Saturday, January 29, 2011

జిల్లాలకు సీఎం వరాలు * మీకు వీలుంటే సాయంచేయండి...లేదంటే ఇంట్లో కూర్చోండి... మీకు సత్తాలేదు... సాయం చేసేవాళ్లను చేయనివ్వండి... ప్రజ లకు మేలుచేస్తుంటే కడుపుమంటతో ఇబ్బందుల పాలు చేస్తే అభాసుపాలవుతారు...

 

2 సీట్లు.. 11 సీట్లున్న పార్టీలకు భయపడేది లేదు

 మీకు వీలుంటే సాయంచేయండి...లేదంటే ఇంట్లో కూర్చోండి... మీకు సత్తాలేదు... సాయం చేసేవాళ్లను చేయనివ్వండి... ప్రజ లకు మేలుచేస్తుంటే కడుపుమంటతో ఇబ్బందుల పాలు చేస్తే అభాసుపాలవుతారు... రెండు సీట్లున్న పార్టీకి... పదకొండు సీట్లున్న పార్టీకి భయపడేదిలేదు...125 ఏళ్ల చరిత్ర గల పార్టీ మాది...మీరు మారకపోతే మళ్లీ ఎన్నికల్లో అవే నెంబర్లు కొనసాగుతాయంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విపక్షాలకు చురకలం టించారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో శుక్రవారం ‘ఆధార్‌’ ఆధారంగా వినియోగదారులకు స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం కట్టుబడి వుంటుందని స్పష్టం చేశారు. ఇలా పదిమంది...యాభై మంది వచ్చి వేలాదిమందికి మేలుచేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే భయపడేదిలేదని...ప్రజలే చూసుకుంటారన్నారు. తెలంగాణ నినాదాలతో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఉద్దేశించి సీఎం 
పై విధంగా స్పందించారు.
 
‘ఆధార్‌’ఆధారంగా దేశంలోనే మొదటిసారిగా మహేశ్వరంలో స్మార్టకార్డుల ద్వారా వినియోగదారులకు రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తున్నామని, ఈ కార్డు ద్వారా వినియోగదారులు ఎక్కడినుంచైనా రేషన్‌ తీసుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలందరికీ అందజేసేవరకు నిద్రపోవద్దన్న యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల ఆదేశాలమేరకు రాష్ట్రంలో ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్లేందుకు ఈ రచ్చబండకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోయి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించడం దురదృష్టకరమని, ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.

ఆర్థిక, అంగబలం, గొంతులేని నిరుపేదలకు, పూర్తిగా వెనకబడిన వారికి మేలుచేసేందుకే రచ్చబండను నిర్వహిస్తున్నామన్నారు. పదిహేనురోజుల్లో 26 లక్షల కుటుంబాలకు, 1.25 కోట్ల మందికి మేలుచేసేందుకు రూ.2005 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, 50 శాతం సబ్సిడీకి బదులుగా 90 శాతం సబ్సిడీ కావాలని కేంద్రంపై ఒత్తిడితెస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

త్వరలోనే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తిచేస్తామని సీఎం వివరించారు. ఇరవై ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, అప్పటికీ ఇప్పటికీ మహిళల పరిస్థితి పూర్తిగా మారిందని, ఇళ్లు, భూములు వారి పేర్లపైనే ఇస్తున్నామని...వారు ఎంతో అభివృద్దిని సాధించారని, నాడు అవసరాలకు డబ్బు తీసుకునే వారని...ఇప్పుడు పురుషులకే డబ్బులు ఇచ్చేస్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఆధిభట్లలో మరో పదిపదిహేను రోజుల్లో వెయ్యి కోట్లతో టాటా మూడు కంపెనీలను ప్రారంభించనున్నారని, దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనున్నదని తెలిపారు. జిల్లాలో కూరగాయల జోన్‌ ఏర్పాటుకుగాను ముందుగా ఐదువేల ఎకరాలను తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ సెంటిమెంట్‌గా ఏ కార్యక్రమమైనా రంగారెడ్డి జిల్లానుంచే ప్రారంభించారని, అదేవిధంగా తాను కూడా రంగారెడ్డి జిల్లానుంచే ‘ఆధార్‌’, స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు. ఇదిలావుండగా, సీఎం ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన కారులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందు సుమారు రూ.110 కోట్లు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మహిళా సంఘాలకు పావలావడ్డీ పథకం కింద రూ.35 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆధార్‌కార్డులను, స్మార్ట్‌కార్డులను సీఎం అందజేశారు. మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పి.సబితాఇంద్రారెడ్డి, కే.జానారెడ్డి, సునితాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సంజయ్‌జాజు, ఆధార్‌ డైరెక్టర్‌ విఎల్‌ భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పావలావడ్డీ రుణాలు అందజేసిన ముఖ్యమంత్రి

కొండమల్లేపల్లి రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పావలావడ్డీ రుణాలను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. 35 గ్రూపులకు 55వేల రూపాయలను అందజేశారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రచ్చబండ కార్యక్రమానికి అనుమతించాలంటూ సీపీఐ నాయకులు హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్‌రెడ్డి, రవీంద్రకుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డిలను అనుమతించకపోవడంతో ధర్నా నిర్వహించారు. దీంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకొని సీపీఐ నాయకులను హెలిప్యాడ్ వద్దకు అనుమతించారు.
సీఎం సభలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు వినతులు అందజేశారు. డిండి ఎత్తిపోతల, శ్రీశైలం సొరంగమార్గానికి నిధు లు కేటాయించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీపీఐ ఆధ్వర్యంలో పల్లా వెంకట్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎం.ఆదిరెడ్డి, పల్లా నర్సింహ్మారెడ్డి, కృష్ణాట్రిబ్యునల్ తీర్పుతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని,
సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ వేసి నికర జలాలు అందించాలని, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందజేయాలని టీడీపీ నియోజకవర్గవర్గ ఇన్‌చార్జి బీల్యానాయక్, జిల్లా కార్యదర్శి హన్మంతు వెంకటేష్‌గౌడ్, పట్టణ అభివృద్ధికి నిధులు అందజేయాలని కొండమల్లేపల్లి సర్పంచు తార, మంచినీటి సౌకర్యం కల్పించాలని కుందల్‌పహాడ్ సర్పంచు లక్ష్మీయాదగిరి, వికలాంగ యువతీ పెన్షన్ అందజేయాలని, నాయీ బ్రాహ్మణులకు ఇళ్లు మంజూరు చేయాలని సంఘం నాయకులు ఎన్.వెంకటయ్య ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
ఏడుకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. నూతన భవనాన్ని సద్వినియోగ పర్చుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి పాల్గొన్న రచ్చబండ, బహిరంగసభ భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. సభ విజయవంతమైనప్పటికీ తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన రాళ్లదాడులలో పోలీసులతో పాటు తెలంగాణవాదులకు గాయాలయ్యాయి. ఐజీ రాజీవ్‌రతన్ ఆధ్వర్యంలో ఎస్పీ రాజేష్‌కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేసినప్పటికీ సభా సజావుగా కొనసాగగా బయట కొన్నిసంఘటనలు చోటుచేసుకున్నాయి.

రచ్చబండలో పాల్గొనడానికి కొండమల్లేపల్లి హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు జానారెడ్డి, వెంకట్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భారతీరాగ్యానాయక్, నేతి విద్యాసాగర్, జడ్పీచైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్ బాలూనాయక్, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ రిజ్వీ, ఐజీ రాజీవ్ రతన్, ఎస్పీ రాజేష్‌కుమార్, జేసీ నీతూప్రసాద్, చంపాలాల్, ఆర్డీవో సంజీవరెడ్డి, డీఎస్పీ అహ్మద్అలీ, సురేంద్రబాబుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

Click Here!

ఫ్లోరైడ్ సమస్యను అధిగమిస్తాం

'ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చాలా నిధులను అందించింది. ప్రాజెక్టు పూర్తికి రూ.150 కోట్లు అవసరమని గుర్తించాము. జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలన్నింటికీ పూర్తి స్థాయిలో రక్షిత నీటిని అందించేందుకు కృషి చేస్తాం' అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అక్కడే జరిగిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.


జిల్లా ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టిన సమస్యలను విన్న సీఎం కొన్నింటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో హామీలిచ్చారు. మరికొన్నింటి పరిష్కారానికి సానుకూలంగాస్పందించారు. జిల్లాలో వ్యవసాయం ముఖ్య ఆధారమని, నీరు ఉన్నా అది అందే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు. అందుకోసం చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసి, పది లక్షల ఎకరాలకు సాగు నీరందించే వీలును కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల విద్యుత్ వ్యవసాయ పంపుసెట్లు ఉండగా ఒక్క నల్లగొండ జిల్లాలోనే 2.42లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వం జిల్లా రైతులకు రూ.250 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీని గడిచిన ఆరు సంవత్సరాలుగా ఇస్తున్నదన్నారు. చేనేత సొసైటీలకు రూ.90 కోట్ల నిధులను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జిల్లాకు ఎంతో ఉపయోగకరమైన శ్రీశైలం సొరంగమార్గం పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో జిల్లాలోని 44 వేల మంది మహిళలకు అభయహస్తం పింఛను అందజేస్తామన్నారు. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిపించిన ఘనత జిల్లా ప్రజలదని ప్రశంసించారు.

అందుకు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉందని, జిల్లా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం జేశారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎస్సారెస్పీ రెండో దశ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు మాట్లాడిన జిల్లా ప్రజాప్రతినిధులు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరారు.

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 70 టీఎంసీల కృష్ణాజలాలను ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Click Here!

జిల్లాకు సీఎం వరాలు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా కు సీఎం వరాలు ప్రకటించారు. కూ రగాయల జోన్ కింద గుర్తించి మొదటి విడతగా ఐదువేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మహేశ్వరం మండలం కేసీతండాలో శుక్రవారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహేశ్వరంలో రూ.40 కోట్లతో 122 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే ప్రాజెక్టుకు, ఫ్యాబ్‌సిటీలో రూ.56 కోట్లతో ఏర్పాటు చేయనున్న 220/132/26 కేవీసబ్‌స్టేషన్‌కు, రూ.4.50 కోట్లతో బస్‌డిపో నిర్మాణానికి, రూ.1.45 కోట్లతో నిర్మించనున్న ఫైర్‌స్టేషన్లకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఇదే వేదికపై ఆధార్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఒక్కరోజే రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా రాష్ట్రానికే కేంద్ర బిందువుగా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా ఈ జిల్లా నుంచే ప్రారంభించారని, దేశానికే ఇది మార్గదర్శకం కావాలన్నారు. ఈ జిల్లా అంటే తనకు మక్కువేనని ముఖ్యమంత్రిగా రెండు నెలల కాలంలోనే ఆరుసార్లు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. జిల్లాలో 1100 ఐటీ కంపెనీలున్నాయని వీటి లో రెండు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు.

ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్‌లో మరో 15 రోజుల్లో వెయ్యి కోట్లతో టాటా కంపెనీ మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుందని, దీంట్లో వేయి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరిక మేరకు మహేశ్వరం ఆస్పత్రిని 30 నుంచి వంద పడకల స్థాయికి పెంచుతున్నామన్నారు. ఈ ప్రాంతంలోని భూములను అమ్ముకోకుండా, నమ్ము కుంటే కోటీశ్వరులవుతారన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం,ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టులతో జిల్లా రూపురేఖలే మారాయన్నారు.

ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుతో అన్ని చెరువులను నింపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు గాను కేంద్రం అనుమతి ఇచ్చిందని, ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 50 శాతం రాయితీ ప్రకటించారని దీనిని జాతీయ ప్రాజెక్టు కింద తీసుకుంటే 90 శాతం రాయితీ వస్తుందన్నారు. 30వేల కోట్లకు పైగా ఖర్చు కానున్న పోలవరం, ప్రాణహితలను పూర్తి చేస్తామని అన్నారు. పేద వర్గాలను వేధించవద్దని, వడ్డీ తగ్గించి మైక్రోఫైనాన్స్‌పై చట్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి పైసా పేదలకే చెందేటట్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు కుందూరు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, ఎమ్మెల్యేలు సు«ధీర్‌రెడ్డి, బిక్షపతి యాద వ్, శ్రీశైలం గౌడ్, ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.ఎస్.భాస్కర్, ఫౌరసరఫరాల కమిషనర్ సంజయ్ జాజు, ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ దానకిషోర్, జా యింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ వీరాచారి, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి పాల్గొన్నారు. స్మార్టు కార్డులతో ఎంతో ఉపయోగం.. కందుకూరు: దేశంలోనే ప్రథమం గా మహేశ్వరంలో ప్రవేశపెట్టిన స్మా ర్టు కార్డులు క్షేత్రస్థాయిలో ఎంతో ఉపయోగపడుతాయని ఆ పథకం నాలు గు రాష్ట్రాల ఇన్‌చార్జి వి.ఎస్.భాస్కర్ అన్నారు.

మహేశ్వరంలో జరిగిన సీఎం రచ్చబండ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సాంకేతిక పద్ధతి పరమైన సమస్యలను తట్టుకుని ప్రతి మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఆధార్ కార్డును ప్రవేశపెట్టామన్నారు. ఇక మీదట ఎక్కడున్నా తమ రేషన్‌ను తీసుకోవచ్చని అన్నారు. ఆధార్ కార్డును ప్రవేశపెట్టడం వల్ల మరోసారి రాష్ట్రంలో మహేశ్వరం కేం ద్ర బిందువుగా మారిందన్నారు. తీరనున్న తాగునీటి సమస్య.. హోంమంత్రి మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలోని 121 గ్రామాల్లో తాగునీటి సమస్య తీరనుందని, నలభై కోట్లతో కృష్ణా జలాలను ప్రతి గ్రామానికి సరఫరా చేసే పనులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రారంభించారని హోం మంత్రి సబితా ఇంద్రారె డ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరం లో రచ్చబండ అనంతరం నిర్వహించి న బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ కృష్ణా జలాలతో ఇక ఫ్లోరైడ్ సమస్య ఉండదన్నారు.

తెలుగు దేశం హయాంలో శిలాఫలకానికే పరిమితమైన మహేశ్వరంలో బస్సు డిపోను నాలుగు కోట్లతో పూర్తి చేయడానికి సీఎం కిరణ్ ఒప్పుకున్నారని, ఇందులో భాగంగా నేడు శంకుస్థాపన చేశారని వివరించారు. రంగారెడ్డి జిల్లాను కూరగాయల జోన్‌గా ప్రకటించామని, పాడి పరిశ్రమకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. వై.ఎస్ ప్రవేశపెట్టిన రచ్చబండను ప్రస్తుత సీఎం కొనసాగించడం అభినందనీయమన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విశిష్టమైన ఆధార్, స్మార్ట్ గుర్తింపు కార్డులను మహేశ్వరం నుంచి ప్రారంభించడం గర్వకారణమన్నారు.

ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉండాలని, ఆ గుర్తింపుతోనే ముందుకు పోవాలని ఆధార్ కార్డులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహేశ్వరం మండలంలోని 11 వేల కుటుంబ సభ్యులకు ఆధార్ నమోదు కావడం దేశంలోనే మహేశ్వరం మైలు రాయిగా నిలిచిందన్నారు. రానున్న ఎనిమిది నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు ఆధార్ స్మార్ట్ కార్డులను అందజేస్తామని తెలిపారు. రూ.246 కోట్లతో నీటి సరఫరా.. మంత్రి జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జా నారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా లో తాగునీటి కోసం కాంగ్రెస్ పభుత్వంలో రూ.246 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. రచ్చబండలో ఇచ్చిన అర్జీలను మూడు నెలల్లో పరిష్కారిస్తామన్నారు. రెండు సంవత్సరాల్లో 121 గ్రామాలకు కృ ష్ణా నీరు అందిస్తామన్నారు.

మహి ళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు రచ్చబండ ఓ పరిష్కార వేదిక అన్నారు. వ్యక్తిగత అభివృద్ధి, సంక్షేమ సమస్యల పరిష్కారం కోస మే రచ్చబండ అని, దీనిని ప్రతి ఒక్క రూ ఉపయోగించుకోవాలని కోరారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంజయ్‌జాజు మాట్లాడుతూ ఆధార్ స్మార్ట్ కార్డులు పూర్తి చేసిన మహేశ్వరం మండలం దేశంలోనే మొదటిదన్నా రు.ఇందులో కలెక్టర్ దానకిశోర్, యూనిక్ ఐడీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎస్.భాస్కర్, సుధీర్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, మహేశ్వరం ఎంపీపీ పాండునాయక్, సర్పంచ్ జ్యోతి శంకర్‌నాయక్, జడ్ పీటీసీ జంగయ్య, ఎంపీటీసీ శ్రీనివాసగౌడ్, శాంతి పాల్గొన్నారు.
Click Here!

No comments:

Post a Comment