Friday, January 28, 2011

అభివృద్ధి చూసి కొందరికి.. కడుపు కాలుతోంది అందుకే రచ్చబండకు ఆటంకాలు...

 

రహదారుల అభివృద్ధికి 20 వేల కోట్ల ప్యాకేజి
ఆగిన పనుల పూర్తికే సోనియా నన్ను నియమించారు!
వైఎస్ సలహాదారుల్లో నేనూ ఒకణ్ని

కర్నూలు, మహబూబ్‌నగర్ సభలలో కిరణ్
అభివృద్ధి చూసి కొందరికి.. కడుపు కాలుతోంది
అందుకే రచ్చబండకు ఆటంకాలు
వ్యతిరేకులపై సీఎం నిప్పులు 
 
"గొంతు లేని వారికి, కండ బలం లేనివారికి, ఆర్థిక, పార్టీల బలం లేని పేదల ఇంటి తలుపు తట్టి కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పథకాలను పేదలకు రచ్చబండ సందర్భంగా అందిస్తున్నాం. ఇది చూసి కొందరికి కడుపు కాలుతోంది. అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారు'' అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా, తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తుందని, ఇందుకోసం మరోసారి కూడా రచ్చబండను చేపడుతుందని ప్రకటించారు. 


దివంగత సీఎం వైఎస్ ప్రారంభించిన కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, వాటిని పూర్తిచేసేందుకే తనను సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నియమించారని ఆయన చెప్పారు. గురువారం కర్నూలు ఏపీఎస్పీ మైదానంలోను, మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం సింగాయపల్లిలో నిర్వహించిన రచ్చబండ, బహిరంగ సభల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి చెప్పడంతో పాటు.. రచ్చబండను వ్యతిరేకించే పార్టీలపై నిప్పులు చెరిగారు. సింగాయపల్లి సభలో సంక్షేమ పథకాలను వివరించి.. చివరగా పేదలకు ఇన్ని పనులు చేస్తే పొరపాటా? అన్నారు. సభకు వచ్చిన మహిళలతో చేతులెత్తించి ఇదే వారికి సమాధానమన్నారు.

మహిళలు తెలివైనవారని సీఎం ప్రశంసించారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు వారి నియంత్రణలోనే ఉంటాయని, వృథా ఖర్చులు చేయబోరనే ఇళ్లు, భూములు వారిపేరుతో ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని, వచ్చే మూడేళ్లలో వీటిని చేపట్టేందుకు ప్రత్యేక ప్యాకేజీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, జడ్పీ ఛైర్మన్ దామోదర్‌రెడ్డి, ఎంపీ మంద జగన్నాథం, కలెక్టర్ పురుషోత్తంరెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 


ఇక కర్నూలు సభలో మాట్లాడిన సీఎం.. 2009 ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే వైఎస్ రచ్చబండను రూపొందించారన్నారు. దీన్ని ప్రారంభించేలోపే ఆయన మృతిచెందడంతో.. తాను మొదలుపెట్టానన్నారు. పథకాల రూపకల్పనకు వైఎస్‌కు సలహాలిచ్చే కమిటీలో తానూ ఒకడిని చెబుతూ.. మహిళలకు పావలావడ్డీ ప్రవేశపెట్టడంలో తానూ ఒక సలహాదారుడినని వివరించారు. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్.. ఇలా అందరినీ అందించిన జిల్లా కర్నూలేనన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రికి నిధులు, ఒక మైనారిటీ కళాశాల, దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి పేరుతో కల్చరల్ ఆడిటోరియం మంజూరు చేస్తానన్నారు.


సభలో మండలి చైర్మన్ చక్రపాణి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి పాల్గొన్నారు. కాగా.. వరద బాధితుల సహాయార్థం కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో గృహనిర్మాణ శాఖ, టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద బాధితులకు మీడియా చేయూత అభినందనీయమన్నారు. 

మళ్లీ వస్తా...అభివృది చూస్తా!

"మరిచిపోలేని విధంగా కర్నూలు జిల్లా వాసులు నన్ను ఆహ్వానించారు. ఇక్కడ రూ. 7,444 కోట్లతో జలయజ్ఞం పనులు జరుగుతున్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. మూడునెలల్లో హంద్రీనీవా సుజలస్రవంతి మొదటి దశ పనులు పూర్తి చేసి అనంతపురానికి నీరిస్తాం. ఆ తరువాత నేను మళ్లీ జిల్లాకు వస్తా. జరిగిన అభివృద్ధిని చూస్తా..''నని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

గురువారం జూపాడుబంగ్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకుని కర్నూలులోని ఏపీఎస్పీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాకు చెందిన మంత్రి టీజీ వెంకటేష్, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అభ్యర్థన మేరకు సీఎం కర్నూలుకు వరాలు కురిపించారు. కర్నూలు పెద్దాసుపత్రి అభివృద్ధికోసం ఆయన తనవంతు కృషి చేస్తానన్నారు. భవనాల మరమ్మతులకోసం ప్రస్తుతం టీజీ అడిగిన రూ. 20 కోట్లను మంజూరు చేస్తామన్నారు. తెలుగుగంగ, గురురాఘవేంద్ర, సిద్దవరం, హంద్రీనీవా, గాలేరు నగరి, పులికనుమ వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీటివల్ల జిల్లాలో అదనంగా మూడున్నర లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.

జిల్లాలో నదులున్నా నీటిని వినియోగించుకునే పంపుసెట్లు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జరిగిన ఆరేళ్ల కాలంలో ఉచిత కరెంటుకోసం రూ.29,500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేశామన్నారు. ఉపాధి హామీ ద్వారా వచ్చే మార్చి నాటికి రూ. 7,500 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పావలా వడ్డీకింద కర్నూలు జిల్లాకు ఆరేళ్లలో రూ. 32కోట్ల 60 లక్షలు మంజూరు చేశామన్నారు. వచ్చే 15 రోజుల్లో మరో రూ. 22 కోట్లు ఇవ్వనున్నామన్నారు. ఈ యేడాది మార్చినాటికి రావాల్సిన నిధులను ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పథకాన్ని రైతు పనులకు అనుసంధానంచేసే ఆలోచనలో ఉన్నామని, కేంద్రానికి ప్రతిపాదన పంపామని చెప్పారు. కేంద్రాలని ప్రధాని, రాష్ట్రపతి వంటి వారిని అందించిన జిల్లాను సీఎం పొగడ్తలతో ముంచెత్తారు.

మంత్రుల చేతుల్లోనే కర్నూలు అభివృద్ధి జిల్లా అభివృద్ధి మంత్రులిద్దరి చేతుల్లోనే ఉంద ని సీఎం కిరణ్ చమత్కరించారు. కర్నూలు ఆస్పత్రి గురించి ఆయన మాట్లాడుతూ మంత్రి టీజీ వెంకటేష్ ఫైలు ప్రభుత్వానికి పంపానని చెప్పడం ఏమిటన్నారు. ఆయనే ప్రభుత్వంలో కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్నారని, మంత్రులు టీజీ, ఏరాసు జిల్లా అభివృద్ధి ప్రణాలిక ఫైళ్లను నడిపించుకుని పనులు చేయించుకోవాలని సూచించారు.

గుర్తుంచుకునేలా చేయండి : టీజీవీ కర్నూలు జిల్లా ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ సీఎంను కోరారు. బహిరంగ సభకు అధ్యక్షత వహించిన ఆయన ముందుగా సీఎం దృష్టికి పలు సమస్యలను తెచ్చారు. రద్దుచేసిన రేషన్ కార్డుల్లో అర్హులైన వారికి పునరుద్దరించాలని కోరారు. ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేయాలని, ఇళ్లనిర్మాణాల విషయంలో ఉన్న కోర్టు కేసులు తొలగిపోయేలా చూడాలన్నారు.

వరదబాధితులకు పరిహారంకోసం నిధులు మంజూరు చేయాలని అడిగారు. కర్నూలు పెద్దాసుపత్రి ఆధునికీకరణకోసం రూ. 169 కోట్లతో మాస్టర్‌ప్లాన్ తయారు చేశామని అందుకు నిధులు సమకూర్చాలని కోరారు. ప్రస్తుతం భవనాల ఆధునికీకరణకోసం రూ. 20 కోట్లతో ఫైలు పంపించామని పరిశీలించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లలో ఒకటైన కర్నూలు ప్రెస్ భవనం శిథాలావస్థలో ఉందని, దానిని అభివృద్ధి పరచాలని కోరారు.

రైతులను కాపాడండి : ఎంపీ కోట్ల కర్నూల రైతులను కాపాడాలని ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సీఎంను కోరారు. ఎల్లెల్సీ కాలువపై ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులు కర్నాటక రైతుల జల చౌర్యంతో కుదేలవుతున్నారన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కిరణ్‌ను కోరారు. రంగాపురం వద్ద 8 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మిస్తే లిఫ్టు ద్వారా రైతులకు కొంత ఊరట కలిగించవచ్చని చెప్పారు.

తన తండ్రి పేరుతో కల్చరల్ ఆడిటోరియం నిర్మాణ మంజూరును ప్రకటించాల్సిందిగా కోట్ల సీఎం చెవిలో చెప్పి ఒప్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్, ఇన్‌చార్జి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, కోట్ల సుజాతమ్మ, డీసీసీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, జిల్లా నాయకులు ఎస్వీమోహనరెడ్డి, సుధాకరబాబు, కలెక్టర్ రాంశంకర్ నాయిక్, జేసీ బుద్ధప్రకాష్, డీఆర్వో సూర్యప్రకాష్, అదనపు ఎస్పీ రవీంద్ర నాయిక్, డీఆర్‌డీఏ పీడీ సోనీబాలాదేవి పాల్గొన్నారు.
Click Here!

జిల్లా పర్యటన ఆనందం కలిగించింది

రచ్చబండలో భాగంగా జిల్లాలో పాల్గొన్న కార్యక్రమాలు ఆనందాన్ని కల్గించాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం 10:35 గంటలకు జూపాడుబంగ్లా జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన్ను ఆందోళనకారులు చుట్టుముట్టినా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. 98 జీవో ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ ముంపు బాధితులకు ఉపాధి చూపాలని, 2008 డీఎస్సీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, బుడగ జంగాలకు జీవో నెం 144 చూపి ఎలాంటి అభివృద్ధి లేకుండా చూపుతున్నారంటూ నిరసనకు దిగారు.

అక్కడ నుంచి 11:45 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి 12:05 గంటలకు కర్నూలు ఎస్ఏపీ క్యాంప్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుని టీజీవీ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన సభ ద్వారా కర్నూలు నగరానికి వరాల జల్లులు ప్రకటించారు. సభ అంత హర్షధ్వానాల మధ్య సాగింది. పెద్దాసుపత్రికి ప్రత్యేక నిధులు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరుతో కల్చరల్ ఆడిటోరియం, మైనార్టీ కళాశాల, జిల్లాలో జలయజ్ఞం కింద చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేస్తాను. వాటి పురోగతి కోసం మరో మూడు నెలల్లో జిల్లాలో పర్యటిస్తానని చెప్పడంతో సభ వీలలకేకలతో మార్మోగింది. ఇద్దరు జిల్లా మంత్రులు జిల్లాకు అవసరమైన పనులకు సంబసందించి వారే నిర్ణయం తీసుకుని ఫైలు తనదాకా తీసుకుని వస్తే కళ్లుమూసుకుని సంతకం చేస్తానన్నారు.

ఈ సందర్బంగా గ్రామీణ, పట్టణ వికెపి సంఘాలకు బ్యాంకు రుణాలు, పావలా వడ్డి నిధులు రూ.42 కోట్లు ఆర్థిక సహాయాన్ని సీఎం పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి 1:10 గంటలకు ఎస్ఏపీ క్యాంప్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బయల్దేరి జగన్నాథగట్టు వద్ద ప్రభుత్వం, మరియు టీవీ 9 సంయుక్తంగా నిర్మించిన వరద పునరావాస కాలనీ చేరుకుని టీవీ9 ప్రజానగర్ కాలనీని ప్రారంభించారు.

అక్కడే భోజనం చేసుకుని 2:35 గంటలకు మహబూబ్‌నగర్‌లో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్ ద్వారా వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఏరాసు, విజయరామరాజు, టీజీ వెంకటేష్, శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్, ఎంపీ కోట్ల, జడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి వీడ్కోలు పలికారు.
Click Here!

వరద బాధితులకు మీడియా చేయుతఅభినందనీయం:సీఎం

వరద బా«ధితుల కోసం టీవీ-9 చానల్ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడం అభినందనీయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నగర శివారులోని జగన్నాథగట్టులో టీవీ-9 ప్రజానగర్‌లో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి బాధితులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఇళ్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాగునీరు, రోడ్లు, మురికి కాల్వలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాలనీ నిర్మాణం కోసం సహకరించిన కలెక్టర్ రాంశంకర్‌నాయక్‌ను వివిధ విభాగాల అ«ధికారులను ఆ సంస్థ సీఈవో రవిప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం మొక్కలను నాటి ఆ తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించి లబ్ధిదారులనుద్దేశించి కాసేపు మాట్లాడారు.


కొత్త కర్నూలు నేటితో జాతికి అంకితం - టీవీ9 సీఈవో రవిప్రకాష్ టీవీ-9 ప్రజానగర్ ద్వారా కొత్త కర్నూలు ఏర్పాటైందని టీవీ9 సీఈవో రవిప్రకాష్ అన్నారు. మోడల్ కర్నూలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. 400 ఇళ్లు పూర్తి చేయగలిగామని, రెండో విడతగా మరో 750 ఇళ్లను నిర్మించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

పాలమూరుకు వరాల జల్లు

రెండునెలల వ్యవధిలో జిల్లాకు రెండోసారి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రచ్చబండ సందర్భంగా వరాల జ ల్లు కురిపించారు. తాను సీఎంగా ఉ న్నంతకాలం, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ, జిల్లామంత్రులు ప్రస్తావించిన అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారు. గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు కోడేరు మండలం సింగాయిపల్లికి చేరుకున్న సీఎం, ఇక్కడ రెండు గంటల పాటు గడిపారు.
దాదాపు అరగంటపాటు రచ్చబండలో పాల్గొన్న ఆయన, మరో గంటపాటు బహిరంగసభలో పాల్గొన్నారు. ఇందులో, ఆయన ప్రసంగం పావుగంట సాగింది. రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. బహిరంగసభలో జిల్లా మంత్రులు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై సీఎం ప్రకటన చేశా రు. జిల్లా నాయకులు తనకు అత్యంత సన్నిహితులని పేర్కొంటూ, సీఎంగా, ఎంత అభివృద్ధి వీలయితే అంతమేర చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భం గా, మహిళా స్వయం సహాయక సం ఘాలకు రూ. 530 కోట్ల చెక్కును అందజేశారు

. అంతకుముందు, బహిరంగసభలో దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పేదలకు కొత్తగా 54వేల ఇళ్లు మంజూ రు చేసినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతమైన జిల్లాను గతంలో చంద్రబాబు దత్తత తీసుకున్నట్లు ప్రకటించినా, ఆయన మాటలు కోటలు దాటలేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు మరో 20శాతం మేర నిధులు వెచ్చిస్తే, 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనికోసం చర్యలు తీసుకోవాలని సీఎంను అభ్యర్థించారు.

సోమశిల-సిద్ధేశ్వరం బ్రిడ్జి పనులు సగంలో ఆగిపోయాయని, దీనిని పూర్తిచేయాలని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా పానగల్, కోడే రు మండల ప్రాంతవాసులకు కూడా ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోడేరు, పి.కె.పల్లిలో జూనియర్ కాలేజీలు, నాగర్‌కర్నూలు-కొల్లాపూర్ రహదారి విస్తరణ, కొల్లాపూర్ ప్రాంతంలో పీజీ కాలేజీ మంజూ రు చేయాలని కోరారు. ఎంపీ మంద జగన్నాథ్ మాట్లాడుతూ, కరవు జి ల్లాకు సీఎం కిరణ్, నెలరోజుల్లో రెండోసారి రావడం అభినందనీయమన్నారు

. జిల్లాలో సాగునీటి అవశ్యకత దృష్ట్యా, పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలని, కొల్లాపూర్-నంద్యాల రైల్వే లైను కోసం అవసరమయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున వ్యయం భరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఆర్ఎఫ్, పీఎంజిఎస్‌వైల్లో జిల్లాకు అన్యాయం జరుగుతోందని, వీటికి పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ, జిల్లాలో తొమ్మిది డిగ్రీ కాలేజీలు మంజూరు చేసినా, వాటికి భవనాలు లేవని అన్నారు. ఈ భవనాలు మంజూరు చేయాలని, జిల్లా ప్రభుత్వాసుపత్రిని 350 పడకలకు పెంచాలని సీఎంను అభ్యర్థించారు.

ఈ ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో రోడ్లు అధ్వానం గా మారాయని, ముఖ్యంగా వరదలతో భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వీటికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు తూ, ప్రజా సమస్యల పరిష్కారానికే ర చ్చబండ చేపట్టామని అన్నారు. సమావేశంలో, జడ్పీ ఛైర్మన్ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.రాజేశ్వర్‌రెడ్డి, అబ్ర హాం, ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ వీరారెడ్డి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, జిల్లా కలెక్టర్ ఎం.పురుషోత్తంరెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.చిరంజీవులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment