదన రంగంలో రాష్ట్రం దేశం మొత్తంమీద రెండవస్ధానంలో నిలిచిందని 2010-11 ఆర్ధిక సంవత్సరానికి ఎపి ట్రాన్ప్‌కోకు పురస్కారం లభించిదాన్నరు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి ప్రవాసాం ధ్రులకు నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీల్లో 25 శాతం మంది రాష్ట్రానికి చెందినవారున్నారని, రాష్ట్రంనుంచి వైద్య విద్యను పూర్తిచేసుకున్న ఎంతోమంది డాక్టర్లు యుఎస్‌, యూ రోపియన్‌ దేశాలలో పనిచేస్తున్నారన్నారు. కాగా అంధ్రప్రదేశ్‌ ఐటీ, బయోటెక్నాలజీ, ఔషధ, ఎయిర్‌లైన్స్‌, ఉత్పాదక సంస్ధలతోపాటు ఇతర శిక్షణ సంస్ధల స్ధాపనలో ముందంజలో ఉన్నదని, అత్యున్నత టిఐఎఫ్‌ఆర్‌ సంస్ధను కూడా హైదరా బాద్‌లో ఏర్పాటు చేస్తారన్నారు.

వీటితోపాటు సహజ వాయువు సమృద్ధిగా లభిస్తుందని, ఆహార ఉద్పాదక, అనుబంధ పరిశ్ర మలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ రూపొందించారని, ఈ విధానంతో రాష్ట్ర ఆర్ధిక ప్రగతితోపాటు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని, దీంతో గ్రామీణులకు ఆర్ధికంగా వెసులుబాటు లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌, నీటి పారుదల ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రహదారుల వంటి అభివృద్దిలో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.

ఇందుకు అనుగుణంగా రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నందున జాతీయ సా ్ధయిలో 3వ స్ధానంలో నిలిచిందని ముఖ్యమంత్రి తెలి పారు. అంతేకాకుండా భార త్‌లో వాణిజ్యానికి అనుకూలంగా హైదరాబాద్‌ రెండవ మెట్రో నగరంగా ప్రపంచబ్యాంకుచే గుర్తించబడిం దని, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎపీలో ఎక్కువగా ఉత్పాదక రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయన్నారు. కా గా తిరుమల వెంకటేశ్వరుని ప్రతీ ఏటా మిలియన్ల సంఖ్యలో భక్తులు ప్రపంచం నుంచి వస్తున్నారని, ప్రవాసాంధ్రులు వెంకటేశ్వరుని ఆశీస్సులు అందు కోవాలని సీఎం ఈసందర్భంగా కో రారు.ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబ డులను ఆకర్షించే విధంగా ఉన్నతా ధికారులు నిరంతరంగా కొనసాగించాలని ఇందుకు ఓ ప్రత్యేక పానెల్‌ను ఏర్పాటుచే ేయాలని సీఎం అధికారులకు సూచించారు.

No comments:

Post a Comment